IPL 2025: మొదటి రెండు స్థానాల్లో నిలిచేది ఎవరు?
IPL 2025: 18వ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో లీగ్ దశలో ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇంకా మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ ఎవరు ఆడతారనే దానిపై స్పష్టత రాలేదు. ఆర్సీబీకి అగ్రస్థానానికి చేరుకోవడానికి మరో అవకాశం లభించింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఐపీఎల్ లో ఆసక్తికర పరిణామం
గుజరాత్ టైటాన్స్పై చెన్నై సూపర్ కింగ్స్ భారీ విజయం సాధించడంతో ఐపీఎల్ మొదటి క్వాలిఫయర్ అర్హత సాధించే పోటీ మరింత ఉత్కంఠ గా మారింది.
టాప్ రెండు జట్లకు రెండు అవకాశాలు
గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, ముంబై ఈ 4 జట్లకు మొదటి రెండు స్థానాలను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. పాయింట్ల పట్టికలో టాప్ రెండు జట్లకు రెండు అవకాశాలు లభిస్తాయి. అందుకే ప్రతి జట్టు క్వాలిఫయర్ -1పై దృష్టి పెట్టింది.
నాలుగు జట్లకు మొదటి క్వాలిఫయర్ అవకాశాలు
ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 18, పంజాబ్ కింగ్స్ 17, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 17, ముంబై ఇండియన్స్ 16 పాయింట్లు కలిగి ఉన్నాయి. గుజరాత్ కు అన్ని మ్యాచ్లు ముగిశాయి. అయినప్పటికీ, ఈ 4 జట్లకు మొదటి క్వాలిఫయర్ గా ఆడటానికి సమాన అవకాశం ఉంది.
ఆర్సీబీ టాప్ ప్లేస్ లో నిలిచేనా?
రజత్ పాటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ చివరి మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై గెలిస్తే టాప్-2లో స్థానం సంపాదించడం ఖాయం. ఓడిపోతే 3 లేదా 4వ స్థానంలో ఎలిమినేటర్ ఆడాల్సి ఉంటుంది.
ముంబై ఇండియన్స్ - పంజాబ్ కింగ్స్
ముంబై ఇండియన్స్ - పంజాబ్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-1లో ఆడుతుంది. ప్రస్తుతం పంజాబ్ గెలిస్తే 19 పాయింట్లు అవుతాయి. ముంబై గెలిస్తే 18 పాయింట్లు అవుతాయి. నెట్ రన్రేట్ బాగుండటంతో మొదటి క్వాలిఫయర్ అర్హత సాధిస్తుంది.
గుజరాత్ అవకాశాలు ఎలా ఉన్నాయి?
లక్నోపై ఆర్సీబీ గెలిచి, ముంబై-పంజాబ్ మ్యాచ్లో కూడా ఫలితం వస్తే, గుజరాత్ 3 లేదా 4వ స్థానానికి పడిపోతుంది. ఆర్సీబీ ఓడిపోయి, ముంబై-పంజాబ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితేనే గుజరాత్ టాప్ 2 స్థానాన్ని నిలుపుకుంటుంది.