ధోనీ రెండోసారి తండ్రయ్యాడా..? ఫోటో షేర్ చేసిన సాక్షి
జీవా క్యూట్ నెస్ కి ఎవరైనా ఫిదా కావాల్సిందే. సాక్షి.. తమ గారాల పట్టి ఫోటో ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చాలు.. అలా ఆ ఫోటో వైరల్ అయ్యేది.
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, మిస్టర్ కూల్ ధోనీ మరోసారి తండ్రి అయ్యారా..? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది. ధోనీ భార్య సాక్షి ధోనీ తాజాగా.. సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ ఫోటో ని చూసి అభిమానులు ఇలానే ప్రశ్నిస్తున్నారు.
ఆ ఫోటోలొ ధోనీ ముద్దుల కుమార్తె జీవా తన ఒడిలో మరో చిన్నా బేబీని పట్టుకొని కూర్చొంది. దీంతో.. అభిమానులంతా వెంటనే ధోనీ మరోసారి తండ్రి అయ్యాడా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ మీద కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకీ ఆ ఫోటో కథేంటో ఇప్పుడు చూద్దాం..
మహేంద్ర సింగ్ ధోనీ 2010 జులై 4న సాక్షిని వివాహం చేసుకున్నారు. కాగా.. 2015 ఫిబ్రవరి 6వ తేదీన వారికి జీవా జన్మించింది.
జీవా క్యూట్ నెస్ కి ఎవరైనా ఫిదా కావాల్సిందే. సాక్షి.. తమ గారాల పట్టి ఫోటో ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చాలు.. అలా ఆ ఫోటో వైరల్ అయ్యేది.
కాగా.. తాజాగా సాక్షి... జీవాకి సంబంధించి ఓ ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫోటోలో జీవా ఓ చిన్న బేబీని ఒడిలో పెట్టుకొని కూర్చొని ఉంది.
దీంతో.. ఆ ఫోటో చూసి అభిమానులకు కొత్త డౌట్స్ వచ్చాయి. ధోనీ మరోసారి తండ్రి అయ్యాడా..? అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.
జీవాకి తమ్ముడు పుట్టాడా..? చెల్లి పుట్టిందా అంటూ.. అభిమానులు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. కొన్ని వేల మంది ఈ కామెంట్ చేయడం గమనార్హం.
అయితే... ధోనీ మరోసారి తండ్రి కాలేదన్న విషయం తర్వాత తెలిసింది. మరి జీవా ఎత్తుకున్న బుజ్జాయి ఎవరు అనే కదా మీ డౌట్.
ఇటీవల తండ్రి అయిన... హార్దిక్ పాండ్యా కొడుకునే జీవా ఎత్తుకుంది. హార్దిక్ బాబుని చూడటానికి ధోనీ.. జీవాతో కలిసి అక్కడకు వెళ్లారట. ఆ సమయంలో.. జీవా.. ఆ బుజ్జి బాబుని ఎత్తుకొని ఫోటోకి ఫోజులు ఇచ్చింది.
ఆ ఫోటోలనే సాక్షి తన సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది.