విరాట్ కోహ్లీ, ఆర్సీబీ టైటిల్ గెలవడం అసాధ్యం... మాజీ కెప్టెన్ కామెంట్స్...
IPL 2020 సీజన్లో మూడో స్థానంలో ప్లేఆఫ్కి అర్హత సాధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. గ్రూప్ స్టేజ్లో ఆఖరి మ్యాచ్ ఓడినా రన్రేట్ మెరుగ్గా ఉన్న కారణంగా ఎలాగోలా ప్లేఆఫ్ చేరింది విరాట్ కోహ్లీ. అయితే ఈ సారి తలకిందులుగా తపస్సు చేసినా ఆర్సీబీ టైటిల్ గెలవడం అసాధ్యమని అంటున్నాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్.
గ్రూప్ స్టేజ్లో ఆడిన మొదటి 10 మ్యాచుల్లో 7 మ్యాచుల్లో గెలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు ప్లేఆఫ్ చేరుతుందని అనుకుంటున్న సమయంలో వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడింది ఆర్సీబీ.
ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన కీలకమైన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది రాయల్ ఛాలెంజర్స్. అయితే బౌలర్లు కాస్తో కూస్తో రాణించడం వల్ల మ్యాచ్ 19వ ఓవర్ దాకా సాగడంతో ప్లేఆఫ్కి అర్హత సాధించింది.
‘2020 ఏడాది ఎన్నో వింతలూ, విశేషాలు జరిగాయి. కరోనా వైరస్ కారణంగా ప్రపంచమే అతలాకుతలమైంది. అలాగే ఆర్సీబీ కప్ గెలుస్తుందని అనుకుంటున్నారంతా...
కానీ రాయల్ ఛాలెంజర్స్కి అంత సీన్ లేదు. తలకిందులుగా తపస్సు చేసినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిట్ గెలవలేదు...
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్ కావాలంటే విరాట్ కోహ్లీ ఎడమ చేత్తో బ్యాటింగ్ చేయాలి.... అంటూ సెటైరికల్గా కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గత సీజన్లో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఈసారి కాస్త మెరుగైన ప్రదర్శన ఇచ్చినా ఆటగాళ్లు, జట్టు అంతా ఒత్తిడిలో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది...
ఆ ఒత్తిడి నుంచి బయటపడి ముంబై ఇండియన్స్లా దూకుడుగా ఆడితేనే... రాయల్ ఛాలెంజర్స్ టైటిల్ గెలవగలదు... అంటున్నాడు మైఖెల్ వాన్.
2020 సీజన్లో ఫామ్ అందుకునేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు విరాట్ కోహ్లీ. ఫామ్ అందుకున్నా ఇప్పటిదాకా మూడు హాఫ్ సెంచరీలు మాత్రమే చేయగలిగాడు.
14 మ్యాచుల్లో కేవలం 460 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. గత ఏడాది స్టైయిక్ రేటు కంటే ఈ సీజన్లో అతని స్టైయిక్ రేటు పడిపోయింది.
విరాట్ కోహ్లీ కంటే యంగ్ ఓపెనర్, తొలిసారి ఐపీఎల్ ఆడుతున్న దేవ్దత్ పడిక్కల్ ఎక్కువ పరుగులు చేశాడు.
14 మ్యాచలుు ఆడిన దేవ్దత్ పడిక్కల్, మొట్టమొదటి ఐపీఎల్ సీజన్లోనే రికార్డు లెవెల్లో 5 హాఫ్ సెంచరీలతో 472 పరుగులు చేశాడు.