MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఐదో టెస్టుపై ఎటూ తేల్చని ఐసీసీ... వచ్చే ఏడాదిలో సిరీస్ ముగించాలని...

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఐదో టెస్టుపై ఎటూ తేల్చని ఐసీసీ... వచ్చే ఏడాదిలో సిరీస్ ముగించాలని...

ఐపీఎల్ 2021 ఫేజ్ 2 ఆరంభానికి ముందు భారత్, ఇంగ్లాండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా జరగాల్సిన ఐదో టెస్టు, కరోనా వల్ల అర్ధాంతరంగా రద్దైన విషయం తెలిసిందే. అయితే సిరీస్ ఫలితంపై నిర్ణయం తీసుకునే బాధ్యతను ఐసీసీకి అప్పగించింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Sep 25 2021, 03:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

భారత బృందంలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడడం, ఆటగాళ్లకు కరోనా పరీక్షల్లో నెగిటివ్ రిజల్ట్ వచ్చినా ఐదో టెస్టు ఆరంభానికి ముందు టీమిండియా మ్యాచ్ ఆడేందుకు అంగీకరించకపోవడంతో మ్యాచ్ రద్దు చేయాల్సి వచ్చింది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

మాంచెస్టర్ టెస్టు ఆరంభానికి కొన్ని గంటల ముందు మ్యాచ్ ఆడడానికి భారత ఆటగాళ్లు భయపడడంతో టెస్టును అర్ధాంతరంగా రద్దు చేయాల్సి వచ్చిందని, కాబట్టి మ్యాచ్‌ను ‘ఫోర్‌ఫీట్‌’గా పరిగణించాలని ఐసీసీని కోరింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు... 

39

అయితే ఐసీసీ మాత్రం ఈ విషయంపై ఇంకా ఎటూ తేల్చలేకపోతోంది... కరోనా కారణంగా చాలా సిరీస్‌లు రద్దు చేయాల్సి వచ్చింది, కొన్ని టూర్‌లను వాయిదా వేయాల్సి వచ్చింది...

49

డిసెంబర్‌లో ఆస్ట్రేలియాలో యాషెస్ సిరీస్ ఆడాల్సిన ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కూడా ఆతిథ్య దేశంలో కరోనా నియామాలను చూసి భయపడుతోంది... రూల్స్ సరళీకృతం చేయకపోతే ఆసీస్ టూర్‌ను రద్దు చేసుకుంటామని కొందరు ప్లేయర్లు హెచ్చరించారు కూడా...

59

విపత్తు సమయంలో ఇలా క్రికెట్‌కి కరోనా అంతరాయం కలిగించడం చాలా కామన్‌గా మారిపోయింది. దీంతో ఐదో టెస్టు ఫలితాన్ని ఇంగ్లాండ్ ఖాతాలో వేసేందుకు ఐసీసీ సుముఖంగా లేదని సమాచారం...

69

నాలుగు టెస్టుల్లో రెండింట్లో గెలిచిన టీమిండియాకి 2-1 తేడాతో సిరీస్‌ను అప్పగించడానికి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సముఖంగా లేదు. దీంతో వచ్చే ఏడాది ఇంగ్లాండ్ పర్యటనలో టెస్టు సిరీస్‌ను ముగించాలని భావిస్తున్నారట...

79

ఇప్పటికే బీసీసీఐతో పాటు ఈసీబీ కూడా ఈ ఏడాది టెస్టు సిరీస్ ఇక్కడితో ముగిసిందని, వచ్చే ఏడాది జరిగే మ్యాచ్ ఏకైక టెస్టుగా పరిగణిస్తామని ప్రకటించాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని కూడా టెస్టు సిరీస్‌లో భాగంగా పరిగణించాలని భావిస్తున్నారు...

89

ఇప్పటికే ఐదో టెస్టు రద్దు కావడంతో ఇంగ్లాండ్ బోర్డుకు కలిగిన నష్టాన్ని పూడ్చేందుకు వచ్చే ఏడాది మరో రెండు టీ20 మ్యాచులు అధికంగా ఆడేందుకు అంగీకరించింది బీసీసీఐ...

99

షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది జూన్‌లో ఇంగ్లాండ్‌లో పర్యటించే భారత జట్టు... మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడాల్సి ఉంది. అయితే ఇప్పుడు మరో టెస్టు లేదా రెండు టీ20 మ్యాచులు అదనంగా ఆడనున్నారు...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
TG20 League : హర్షిత్ దెబ్బకు ఖమ్మం విలవి.. వరంగల్ వారియర్స్ వండర్ఫుల్ విక్టరీ
Recommended image2
Indian Cricketers Padma Shri: రోహిత్ శర్మకు దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం.. పద్మశ్రీ అందుకున్న 16 మంది క్రికెటర్లు వీరే
Recommended image3
Virat Kohli Marksheet : కోహ్లీకి టెన్త్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా? హయ్యెస్ట్, లోయెస్ట్ ఏ సబ్జెక్టుల్లో?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved