‘మేం షారుక్ను కొనేశాం...’ షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ను ఆటపట్టించిన ప్రీతి జింటా..
సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా ఎక్కడ ఉంటే అక్కడ, ఆమె స్పెషల్ అట్రాక్షన్గా మారుతుంది. ఐపీఎల్ మినీ వేలంలో ముగ్గురు మహిళలు పాల్గొన్నారు. సన్రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్తో పాటు కేకేఆర్ సహ యజమాని జూహీ చావ్లా కూతురు జాహ్నావి మిశ్రాతో పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా కూడా వేలంలో పాల్గొంది. వేలంలో ఇద్దరు అమ్మాయిలు ఉన్నా, 46 ఏళ్ల ప్రీతి జింటాయే ప్రత్యేక ఆకర్షణ నిలిచింది.
రూ.53 కోట్లతో ఐపీఎల్ వేలానికి వచ్చిన పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా... రూ.34.40 కోట్లకు 9 మంది ప్లేయర్లను కొనుగోలు చేసింది. ఐపీఎల్ తర్వాత కూడా పంజాబ్ ఖాతాలో ఇంకా 18.60 కోట్లు ఇంకా మిగిలే ఉన్నాయి.
ఈ వేలంలో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్, జూహీ చావ్లా కూతురు జాహ్నావి మిశ్రా కలిసి కోల్కత్తా నైట్రైడర్స్ తరుపున వేలంలో పాల్గొన్నారు... అచ్చు తండ్రి లుక్లో మెరిసిన ఆర్యన్, సోషల్ మీడియాలో మంచి క్రేజ్ దక్కించుకోగలిగాడు...
తమిళనాడు ప్లేయర్ షారుక్ ఖాన్ను రూ.5 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. క్రికెటర్ షారుక్ ఖాన్ కోసం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య పోటీ జరిగినా, చివరికి ప్రతీ జింటా టీమ్దే పైచేయి అయ్యింది...
షారుక్ ఖాన్ను వేలంలో దక్కించుకున్న అనంతరం, బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ను ఆటపట్టించింది ప్రీతి జింటా.... ఆర్యన్ వైపు తిరిగి ‘మేం షారుక్ ఖాన్ను కొనేశాం’ అంటూ అరిచింది ప్రీతి జింటా...
ఐపీఎల్ వేలం 2021లో పంజాబ్ కింగ్స్ కోచ్ అనిల్ కుంబ్లే, టీమ్ సభ్యులతో సహా యజమాని ప్రతీ జింటా...
జూహ్లీ చావ్లా కూతురు జాహ్నావి మిశ్రాతో పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా స్పెషల్ చిట్ ఛాట్ ఇంటర్వ్యూ...
ఆటగాళ్ల కొనుగోలు గురించి పంజాబ్ కింగ్స్ కోచ్ అనిల్ కుంబ్లేతో చర్చిస్తున్న పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా...