MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Rishabh Pant: ఓనర్ గొడవ, కెప్టెన్సీ అవుట్.. కట్ చేస్తే పాత గూటికి రిషబ్ పంత్.. ఎంత శాలరీ తగ్గిందో తెలుసా?

Rishabh Pant: ఓనర్ గొడవ, కెప్టెన్సీ అవుట్.. కట్ చేస్తే పాత గూటికి రిషబ్ పంత్.. ఎంత శాలరీ తగ్గిందో తెలుసా?

Rishabh Pant: ఐపీఎల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ట్రేడ్ డీల్ పూర్తయింది. లక్నోను వీడి ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి రిషబ్ పంత్ వచ్చేశాడు. అలాగే, కుల్దీప్ యాదవ్ లక్నో టీంలోకి వెళ్లాడు. ఈ డీల్ లో పంత్ అందుకునే మొత్తం భారీగా తగ్గింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 23 2026, 05:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పంత్ కు 12 కోట్ల లాస్, కుల్దీప్ కు బంపర్ ఆఫర్.. ఐపీఎల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ట్రేడ్ డీల్
Image Credit : Getty

పంత్ కు 12 కోట్ల లాస్, కుల్దీప్ కు బంపర్ ఆఫర్.. ఐపీఎల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ట్రేడ్ డీల్

ఐపీఎల్ క్రికెట్ అభిమానులకు మైండ్ బ్లాక్ అయ్యే క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. టోర్నీ హిస్టరీలోనే అత్యంత భారీ ట్రేడ్ డీల్ అధికారికంగా పూర్తయింది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) టీమ్ కెప్టెన్‌గా ఉన్న స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్.. ఆ టీమ్‌ను వదిలేసి మళ్లీ తన పాత గూడైన ఢిల్లీ క్యాపిటల్స్ (DC) లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ ట్రేడ్ డీల్ అంతా సజావుగా సాగినా, పంత్ శాలరీ విషయంలో మాత్రం షాక్ తగిలింది. ఢిల్లీ టీమ్‌ లోకి అడుగుపెడుతున్న పంత్‌కు ఏకంగా 12 కోట్ల రూపాయల భారీ శాలరీ కట్ పడింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పంత్ వర్సెస్ కుల్దీప్.. అటు ఇటు మారిన ప్లేయర్స్
Image Credit : ANI

పంత్ వర్సెస్ కుల్దీప్.. అటు ఇటు మారిన ప్లేయర్స్

ఈ ట్రేడ్ డీల్ ఎలా జరిగిందంటే.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్ రిషబ్ పంత్ ఇద్దరూ పరస్పరం టీమ్స్ మార్చుకున్నారు. అంటే పంత్ ఢిల్లీ టీమ్‌కు రాగా, కుల్దీప్ యాదవ్ లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌లోకి వెళ్లాడు. ఈ మెగా ట్రేడ్ డీల్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. రిషబ్ పంత్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌తో చాలా పాత అనుబంధం ఉంది. 2016 నుండి 2024 వరకు ఢిల్లీ టీమ్‌లోనే ఉన్నాడు. ఆ ఫ్రాంచైజీ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు కూడా పంత్ పేరు మీదనే ఉండటం విశేషం.

Related Articles

Related image1
Sanju Samson: ధోనీ క్రికెట్ రోజర్ ఫెడరర్ అయితే కోహ్లీ అల్కరాజ్ లాంటోడు.. సంజూ శాంసన్ క్రేజీ కామెంట్స్
Related image2
IRCTC Srisailam Tour: శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు యాదాద్రి కవర్ చేసే ఐఆర్‌సీటీసీ స్పిరిచువల్ టూర్
35
27 కోట్ల నుండి 15 కోట్లకు.. పంత్ అందుకునే మొత్తం ఎంత?
Image Credit : ANI

27 కోట్ల నుండి 15 కోట్లకు.. పంత్ అందుకునే మొత్తం ఎంత?

2025 ఐపీఎల్ సీజన్ టైంలో లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ రిషబ్ పంత్‌ను ఏకంగా రూ. 27 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ బిడ్డింగ్ రికార్డుగా నిలిచింది. కానీ, ఇప్పుడు 2027 ఐపీఎల్ టోర్నీ కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారుతున్న క్రమంలో పంత్ వేతనాన్ని సవరించారు. 2027 ఐపీఎల్ సీజన్‌కు గానూ ఢిల్లీ టీమ్ పంత్‌కు కేవలం రూ. 15 కోట్ల శాలరీ మాత్రమే ఇవ్వనుంది. అంటే పాత జీతంతో పోలిస్తే ఏకంగా 12 కోట్ల రూపాయలు తగ్గిందన్నమాట. ఇక ఢిల్లీ నుండి లక్నో టీమ్‌ లోకి వెళ్లిన కుల్దీప్ యాదవ్‌కు లక్నో ఫ్రాంచైజీ రూ. 13.50 కోట్లు అందించనుంది. గత కొన్ని సీజన్లలో వీరిద్దరూ ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవడమే దీనికి కారణం అని తెలుస్తోంది.

45
దారుణమైన ఫామ్.. గ్రౌండ్‌లోనే అవమానం
Image Credit : Getty

దారుణమైన ఫామ్.. గ్రౌండ్‌లోనే అవమానం

రిషబ్ పంత్ లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌ లోకి వెళ్ళిన తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది. అటు పంత్ పర్సనల్ ఫామ్, ఇటు లక్నో టీమ్ పర్ఫార్మెన్స్ రెండూ దారుణంగా పడిపోయాయి. 2025, 2026 రెండు ఐపీఎల్ సీజన్లలోనూ లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ కనీసం ప్లేఆఫ్స్ కూడా చేరలేకపోయింది. దీనికి తోడు లక్నో టీమ్ ఓనర్.. గ్రౌండ్‌లోనే అందరి ముందూ బహిరంగంగా రిషబ్ పంత్‌పై తన అసంతృప్తిని వ్యక్తం చేసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇది పంత్ అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించింది.

55
కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేసిన పంత్
Image Credit : X/@EmediaManoj

కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేసిన పంత్

ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే రిషబ్ పంత్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. తనను లక్నో టీమ్ కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకునేందుకు అనుమతించాలని ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్‌ను స్వయంగా కోరాడు. పంత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని గౌరవించిన లక్నో ఫ్రాంచైజీ, అతడిని కెప్టెన్సీ నుండి రిలీజ్ చేసింది. ఆ వెంటనే ఈ క్రేజీ ట్రేడ్ డీల్ తెరపైకి రావడం, పంత్ మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ జెర్సీ వేసుకోవడం చకచకా జరిగిపోయాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sanju Samson: ధోనీ క్రికెట్ రోజర్ ఫెడరర్ అయితే కోహ్లీ అల్కరాజ్ లాంటోడు.. సంజూ శాంసన్ క్రేజీ కామెంట్స్
Recommended image2
Vaibhav Suryavanshi: కల నిజమైంది.. టీమిండియా ‘త్రీ స్టార్’ జెర్సీ అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Recommended image3
TG20 League: టీజీ20 లీగ్‌లో కూడా ర‌చ్చ మొద‌లైందిగా.. 32 బంతుల్లో సెంచ‌రీతో చెల‌రేగిన‌
Related Stories
Recommended image1
Sanju Samson: ధోనీ క్రికెట్ రోజర్ ఫెడరర్ అయితే కోహ్లీ అల్కరాజ్ లాంటోడు.. సంజూ శాంసన్ క్రేజీ కామెంట్స్
Recommended image2
IRCTC Srisailam Tour: శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు యాదాద్రి కవర్ చేసే ఐఆర్‌సీటీసీ స్పిరిచువల్ టూర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved