మిథాలీరాజ్ కెప్టెన్సీలో సచిన్ టీమ్లా మారిన టీమిండియా వుమెన్స్ జట్టు... వరుసగా రెండో మ్యాచ్లోనూ...
భారత వుమెన్స్ టీమ్ కెప్టెన్ మిథాలీరాజ్ను అందరూ ‘లేడీ సచిన్’ అని పిలుస్తారు. మహిళల క్రికెట్లో తనదైన స్టైల్లో రికార్డుల వర్షం కురిపిస్తున్న మిథాలీ, మరో విషయంలో కూడా సచిన్ టెండూల్కర్ను గుర్తుకు తెస్తోంది...
క్రికెట్లో సచిన్ టెండూల్కర్ గ్రేట్ ప్లేయర్. అయితే కెప్టెన్గా మాత్రం ‘మాస్టర్’ రికార్డు ఏ మాత్రం మెరుగ్గా లేదు. అయితే సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో టీమిండియా గెలుపు కోసం ఓ ప్లేయర్గా, కెప్టెన్గా ఆయన చేయాల్సిందంతా చేశాడు, కానీ జట్టులో సభ్యుల నుంచి ఎలాంటి సహకారం లభించలేదు...
ఇప్పుడు భారత మహిళా జట్టు పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. ఇంగ్లాండ్ టూర్లో భారత జట్టు వరుసగా రెండు వన్డేల్లోనూ ఓడింది. ఈ రెండూ వన్డేల్లోనూ మిథాలీరాజ్ హాఫ్ సెంచరీలతో టాప్ స్కోరర్గా నిలవడం విశేషం...
ఏకైక టెస్టులో అద్భుత పోరాటం చూపించిన భారత మహిళా జట్టు, వన్డే సిరీస్లో మాత్రం పోరాట ప్రటిమ చూపించలేకపోతోంది... అయితే 22 ఏళ్ల క్రికెట్ అనుభవం ఉన్న మిథాలీరాజ్ మాత్రం ఒంటరి పోరాటం చేసి, క్రికెట్ ఫ్యాన్స్ మనసు గెలుచుకుంది.
రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 221 పరుగులకి ఆలౌట్ అయ్యింది. స్మృతి మంధాన 30 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేయగా, యంగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ 55 బంతుల్లో 7 ఫోర్లతో 44 పరుగులు చేసింది.
జెమీమా రోడ్రిగ్స్ 8, హర్మన్ప్రీత్ కౌర్ 39 బంతుల్లో 19, దీప్తి శర్మ 5, తానియా భాటియా 2, షికా పాండే 2 పరుగులు చేసి తీవ్రంగా నిరాశ పరిచారు...
భారత కెప్టెన్ మిథాలీరాజ్ 92 బంతుల్లో 6 ఫోర్లతో 59 పరుగులు చేసి టాప్స్కోరర్గా నిలిచింది. ఇంగ్లాండ్లో వన్డేల్లో 50+ స్కోరు చేసిన భారత క్రికెటర్గా మిథాలీరాజ్ సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది.
మిథాలీరాజ్ ఇంగ్లాండ్లో 14 హాఫ్ సెంచరీ స్కోర్లు చేయగా, రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డేల్లో 13 సార్లు ఈ ఫీట్ సాధించారు... తొలి వన్డేలో మిథాలీరాజ్ 72 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
భారత సీనియర్ పేసర్ జులన్ గోస్వామి 19 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా ఇంగ్లాండ్ పేసర్ కేట్ క్రాస్ 10 ఓవర్లలో 34 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది.
భారత బౌలర్లు కూడా ఆరంభంలో అదరగొట్టడంతో 133 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్ జట్టు. అయితే సోఫియా డంక్లీ 73 పరుగులు, క్యాథరిన్ బ్రంట్ 33 పరుగులు చేసి ఇంగ్లాండ్కి విజయాన్ని అందించారు. మూడు వన్డేల సిరీస్ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది ఇంగ్లాండ్ జట్టు.