MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • Cricket
  • ధోని కాదు.. యువీ క్రికెట్ కెరీర్ అతని వల్లే ముగిసింది : రాబిన్ ఉతప్ప షాకింగ్ కామెంట్స్

ధోని కాదు.. యువీ క్రికెట్ కెరీర్ అతని వల్లే ముగిసింది : రాబిన్ ఉతప్ప షాకింగ్ కామెంట్స్

భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన ఆల్‌రౌండర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన యువరాజ్ సింగ్ క్రికెట్ జీవితం నాశనమైంది ధోనీ వల్ల కాదనీ, మరో కెప్టెన్ వల్ల అని టీం ఇండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉత్తప్ప షాకింగ్ కామెంట్స్ చేశారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 10 2025, 10:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

యువరాజ్ సింగ్.. ప్రపంచ క్రికెట్ కు పరిచయం అక్కరలేని పేరు. అతనదైన ఆటతో అంతర్జాతీయ క్రికెట్ లో ఎప్పటికీ చెరిగిపోని ముద్రవేశాడు  యూవీ. భారత క్రికెట్ జట్టులో అత్యంత విజయవంతమైన ఆల్‌రౌండర్‌లలో ఒకరిగా గుర్తింపు సాధించాడు. 2007 ఐసీసీ టీ20 ప్రపంచ కప్, 2011 ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టీమిండియా గెలవడంలో యువరాజ్ కీలక పాత్ర పోషించారు.

2007 ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ పేసర్ స్టీవర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో 6 బాల్స్‌లో 6 సిక్సర్లు బాదిన సంగతి ఎవరూ మర్చిపోలేరు. అదేవిధంగా 2011 వన్డే ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శనతో ఈ మెగా టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

2011 ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌లో యువరాజ్ సింగ్ ఒక సెంచరీతో మొత్తం  362 పరుగులు చేశారు. బ్యాటింగ్ లోనే కాకుండా అద్బుతమైన బౌలింగ్‌తో 15 వికెట్లు తీసుకున్నాడు. 28 ఏళ్ల తర్వాత టీం ఇండియా వన్డే ప్రపంచ కప్ గెలవడంలో యూవీ కీలక పాత్ర పోషించారు.

భారతదేశంలో అత్యంత నమ్మకమైన ఆటగాడిగా గుర్తింపు పొందిన యువరాజ్ సింగ్‌కి క్యాన్సర్ వచ్చిన వార్త అతని అభిమానులతో పాటు క్రీడా ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది. క్యాన్సర్‌తో ధైర్యంగా పోరాడిన యువీ, క్యాన్సర్‌ను ఓడించి క్రికెట్ మైదానానికి తిరిగి రావడం చాలా మంది క్యాన్సర్ బాధితులకు స్ఫూర్తినిచ్చింది.

35

అయితే, ధైర్యం కోల్పోని యువరాజ్ సింగ్ 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే ఇక్కడ అతని నుంచి పెద్ద ఇన్నింగ్స్ లు రాకపోవడంతో యువరాజ్ సింగ్‌ను జట్టు నుంచి తప్పించారు. ఆ సమయంలో భారత జట్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఉన్నాడు.

అయితే, యువరాజ్ సింగ్ క్రికెట్ కు దూరం కావడానికి ధోని క్రికెట్ సర్కిల్ లో చాలా సార్లు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే, యూవీ క్రికెట్ కు దూరం కావడానికి ధోని కారణం కాదని భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప పేర్కొన్నాడు. యూవీ క్రికెట్ జీవితం అనుకోకుండా మధ్యలోనే ముగియడానికి కారణం ధోనీ కాదు, విరాట్ కోహ్లీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

45

యువరాజ్ సింగ్ క్యాన్సర్‌ను ఓడించి జట్టుకు తిరిగి వచ్చారు. మన వాళ్లతో కలిసి రెండు ప్రపంచ కప్ లను భారత్ కు అందించాడు. అలాంటప్పుడు కెప్టెన్ అయిన వ్యక్తి అలాంటి ఆటగాడు జట్టుకు తిరిగి వచ్చినప్పుడు అతని వెంట నిలబడాలి. కెప్టెన్‌గా ఒక రకమైన ప్రమాణాన్ని కలిగి ఉండాలి అని ఉతప్ప అన్నారు.

కొన్నిసార్లు నియమాలను కొన్ని సందర్భాల్లో సడలించుకోవాలి. ఎందుకంటే యువరాజ్ కేవలం ట్రోఫీనే గెలవలేదు, క్యాన్సర్‌ను కూడా ఓడించారు. అతను తన జీవితంలో కష్టతరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. యువరాజ్ సింగ్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో తనకు 2 మార్కులు తగ్గించమని కోరారు. కానీ కెప్టెన్ అంగీకరించలేదని రాబిన్ ఉతప్ప చెప్పాడు.

55

"అయితే, దీని తర్వాత యువరాజ్ సింగ్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో ఉత్తీర్ణులయ్యారు. జట్టుకు కూడా తిరిగి వచ్చారు. కానీ అతని ప్రదర్శన అంతగా బాగాలేదు. అందుకే అతన్ని జట్టు నుంచి పూర్తిగా తప్పించారు. దీని తర్వాత అతనికి జట్టులో అవకాశమే రాలేదు" అని ఉతప్ప అన్నారు.

లీడర్‌షిప్ గ్రూప్‌లో ఉన్నవారు యువరాజ్ సింగ్‌కు మళ్లీ అవకాశం ఇవ్వలేదు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నారు. అతని కఠినమైన వ్యక్తిత్వం కారణంగా అంతా అతను అనుకున్నట్లుగానే జరిగింది అని రాబిన్ ఉతప్ప అన్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
ఎం.ఎస్. ధోని
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved