మరోసారి మహేంద్ర సింగ్ ధోనీని టార్గెట్ చేసిన ఇర్ఫాన్ పఠాన్... ద్రావిడ్ మీద కామెంట్తో...
భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు, అప్పటికీ టీమిండియాలో స్టార్ పేసర్గా రాణిస్తున్నాడు ఇర్ఫాన్ పఠాన్. అయితే ఈ ఆల్రౌండర్కీ, మహేంద్ర సింగ్ ధోనీకి ఎక్కడో మనస్పర్థలు వచ్చాయి. ఫలితంగా ఇర్ఫాన్ పఠాన్ రిటైర్మెంట్కి ముందు ఏడేళ్లు జట్టుకి దూరంగా గడపాల్సి వచ్చింది.
ఇర్ఫాన్ పఠాన్లాగే వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ వంటి చాలామంది భారత జట్టుకి దూరం కావడానికి ధోనీయే కారణం...
![article_image2](https://static-ai.asianetnews.com/images/01e9n57nhjh3th8406pgvmwd09/dravid-dhoni-irfan-jpg_300x169xt.jpg)
అందుకే వీలైనప్పుడల్లా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ట్రోల్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు ఇర్ఫాన్ పఠాన్...
గత ఐపీఎల్ సీజన్లోనూ మాహీని టార్గెట్ చేస్తూ కామెంట్ చేశాడు ఇర్ఫాన్ పఠాన్... ఇర్ఫాన్ కామెంట్కి సపోర్టు చేయడం వల్లే హర్భజన్ సింగ్, సీఎస్కేకి దూరం కావాల్సి వచ్చింది...
39 ఏళ్ల మహేంద్ర సింగ్ ధోనీ... బ్యాటింగ్ చేయడానికి కష్టపడుతుండడం చూసి... చాలామంది ఆయన వయసు మీద డిస్కర్షన్ తీసుకొచ్చారు...
దీన్ని ఎత్తి చూపిన ఇర్ఫాన్ పఠాన్... ‘కొందరికి వయసు కేవలం నెంబర్ మాత్రమే... మరికొందరు వయసు సాకుగా చూపించి జట్టుకి దూరంగా పెడతారు...’ అంటూ తీవ్రమైన స్థాయిలో ధోనీని ట్రోల్ చేశాడు...
40 ఏళ్ల హర్భజన్ సింగ్ ఈ కామెంట్కి ‘అవును బ్రదర్... పూర్తిగా నీ వ్యాఖ్యలను ఒప్పుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు...
అదీ కాకుండా గత సీజన్లో సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో వైల్ ఇవ్వబోయిన అంపైర్ని మాహీ బెదిరించిన ‘వైడ్ బాల్’ వివాదంపై భజ్జీ స్పందించడం కూడా అతను చెన్నై సూపర్ కింగ్స్ నుంచి బయటికి వచ్చేయడానికి ఓ కారణం...
తాజాగా మరోసారి భారత ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్... మహేంద్ర సింగ్ ధోనీని తీవ్ర స్థాయిలో ట్రోల్ చేశాడు...
ఆస్ట్రేలియాలో భారత జట్టు అద్భుత విజయం తర్వాత టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి కంటే ఎక్కువగా అండర్ 19 కోచ్ రాహుల్ ద్రావిడ్ను ప్రశంసిస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు, క్రీడా అభిమానులు...
దీనిపై స్పందించిన ఇర్ఫాన్ పఠాన్... ‘రాహుల్ ద్రావిడ్ను అందరూ ప్రశంసిస్తున్నారు. భారత విజయంలో క్రెడిట్ ఇస్తున్నారు... ఎందుకంటే అతను క్రెడిట్ కోసం ఏ మాత్రం ఆశపడడు’ అంటూ ట్వీట్ చేశాడు..
ఈ పోస్టు ఎవ్వరిని ఉద్దేశించి చేసింది అనేది చెప్పకపోయినా... మహేంద్ర సింగ్ ధోనీనే టార్గెట్ చేశాడని ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్పై కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు...
2007 వరల్డ్ కప్లో, 2011 వరల్డ్కప్ విజయంలో పూర్తి క్రెడిట్ తనకే దక్కాలని మహేంద్రసింగ్ ధోనీ ఆడిన విధానాన్ని ఇప్పటికీ ట్రోల్ చేస్తుంటారు నెటిజన్లు.
కుర్రాళ్లు రాణిస్తే తనకి క్రెడిట్ దక్కదనే సీనియర్లతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును నడిపిస్తాడనే ఆపవాదు ఎప్పటి నుంచో ఉంది... ఐపీఎల్ 2020లో రైనా లేని సీఎస్కే జట్టు పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచి ఘోరంగా ఫెయిల్ అయ్యింది.
ఈ పరాజయంతో సీఎస్కే సక్సెస్లో ఎక్కువ భాగం క్రెడిట్ మహేంద్ర సింగ్ ధోనీకే వెళ్లినా, అసలు హీరో సురేశ్ రైనాయే అంటూ ట్రోల్ చేశారు నెటిజన్లు...