MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Sports
  • Cricket
  • ఉమేశ్ యాదవ్ సరికొత్త చరిత్ర.. అత్యధిక వికెట్ల వీరున్ని అధిగమించిన కేకేఆర్ పేసర్

ఉమేశ్ యాదవ్ సరికొత్త చరిత్ర.. అత్యధిక వికెట్ల వీరున్ని అధిగమించిన కేకేఆర్ పేసర్

IPL 2023: ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ కు ఆడుతున్న ఉమేశ్ యాదవ్.. శనివారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో  రాజపక్సను ఔట్ చేయడం ద్వారా అరుదైన ఘనతను అందుకున్నాడు. 

2 Min read
Author : Srinivas M
Published : Apr 02 2023, 02:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టీమిండియా  వెటరన్ పేసర్  ఉమేశ్ యాదవ్ ఐపీఎల్ లో అరుదైన ఘనతను అందుకున్నాడు.  ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో  అత్యధిక వికెట్లు తీసిన  విండీస్ మాజీ బౌలర్  డ్వేన్ బ్రావో   పేరిట ఉన్న రికార్డును   బ్రేక్ చేశాడు.   తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్ గా కూడా నిలిచాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ కు ఆడుతున్న ఈ  నాగ్‌పూర్ బౌలర్.. శనివారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో భానుక రాజపక్స వికెట్ తీయడం ద్వారా ఒక జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. 

36
Image credit: Getty

Image credit: Getty

పంజాబ్ కింగ్స్ పై ఐపీఎల్ లో  ఉమేశ్ కు ఇది 34వ వికెట్.  గతంలో ఈ రికార్డులు  సీఎస్కే బౌలర్  డ్వేన్ బ్రావో పేరిట ఉండేది. బ్రావో..  ముంబై ఇండియన్స్ పై   33 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఉమేశ్.. ఈ రికార్డును  బ్రేక్ చేశాడు. 

46

కాగా నిన్న పంజాబ్  - కేకేఆర్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో  ఫలితం తేలడానికి మూడు ఓవర్ల ముందు వర్షం రావడంతో  మ్యాచ్ ను విజేతను డక్వర్త్ లూయిస్ పద్ధతిలో  తేల్చాల్సి వచ్చింది.  వర్షం పడే సమయానికి  విజయానికి కేకేఆర్ 7 పరుగుల దూరంలో నిలిచింది. దీంతో  పంజాబ్.. సీజన్ లో తొలి విజయాన్ని అందుకుంది.  
 

56
Image credit: PTI

Image credit: PTI

మొహాలీ వేదికగా ముగిసిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి  191 పరుగులు చేసింది. భానుక రాజపక్స  (50) హాఫ్ సెంచరీతో మెరిశాడు. కెప్టెన్ ధావన్ (40)  ధాటిగా ఆడాడు. చివర్లో  సామ్ కరన్.. 17 బంతుల్లో 26 పరుగులు చేశాడు. 
 

66

లక్ష్య ఛేదనలో కేకేఆర్..  29 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయినా   నితీశ్ రాణా (34), వెంకటేశ్ అయ్యర్  (34),  ఆండ్రూ రసెల్ (35) లు ఆదుకోవడంతో   16 ఓవర్లలో  7 వికెట్ల నష్టానికి  146 పరుగులు చేసింది.  ఈ   మ్యాచ్ లో   మూడు ఓవర్లు వేసి 19 పరుగులే ఇచ్చి 3 కీలక వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image2
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image3
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved