కెఎల్ రాహుల్కి అస్వస్థత... ఆసుపత్రికి తరలింపు... పంజాబ్ కింగ్స్కి షాక్...
పంజాబ్ కింగ్స్ జట్టుకి, ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్కి ముందు ఊహించని షాక్ తగిలింది. పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. దీంతో ఢిల్లీతో మ్యాచ్లో అతను బరిలో దిగడం లేదు...
గత రాత్రి కడపునొప్పితో బాధపడిన కెఎల్ రాహుల్కి ఫిజియో పర్యవేక్షణలో వైద్యం ఇప్పించారు పంజాబ్ కింగ్స్ జట్టు. అయితే ఎంతకీ తగ్గకపోవడంతో ఆసుపత్రికి తరలించారు...
వైద్యపరీక్షలో కెఎల్ రాహుల్ అపెండిక్స్ సమస్యతో బాధపడుతున్నట్టు తేలింది. దీంతో అతనికి త్వరలో అపెండిక్స్ సర్జరీ నిర్వహించబోతున్నారు...
సర్జరీ అనంతరం కెఎల్ రాహుల్కి కాస్త విశ్రాంతి అవసరం. దీంతో పంజాబ్ కింగ్స్ ఆడబోయే కొన్ని మ్యాచులు కెఎల్ రాహుల్ బరిలో దిగకపోవచ్చు.
ఐపీఎల్ 2020 సీజన్లో 14 మ్యాచులు ఆడి 670 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలిచిన కెఎల్ రాహుల్, ఈ సీజన్లో కూడా ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచాడు...
ఇప్పటిదాకా 7 మ్యాచుల్లో నాలుగు హాఫ్ సెంచరీలతో 331 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన గత మ్యాచ్లో 91 పరుగులతో రాణించి అజేయంగా నిలిచాడు.
ఇప్పటిదాకా ఏడు మ్యాచుల్లో మూడు విజయాలు సాధించిన పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదోస్థానంలో ఉంది. కెఎల్ రాహుల్ గైర్హజరీతో పంజాబ్ టీమ్కి మయాంక్ అగర్వాల్ కెప్టెన్గా వ్యవహారించబోతున్నాడు.