MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ముంబైకి జాక్‌పాట్: ₹25 కోట్ల ప్లేయర్ ను ₹8 కోట్లకే కొట్టేసింది !

ముంబైకి జాక్‌పాట్: ₹25 కోట్ల ప్లేయర్ ను ₹8 కోట్లకే కొట్టేసింది !

IPL 2025 Auctions:  2025 ఐపీఎల్ క్రికెట్ సీజన్ కోసం సన్నాహాలు ఊపందుకుంటున్న వేళ, ముంబై ఇండియన్స్ జట్టు 25 కోట్ల రూపాయల విలువైన యంగ్ ఇండియన్ ప్లేయర్ ను కేవలం రూ.8 కోట్లకే దక్కించుకుంది.

2 Min read
Mahesh Rajamoni
Published : Nov 24 2024, 02:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ముంబై ఇండియన్స్ ఫ్యాబ్ ఫోర్

ముంబై ఇండియన్స్ ఫ్యాబ్ ఫోర్

ఐపీఎల్ క్రికెట్‌లో ముంబై ఇండియన్స్ జట్టు వేలం ముందే అసాధారణ వ్యూహాన్ని అవలంబిస్తుంది. ఈ ఏడాది కూడా తన స్మార్ట్ మూవ్ ద్వారా ₹25 కోట్ల విలువైన యువ బ్యాట్స్‌మన్‌ను ₹8 కోట్లకే తమ జట్టులో ఉంచుకుంది. మరి ఆ ₹25 కోట్ల విలువైన ఆటగాడు ఎవరు? ముంబై ఇండియన్స్ కు వేలం ముందే దక్కిన జాక్ పాక్ ఏంటనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

25
తిలక్ వర్మ

తిలక్ వర్మ

ఐపీఎల్ 2025 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. వారిలో టీమిండియా యంగ్ ప్లేయర్ 22 ఏళ్ల తిలక్ వర్మ ఒకరు. ముంబై ఇండియన్స్ ఈ తెలుగు ప్లేయర్ ను ₹8 కోట్లకు రిటైన్ చేసుకుంది. కానీ అతని ప్రస్తుత ఫామ్‌ను చూస్తే ఐపీఎల్ 2025 వేలంలో ₹25 కోట్ల వరకు ధర పలికే వాడు.

35
ముంబై ఇండియన్స్

ముంబై ఇండియన్స్

సూపర్ ఫామ్‌లో తిలక్ వర్మ

22 ఏళ్ల తిలక్ వర్మ ఇటీవల భారత టీ20 జట్టులోకి తిరిగి వచ్చి దక్షాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లలో అద్భుతమైన సెంచరీలు సాధించాడు. తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 తొలి మ్యాచ్‌లో 151 పరుగులు చేశాడు. హైదరాబాద్ తరఫున 67 బంతుల్లో 151 పరుగులు చేయడంతో నిపుణులు, అభిమానులు ముంబై గొప్ప స్మార్ట్ మూవ్ చేసిందని అంటున్నారు. తక్కువ ధరకే తిలక్‌ను కొనుగోలు చేయడం ద్వారా ముంబై లాభపడిందని అభిమానులు భావిస్తున్నారు.

45
ఐపీఎల్ వేలం 2025

ఐపీఎల్ వేలం 2025

ముంబై రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు

ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. తిలక్ వర్మతో పాటు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మలను ముంబై తమ జట్టులో ఉంచుకుంది.

55
ఐపీఎల్ వేలం 2025

ఐపీఎల్ వేలం 2025

ముంబై ఇండియన్స్ జట్టు సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ₹18 కోట్లకు, సూర్యకుమార్ యాదవ్‌ను ₹16.35 కోట్లకు, ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ₹16.35 కోట్లకు, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ₹16.30 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ముంబై ఏ ఆటగాళ్లను తీసుకుంటుందో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
ఒక్క పరుగు టార్గెట్.. క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డు.. సూపర్ ఓవర్‌లో భారత్ కు షాక్
Recommended image2
WPL : 20 మంది స్టార్‌లపై ఫోకస్.. కోట్లు కుమ్మరించడానికి సిద్ధంగా ఫ్రాంచైజీలు
Recommended image3
ఐపీఎల్ 2026 వేలం: కావ్య పాప మాస్టర్ ప్లాన్ బయటపడ్డది ! ఎవరిపై కన్నేసిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved