MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • టార్గెట్ వరల్డ్ కప్ నెగ్గడమే, అందుకే ఇన్ని ప్రయోగాలు... టీమిండియా నయా సారథి రోహిత్ శర్మ...

టార్గెట్ వరల్డ్ కప్ నెగ్గడమే, అందుకే ఇన్ని ప్రయోగాలు... టీమిండియా నయా సారథి రోహిత్ శర్మ...

పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఓటమి ఎరుగకుండా విజయాల పరంపరను కొనసాగిస్తున్నాడు రోహిత్ శర్మ. వరుసగా 9 మ్యాచుల్లో నెగ్గిన రోహిత్ శర్మ, విండీస్‌ను టీ20ల్లో క్లీన్ స్వీప్ చేసి టీమిండియాని నెం.1 టీ20 టీమ్‌గా నిలబెట్టాడు..

1 Min read
Chinthakindhi Ramu
Published : Feb 21 2022, 12:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

కెప్టెన్‌గా స్వదేశంలో 15 టీ20 మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ, 14 మ్యాచుల్లో విజయాలు అందుకుని టాప్‌లో నిలిచాడు...

211

విరాట్ కోహ్లీ స్వదేశంలో కెప్టెన్‌గా 13 టీ20 విజయాలు అందుకుంటే, ఎమ్మెస్ ధోనీ 10 విజయాలు సాధించాడు. రోహిత్ ఈ ఇద్దరినీ అధిగమించేశాడు...

311

కెప్టెన్‌గా మొదటి 25 టీ20 మ్యాచుల్లో 21 విజయాలు అందుకున్నాడు రోహిత్ శర్మ. విరాట్ కోహ్లీ 16 విజయాలతో రెండో స్థానంలో ఉంటే, ఎమ్మెస్ ధోనీ 14 విజయాలతో టాప్ 3లో ఉన్నాడు...

411

‘మేం ఛేజింగ్ కోసం టీమ్‌ను సెలక్ట్ చేశాం. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్ వంటి చాలామంది రెగ్యూలర్ ప్లేయర్లు జట్టులో లేరు...

511

కాబట్టి తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చినా, ఛేజింగ్ చేయాల్సి వచ్చినా సిద్ధంగా ఉండేలా జట్టును తయారుచేయాలనేదే మా టార్గెట్...

611

మిడిల్ ఆర్డర్ ప్లేయర్లు కొత్తవాళ్లే. అయినా సిరీస్ గెలవడం సంతోషంగా ఉంది. చాలామంది ప్లేయర్లు మిస్ అయినా, వెస్టిండీస్‌ను ఓడించగలిగాం...

711

జట్టును విజయాలు అందుకుంటూ వెళ్లడం చాలా అవసరం. వన్డేలతో పోలిస్తే టీ20ల్లో మిడిల్ ఆర్డర్ చాలా బాగా రాణించింది. బౌలర్లు కూడా బాగా రాణించారు...

811

హర్షల్ పటేల్ జట్టుకి కొత్త, ఆవేశ్ ఖాన్ ఈ మ్యాచ్‌లో ఆరంగ్రేటం చేశాడు. శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వస్తూ, పోతూ ఉన్నాడు.. ఎలాంటి పరిస్థితులనైనా ఫేస్ చేయడానికి ప్లేయర్లు సిద్ధంగా ఉండాలి...

911

శ్రీలంక సిరీస్‌కి కొందరు ప్లేయర్లకు విశ్రాంతినిచ్చాం. ఎందుకంటే ప్రతీ ప్లేయర్ కూడా ఫ్రెష్‌గా ఉండాలి. మా ముందు ఇప్పుడున్న లక్ష్యం టీ20 వరల్డ్ కప్..

1011

మాకు ప్రత్యర్థి ఎవరనేది ముఖ్యం కాదు, జట్టుగా విజయాలు అందుకున్నామా... లేదా! అంతే... ’ అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ...

1111

శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కి విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్‌లకు విశ్రాంతి కల్పించారు సెలక్టర్లు...

About the Author

CR
Chinthakindhi Ramu
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ
రిషబ్ పంత్

Latest Videos
Recommended Stories
Recommended image1
వీళ్లే లచ్చిందేవి వారసులు.. ఐపీఎల్‌లో కోట్లు కొల్లగొట్టిన ప్లేయర్స్ లిస్టు ఇదిగో
Recommended image2
RCB అభిమానులకు గుడ్ న్యూస్.. మాస్టర్ ప్లాన్ అదిరిపోయిందిగా !
Recommended image3
ఇది కదా విధ్వంసం అంటే.! ఐపీఎల్ వేలంలో మళ్లీ ఆసీస్ ప్లేయర్ల ఊచకోత.. కొడితే కుంభస్థలమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved