విరాట్ కోహ్లీని మాత్రం ఏమీ అనకండి... ఆస్ట్రేలియాకి వార్నింగ్ ఇచ్చిన ఆరోన్ ఫించ్...
First Published Dec 15, 2020, 11:42 AM IST
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ... ఆస్ట్రేలియా సిరీస్ను ఘనంగా ఆరంభించకపోయినా టీ20 సిరీస్ గెలిచి, తనపై వచ్చిన విమర్శలకు ధీటుగా సమాధానం ఇచ్చాడు. బ్యాటుతోనే రాణించిన విరాట్ కోహ్లీ... ప్రస్తుతం డిసెంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే పింక్ బాల్ టెస్టు కోసం సన్నద్ధమవుతున్నాడు. ఐపీఎల్లో తనకి కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీని సెడ్జింగ్ చేయొద్దని ఆస్ట్రేలియా జట్టు ప్లేయర్లకు వార్నింగ్ ఇచ్చాడు ఆసీస్ వన్డే, టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్.

మిగిలిన దేశాల ప్లేయర్లతో పోలిస్తే భారత క్రికెటర్ల స్టైల్ వేరుగా ఉంటుంది. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రత్యర్థి ఆటగాళ్లు రెచ్చగొడితే, బ్యాటుతో రెచ్చిపోయి అదిరిపోయే ఆన్సర్ ఇస్తారు ఇండియన్ క్రికెటర్లు...

యువరాజ్ సింగ్ సిక్సర్ల మోత అయినా, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ వంటి బ్యాట్స్మెన్ బౌండరీల వర్షం కురిపించినా వాటి వెనకాల వారిని రెచ్చగొడుతూ సెడ్జింగ్కి పాల్పడిన ఓ ప్లేయర్ కచ్ఛితంగా ఉంటాడు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?