ఓ వైపు వికెట్లు పడుతుంటే, ఆమెను పడేసే పనిలో బిజీగా జెమ్మీసన్... సోషల్ మీడియాలో వాళ్లిద్దరే ట్రెండింగ్...
ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో ఆడిన మొదటి మ్యాచ్లో చిత్తుగా ఓడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అటు బ్యాటింగ్లో,ఇటు బౌలింగ్లో దారుణంగా విఫలమై, ఆల్రౌండ్ ఫ్లాప్ షో ఇచ్చింది. అయితే మ్యాచ్ సీరియస్గా జరుగుతున్న సమయంలో డగౌట్లో జరిగిన ఓ సీన్, ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది...
విరాట్ కోహ్లీ అవుటైన కొద్దిసేపటికే దేవ్దత్ పడిక్కల్, కెఎస్ భరత్, ఏబీ డివిల్లియర్స్ అవుట్ కావడంతో 52 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఆర్సీబీ...
ఈ సమయంలో డగౌట్లో ప్యాడ్స్ కట్టుకుని కూర్చున్న కేల్ జెమ్మీసన్... అక్కడే ఉన్న ఆర్సీబీ స్టాఫ్ మెంబర్ వైపు రొమాంటిక్ లుక్ ఇవ్వడం ఐపీఎల్ ఫ్యాన్స్ కంటబడింది...
ఆమె ఎవరో కాదు... ఐపీఎల్లో మొట్టమొదటి వుమెన్ సపోర్ట్ స్టాఫ్ మెంబర్, అథ్లెటిక్ థెరపిస్ట్ నవ్నీతా గౌతమ్... డగౌట్లో కేల్ జెమ్మీసన్ చూస్తున్నది ఆమె వైపేనా... లేక ఆమె పక్కనున్న వ్యక్తితో ఏమైనా చెబుతున్నాడా? అనేది తెలీదు...
అయితే కోహ్లీతో పాటు మిగిలిన ప్లేయర్లు అందరూ దిగులుగా కూర్చుని, మ్యాచ్ గురించి సీరియస్గా ఆలోచిస్తున్నట్టు కనిపించడం... జెమ్మీసన్తో పాటు నవ్నీతా గౌతమ్ నవ్వుతూ ఒకరినొకరు చూస్తున్నట్టు కనిపించడంతో ఈ విషయం సోషల్ మీడియాలో బీభత్సంగా ట్రెండింగ్ అవుతోంది...
కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ ఆటతీరు మళ్లీ వింటేజ్ ఆర్సీబీని గుర్తుకు తేవడం, ఇప్పటికే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడంతో ఈ సంఘటన మీమీ మేకర్స్కి మంచి మసాలా దినుసులా మారింది...
ఐపీఎల్ 2021 వేలంలో రూ.15 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన కేల్ జెమ్మీసన్కీ, థెరపిస్ట్ నవ్నీతాను ఫన్నీగా ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ, 19 ఓవర్లలో 92 పరుగులకే ఆలౌట్ కాగా... కేవలం 10 ఓవర్లలోనే మ్యాచ్ను ముగించేశారు కోల్కత్తా నైట్రైడర్స్...
ఈ పరాజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్నా, ఆర్సీబీ రన్రేటు దారుణంగా పడిపోయింది. 8 మ్యాచుల్లో ఐదు విజయాలు అందుకున్న ఆర్సీబీ, గత నాలుగు మ్యాచుల్లో మూడింట్లో ఓడడం విశేషం...