PBKS vs MI: పంజాబ్ కింగ్స్ ఆల్రౌండ్ షో.. ముంబైకి షాక్
IPL 2025 PBKS vs MI: ముందు బౌలింగ్, ఆ తర్వాత బ్యాటింగ్ లో అదరగొడుతూ ఐపీఎల్ 2025లో తమ చివరి లీగ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ ను ఓడించింది. దీంతో ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ టాప్-2 లోకి చేరింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొట్టిన పంజాబ్
జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 69వ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొట్టిన పంజాబ్ కింగ్స్ జట్టు ముంబై టీమ్ పై ఈజీగానే విక్టరీ కొట్టింది. మరో ఓవర్ మిగిలి వుండగానే 7 వికెట్ల తేడాతో 187 పరుగులతో విజయం సాధించింది.
ప్రియాంష్ ఆర్య, జోస్ ఇంగ్లీస్ సూపర్ ఇన్నింగ్స్
పంజాబ్ బ్యాటర్లలో జోష్ ఇంగ్లిస్, ప్రియాంష్ ఆర్య అద్భుతంగా ఆడారు. పీబీకేఎస్ ప్రారంభంలోనే ప్రభ్సిమ్రాన్ సింగ్ వికెట్ కోల్పోయింది. అయితే, ప్రియాంష్-ఇంగ్లిస్ రెండో వికెట్కు 109 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. శ్రేయాస్ అయ్యర్ సిక్సర్ తో గలుపును ఖాయం చేశాడు.
సిక్సర్ తో విన్నింగ్ పరుగులు కొట్టిన శ్రేయాస్ అయ్యర్
ప్రియంష్ ఆర్య 62 పరుగుల ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. జోస్ ఇంగ్లీస్ చివరి వరకు క్రీజులో ఉండి 73 పరుగుల అద్భుతమైన నాక్ ఆడాడు. అతని ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. శ్రేయాస్ అయ్యర్ 26 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీతో 184 పరుగులు చేసిన ముంబై
సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీతో ముంబై జట్టు స్కోరు బోర్డుపై 184 పరుగులు చేసింది. 57 పరుగుల ఇన్నింగ్స్ లో సూర్య కుమార్ 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. హార్దిక్ పాండ్యా 2 సిక్సర్లు, 2 ఫోర్లతో 26 పరుగులు చేశాడు. ర్యాన్ రికెల్టన్ 27, రోహిత్ శర్మ 24 పరుగులు సాధించారు. నమన్ ధీర్ 20 పరుగులు కొట్టాడు.
టాప్-2లోకి పంజాబ్ కింగ్స్
ఈ మ్యాచ్లో విజయం సాధించడంతో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ లో టాప్-2లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. ఇప్పుడు అందరి కళ్ళు RCB మ్యాచ్ పైనే ఉంటాయి. RCB జట్టు లీగ్ దశలో తన చివరి మ్యాచ్లో గెలిస్తే, అప్పుడు క్వాలిఫయర్-1 ఆర్సీబీ, పంజాబ్ మధ్య జరుగుతుంది. ఓడిపోతే ఎలిమినేటర్లో ముంబైతో తలపడుతుంది.