MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఐపీఎల్ 2025: ఆర్‌సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని ఎందుకు ఎంచుకోలేదు?

ఐపీఎల్ 2025: ఆర్‌సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని ఎందుకు ఎంచుకోలేదు?

Why RCB Didnt Pick Virat Kohli: ఐపీఎల్ 2025లో ఆర్‌సీబీకి కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని ఎంచుకోలేదు. భారత యంగ్ ప్లేయర్ రజత్ పటిదార్ కు కెప్టెన్సీకి అప్పగించింది. ఆర్సీబీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది. 

3 Min read
Mahesh Rajamoni
Published : Feb 15 2025, 09:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్‌గా వస్తారనే ఊహాగానాల నడుమ, బెంగళూరు ఫ్రాంచైజీ రజత్ పటిదార్‌ను కొత్త కెప్టెన్‌గా అధికారికంగా ప్రకటించింది. 2022 నుండి 2024 వరకు మూడు సీజన్ల పాటు ఆర్‌సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించిన ఫాఫ్ డుప్లెసిస్ స్థానంలో పటిదార్ వచ్చారు. డుప్లెసిస్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2025 వేలంలో ఎంచుకుంది. దీంతో ఆర్‌సీబీ కొత్త కెప్టెన్ కోసం చూసింది. ఈ క్రమంలోనే భారత బ్యాట్స్ మెన్ రజత్ పటిదార్ కు కెప్టెన్సీని అప్పగించింది. దీనికి ముందు విరాట్ కోహ్లీ కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నారు. కానీ ఆర్‌సీబీ యాజమాన్యం కోహ్లీని ఎంచుకోలేదు. ఎందుకంటే..?

26

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్ నుండి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టులో ఉన్నాడు. టోర్నమెంట్ ప్రారంభం నుండి ఒకే ఐపీఎల్ ఫ్రాంచైజీ కోసం ఆడిన ఆటగాడిగా కోహ్లీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. గత కొన్నేళ్లుగా ఫ్రాంచైజీ ప్రజాదరణ పెంచడంలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించారు. మొత్తంగా చెప్పాలంటే విరాట్ కోహ్లీతోనే ఆర్సీబీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. 

36

విరాట్ కోహ్లీ 2013లో ఆర్‌సీబీ కెప్టెన్‌గా నియమితులయ్యారు. 2021 వరకు జట్టును ముందుకు నడిపించాడు. ఐపీఎల్ 2021 తర్వాత కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకున్నారు. దీంతో ఫాఫ్ డుప్లెసిస్‌కు ఆర్సీబీ నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. తన కెప్టెన్సీ హయాంలో విరాట్ కోహ్లీ ఒక్కసారి ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఐపీఎల్ టైటిల్‌ను అందించలేకపోయాడు. 2016లో SRH చేతిలో ఓడిపోయింది.  కోహ్లీ కెప్టెన్సీలో 143 మ్యాచ్‌లలో ఆర్‌సీబీ 66 గెలిచింది.

46

తొమ్మిదేళ్ల పాటు కెప్టెన్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఐపీఎల్ విజయానికి నడిపించడంలో విఫలమైనప్పటికీ, విరాట్ కోహ్లీ అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడు. అయితే, 36 ఏళ్ల కోహ్లీని యాజమాన్యం కెప్టెన్‌గా ఎంచుకోలేదు. 

విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఎందుకు ఎంపిక కాలేదో వివరిస్తూ, కోహ్లీకి జట్టుకు నాయకత్వం వహించడానికి కెప్టెన్సీ టైటిల్ అవసరం లేదని ఆర్‌సీబీ డైరెక్టర్ బోబాట్ పేర్కొన్నారు. రజత్ పటిదార్‌ను కెప్టెన్‌గా నియమించినప్పటికీ, కోహ్లీ ఫ్రాంచైజీకి నాయకత్వం వహిస్తారని ఆయన అన్నారు. "విరాట్ కూడా కెప్టెన్సీకి ఒక ఆప్షన్. అభిమానులు విరాట్ వైపు మొగ్గు చూపుతారని నాకు తెలుసు. కానీ విరాట్‌కు నాయకత్వం వహించడానికి కెప్టెన్సీ టైటిల్ అవసరం లేదు" అని ఆర్‌సీబీ డైరెక్టర్ మీడియాతో అన్నారు. "నాయకత్వం అతని బలమైన ప్రవృత్తులలో ఒకటి. అది అతనికి సహజంగానే వస్తుంది. అతను ఎలాగైనా నడిపిస్తాడు. కానీ రజత్ పట్ల కూడా చాలా ప్రేమ చూశాము" అని ఆయన అన్నారు.

56

బోబాట్ ప్రకటన కాకుండా, వయస్సు అంశాన్ని కూడా ఇక్కడ చూసి వుండవచ్చు. విరాట్ కోహ్లీకి ఇప్పుడు 36 ఏళ్లు, అతని కెరీర్‌లో ఇంకా కొన్ని సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరోవైపు, రజత్ పటిదార్ వయస్సు 31 సంవత్సరాలు. ఆర్‌సీబీ స్థిరత్వం, కొనసాగింపు కోసం చూస్తోంది. భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ కోహ్లీని పక్కన పెట్టిందనే చర్చ కూడా సాగుతోంది. అలాగే, విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యత లేకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడానికి వీలు కల్పిస్తోంది. గత ఐపీఎల్ సీజన్‌లో కోహ్లీ 741 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచాడు.

66

కెప్టెన్ గా రజత్ పాటిదార్ ఎందుకు?  

గత ఏడాది మధ్యప్రదేశ్ జట్టును సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ విజయానికి నడిపించినప్పుడు రజత్ పటిదార్ నాయకత్వ లక్షణాల నేపథ్యంలో ఆర్‌సీబీ కెప్టెన్‌గా నియమితులయ్యారు. 10 మ్యాచ్‌లలో 61.14 సగటుతో 5 హాఫ్ సెంచరీలతో 428 పరుగులు చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, రజత్ పటిదార్‌ను కెప్టెన్ గా ఎంపిక చేసింది. 

తన ఐపీఎల్ కెరీర్‌లో రజత్ పటిదార్ 27 మ్యాచ్‌లలో 34.74 సగటుతో ఒక శతకం, ఏడు హాఫ్ సెంచరీలతో 799 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2024లో అతని ఉత్తమ సీజన్, 15 మ్యాచ్‌లలో 30.38 సగటుతో 395 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2022 ఎలిమినేటర్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై 54 బంతుల్లో 112 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడినప్పుడు రజత్ పాటిదార్ కు ఫేమ్‌ను అందుకున్నాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved