MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Dhoni: నాకు అన్నీ క్రికెట్టే! రిటైర్మెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ పై ధోని ఏం చెప్పాడో తెలుసా?

Dhoni: నాకు అన్నీ క్రికెట్టే! రిటైర్మెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ పై ధోని ఏం చెప్పాడో తెలుసా?

MS Dhoni: 2025 ఐపీఎల్‌తో రిటైర్మెంట్ ఉంటుందా అనే ప్రశ్నకు.. నాకు అన్నీ క్రికెట్టే, ఎంత వరకు వీలైతే అంత వరకు ఆడతా అంటూ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని చెప్పాడు.

3 Min read
Mahesh Rajamoni
Published : Feb 21 2025, 08:49 AM IST| Updated : Feb 21 2025, 11:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 తర్వాత తన భవిష్యత్ ప్రణాళికల గురించి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ లెజెండరీ వికెట్ కీపర్-బ్యాటర్ రాబోయే ఐపీఎల్ సీజన్‌లో క్రికెట్ ఆడతాడు. మార్చి 23న చెపాక్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్ లో చెన్నై తరఫున బరిలోకి దిగుతాడు.

ఐపీఎల్ 2024 లీగ్ దశ నుంచి సీఎస్కే నిష్క్రమించిన తర్వాత, ధోనీ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఊహాగానాలు వచ్చాయి. అయితే, చెన్నై ఫ్రాంచైజీ తమ ఆటగాడిని ఐపీఎల్ 2025 వేలానికి ముందు 4 కోట్లకు అట్టిపెట్టుకున్న తర్వాత పుకార్లకు తెరపడింది. ఈసారి ధోనీ అన్‌క్యాప్డ్‌గా ఆడతాడు. ఎందుకంటే అతను ఐదేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 

ఎంఎస్ ధోనీ ఈ సంవత్సరం తన ఐపీఎల్ కెరీర్‌లో 18వ సీజన్‌ ఆడనున్నాడు. అయితే, ధోని ఐపీఎల్ 2025 తర్వాత రిటైర్ అవుతాడా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

26

ఇదే విషయంపై ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ధోని మాట్లాడుతూ.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ తర్వాత క్రికెట్‌ను ఎలా ఆస్వాదిస్తున్నాడో చెప్పాడు. “నేను 2019 నుంచి రిటైర్ అయ్యాను. అప్పటి నుంచి క్రికెట్‌ను ఆస్వాదించాలని అనుకుంటున్నాను. నేను స్కూల్‌లో ఉన్నప్పుడు ఎలా ఆడేవాడినో.. ఇప్పుడు కూడా అలానే ఆస్వాదించాలనుకుంటున్నాను. నేను కాలనీలో ఉన్నప్పుడు సాయంత్రం 4 గంటలకు ఆట మొదలయ్యేది. మేం క్రికెట్ ఆడేందుకు వెళ్లేవాళ్లం” అని ధోని అన్నాడు. అలాగే, క్రికెట్ తనకు అన్నీ అని ధోని చెప్పాడు. 

36

ఎంఎస్ ధోనీ 2004లో భారత క్రికెట్ జట్టు తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. టీమ్ ఇండియాకు గొప్ప ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. ధోనీ కెప్టెన్‌గా 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాడు. మూడు ఐసీసీ టోర్నమెంట్లు గెలిచిన మొదటి కెప్టెన్‌గా నిలిచాడు. ధోనీ చివరిసారిగా 2019లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో ఆడాడు. ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. విచిత్రమైన విషయం ఏమిటంటే ధోనీ కెరీర్ మొదలైంది, ముగిసింది కూడా రనౌట్‌తోనే.

46

అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత, ఎంఎస్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. ధోనీ నాయకత్వంలో సీఎస్కే 2021లో ఐదో ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో, ధోనీ ఐపీఎల్ చరిత్రలో రోహిత్ శర్మతో కలిసి అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు.

56

భారత జట్టుకు ఆడాలనేది తన కల అని ధోని చెప్పాడు. దేశం అంటే తనకు చాలా ఇష్టమని తెలిపాడు. “ఒక క్రికెటర్‌గా నేను ఎప్పుడూ భారత క్రికెట్ జట్టుకు ఆడాలని అనుకున్నాను. ఎందుకంటే దేశం కోసం ఆడే అవకాశం అందరికీ రాదు. మేం పెద్ద వేదికపై ఉన్నా లేదా పర్యటనకు వెళ్లినా దేశానికి గర్వకారణంగా నిలిచే అవకాశం మాకు ఉంది. అందుకే నాకు దేశమే మొదటి ప్రాధాన్యం” అని ధోని చెప్పాడు.

66

అలాగే, యంగ్  క్రికెటర్లకు ధోని ఎప్పుడూ సలహాలు ఇస్తుంటాడు. అలాగే, ఇప్పుడు కూడా కొన్ని సలహాలు ఇచ్చారు.  మీకు ఏది మంచిదో మీరు తెలుసుకోవాలని అన్నాడు. . 

“మీకు ఏది మంచిదో మీరు తెలుసుకోవాలి. నేను ఆడేటప్పుడు క్రికెట్ అంటే నాకు అన్నీ అని అనుకునేవాడిని. వేరే ఏదీ ముఖ్యం కాదు. నేను ఏ టైమ్‌కి పడుకోవాలి? ఏ టైమ్‌కి లేవాలి? అది క్రికెట్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనేదే ముఖ్యం” అని ధోని చెప్పాడు. 

“దోస్తాన్, సరదాలు, పార్టీలు అన్నీ తర్వాతే. ప్రతిదానికీ ఒక సమయం ఉంటుంది. దాన్ని మీరు గుర్తిస్తే మీకంటే గొప్పగా ఎవరూ ఉండరు” అని ధోని అన్నారు.

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఎక్కువ పరుగులు చేసిన వారిలో ధోని రెండో స్థానంలో ఉన్నాడు. గత ఐపీఎల్ సీజన్‌లో ధోనికి గాయం ఉన్నప్పటికీ అన్ని మ్యాచ్‌లు ఆడాడు. ధోని తన ఆరో ఐపీఎల్ టైటిల్ గెలుస్తాడని అందరూ అనుకుంటున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved