భారత జట్టు కంటే ముంబై ఇండియన్స్ బెటర్ టీమ్... ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కామెంట్...
అవకాశం దొరికనప్పుడల్లా టీమిండియాను విమర్శించడానికి రెఢీగా ఉంటాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాగన్. తాజాగా తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా ఘోర పరాజయం తర్వాత మరోసారి భారత జట్టు ప్రదర్శనను విమర్శిస్తూ ట్వీట్ చేశాడు మైఖేల్ వాగన్...

<p>3 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా, తొలి టీ20 మ్యాచ్లో కేవలం 124 పరుగుల స్వల్ప టార్గెట్ను మాత్రమే నిర్ధేశించగలిగింది. బౌలర్లు కూడా పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోవడంతో ఇంగ్లాండ్కి 8 వికెట్ల తేడాతో ఈజీ విజయం దక్కింది...</p>
3 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా, తొలి టీ20 మ్యాచ్లో కేవలం 124 పరుగుల స్వల్ప టార్గెట్ను మాత్రమే నిర్ధేశించగలిగింది. బౌలర్లు కూడా పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోవడంతో ఇంగ్లాండ్కి 8 వికెట్ల తేడాతో ఈజీ విజయం దక్కింది...
<p>రోహిత్ శర్మ లేకపోవడంతో భారత బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా వీక్ అయిపోయింది. రోహిత్ స్థానంలో వచ్చిన శిఖర్ ధావన్, హార్డ్ హిట్టర్లు హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. </p>
రోహిత్ శర్మ లేకపోవడంతో భారత బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా వీక్ అయిపోయింది. రోహిత్ స్థానంలో వచ్చిన శిఖర్ ధావన్, హార్డ్ హిట్టర్లు హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు.
<p>భారత సారథి విరాట్ కోహ్లీ కూడా డకౌట్ కావడంతో టీమిండియా, ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో టాప్లో ఉన్న ఇంగ్లాండ్కి ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. టాప్ క్లాస్ పర్ఫామెన్స్తో ఇంగ్లాండ్ జట్టు, టీమిండియాను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టేసింది...</p>
భారత సారథి విరాట్ కోహ్లీ కూడా డకౌట్ కావడంతో టీమిండియా, ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో టాప్లో ఉన్న ఇంగ్లాండ్కి ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. టాప్ క్లాస్ పర్ఫామెన్స్తో ఇంగ్లాండ్ జట్టు, టీమిండియాను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టేసింది...
<p>‘టీమిండియా కంటే ముంబై ఇండియన్స్ బెటర్ టీ20 టీమ్’... అంటూ ట్వీట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాగన్. ఈ ట్వీట్ను ముంబై ఇండియన్స్ అభిమానులు, హిట్ మ్యాన్ అభిమానులు సపోర్టు చేస్తున్నారు...</p>
‘టీమిండియా కంటే ముంబై ఇండియన్స్ బెటర్ టీ20 టీమ్’... అంటూ ట్వీట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాగన్. ఈ ట్వీట్ను ముంబై ఇండియన్స్ అభిమానులు, హిట్ మ్యాన్ అభిమానులు సపోర్టు చేస్తున్నారు...
<p>అయితే మైఖేల్ వాగన్ ట్వీట్కి భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. ‘అన్ని జట్లకి నలుగురు విదేశీ ప్లేయర్లను ఆడించే అవకాశం రాదు కదా... మైఖేల్’ అంటూ కామెంట్ చేశాడు వసీం జాఫర్..</p>
అయితే మైఖేల్ వాగన్ ట్వీట్కి భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. ‘అన్ని జట్లకి నలుగురు విదేశీ ప్లేయర్లను ఆడించే అవకాశం రాదు కదా... మైఖేల్’ అంటూ కామెంట్ చేశాడు వసీం జాఫర్..
<p>ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టులో ఉన్న జాసన్ రాయ్ సౌతాఫ్రికా ప్లేయర్ కాగా, బెన్ స్టోక్స్ న్యూజిలాండ్, ఇయాన్ మోర్గాన్ ఐర్లాండ్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ జోర్డాన్ బర్బోడాస్ దేశానికి చెందినవాళ్లు. దీంతో ఇంగ్లాండ్ జట్టుపై సెటైరికల్గా ట్వీట్ వేశాడు వసీం జాఫర్..</p>
ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టులో ఉన్న జాసన్ రాయ్ సౌతాఫ్రికా ప్లేయర్ కాగా, బెన్ స్టోక్స్ న్యూజిలాండ్, ఇయాన్ మోర్గాన్ ఐర్లాండ్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ జోర్డాన్ బర్బోడాస్ దేశానికి చెందినవాళ్లు. దీంతో ఇంగ్లాండ్ జట్టుపై సెటైరికల్గా ట్వీట్ వేశాడు వసీం జాఫర్..
<p>హిట్ మ్యాన్ ఫ్యాన్స్ మాత్రం రోహిత్ శర్మ జట్టులో ఉండి ఉంటే, పరిస్థితి వేరేగా ఉండేదని కామెంట్ చేస్తున్నారు. ముంబై ఇండియన్స్కి సారథిగా ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ మంచి ఫామ్లో ఉన్నప్పుడు పక్కనపెట్టడం ఏంటని నిలదీస్తున్నారు...</p>
హిట్ మ్యాన్ ఫ్యాన్స్ మాత్రం రోహిత్ శర్మ జట్టులో ఉండి ఉంటే, పరిస్థితి వేరేగా ఉండేదని కామెంట్ చేస్తున్నారు. ముంబై ఇండియన్స్కి సారథిగా ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ మంచి ఫామ్లో ఉన్నప్పుడు పక్కనపెట్టడం ఏంటని నిలదీస్తున్నారు...
<p>శిఖర్ ధావన్, హార్ధిక్ పాండ్యా, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ చాలాకాలంగా జట్టుకి దూరంగా ఉన్నారు. విరాట్ కోహ్లీ సరైన ఫామ్లో లేడు. ఇలాంటి సమయంలో టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్గా నిలిచిన రోహిత్ను పక్కనబెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు...</p>
శిఖర్ ధావన్, హార్ధిక్ పాండ్యా, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ చాలాకాలంగా జట్టుకి దూరంగా ఉన్నారు. విరాట్ కోహ్లీ సరైన ఫామ్లో లేడు. ఇలాంటి సమయంలో టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్గా నిలిచిన రోహిత్ను పక్కనబెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు...