IPL2021 CSK vs PBKS: డుప్లిసిస్ ఒంటరి పోరాటం... పంజాబ్ కింగ్స్ ముందు ఊరించే టార్గెట్..
ఐపీఎల్ 2021 సీజన్లో టేబుల్ టాప్లో వెళ్లాలని ఆశపడిన చెన్నై సూపర్ కింగ్స్ను పంజాబ్ కింగ్స్ బౌలర్లు తెగ ఇబ్బంది పెట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది.
అద్భుతమైన ఫామ్లో ఉన్న యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 14 బంతుల్లో ఓ ఫోర్తో 12 పరుగులు చేసి అర్ష్దీప్ సంగ్ బౌలింగ్లో అవుట్ కాగా... మొయిన్ ఆలీ ఆరు బంతులాడి డకౌట్ అయ్యాడు...
ఫస్టాఫ్లో బ్యాటుతో అదరగొట్టిన మొయిన్ ఆలీ, అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో కెఎల్ రాహుల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
ఆ తర్వాత రాబిన్ ఊతప్ప 6 బంతుల్లో 2 పరుగులు, అంబటి రాయుడు 5 బంతుల్లో 4 పరుగులు చేసి క్రిస్ జోర్డాన్ బౌలింగ్లో పెవిలియన్ చేరారు...
గత మ్యాచ్తో పోలిస్తే దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన మహేంద్ర సింగ్ ధోనీ 15 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసి యంగ్ స్పిన్నర్ రవి భిష్ణోయ్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు..
61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్ను డుప్లిసిస్, జడేజా కలిసి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఆరో వికెట్కి 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
16 ఓవర్లు ముగిసే సమయానికి 86/5 స్కోరు మాత్రమే చేసిన సీఎస్కే, 120 పరుగులు మార్కునైనా టచ్ చేయగలదా? అనిపించింది. అయితే డుప్లిసిస్ గేర్ మార్చి, బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు...
55 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 76 పరుగులు చేసిన డుప్లిసిస్, ఐపీఎల్ 2021 సీజన్లో 500+ పరుగులు పూర్తిచేసుకున్నాడు. సీఎస్కే మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కూడా 500+ పరుగులు చేసిన ప్లేయర్గా ఉన్నాడు..
ఆఖరి ఓవర్లో మొదటి రెండు బంతుల్లో ఓ ఫోర్, సిక్సర్ బాదిన డుప్లిసిస్ను మూడో బంతికి షమీ అవుట్ చేయగా... జడేజా 17 బంతుల్లో ఓ ఫోర్తో 15 పరుగులు, బ్రావో 4 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు.