ఆర్సీబీకి మరింత ‘జోష్’.. ఆ బౌలర్ వచ్చేస్తున్నాడు.. రేపటి మ్యాచ్లో ఆడటం పక్కా!
IPL 2023: రేపు కోల్కతా నైట్ రైడర్స్ తో జరుగబోయే మ్యాచ్ లో జోష్ హెజిల్వుడ్ ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ మేరకు ఆర్సీబీ కూడా తన ట్విటర్ ఖాతాలో ఇందుకు హింట్ కూడా ఇచ్చింది.
Image credit: PTI
ఐపీఎల్ - 16లో ఆడిన ఏడు మ్యాచ్ లలో నాలుగు గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు మరో గుడ్ న్యూస్. ఆ జట్టు కీలక బౌలర్, ఇన్నాళ్లు కాలి మడమ గాయం కారణంగా ఐపీఎల్ కు దూరంగా ఉన్న జోష్ హెజిల్వుడ్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01g11g5zspdkx7mxf4zqnsd7ga/fotojet--12--jpg_300x171xt.jpg)
రేపు (ఏప్రిల్ 26) కోల్కతా నైట్ రైడర్స్ తో జరుగబోయే మ్యాచ్ లో జోష్ హెజిల్వుడ్ ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ మేరకు ఆర్సీబీ కూడా తన ట్విటర్ ఖాతాలో ఇందుకు హింట్ కూడా ఇచ్చింది. గత మ్యాచ్ లో కోహ్లీ కూడా అతడి రాకపై హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
Josh Hazlewood
ట్విటర్ వేదికగా ఆర్సీబీ స్పందిస్తూ.. (ఆల్మోస్ట్ 100 పర్సెంట్ డన్ (ఫిట్నెస్ సాధించాడని చెబుతూ). మ్యాచ్ ఆడేందుకు రెడీగా ఉన్నాడు..’అని ట్వీట్ చేసింది. హెజిల్వుడ్ వారం రోజుల క్రితమే ఆర్సీబీ టీమ్ తో కలిసినా కాలి మడమ గాయం కారణంగా మ్యాచ్ ఆడలేదు.
ఇక మొన్న రాజస్తాన్ రాయల్స్ తో మ్యాచ్ లో కూడా టాస్ వేసేప్పుడు కోహ్లీ ఇదే విషయాన్ని చెప్పాడు. ‘నాకు తెలిసి హెజిల్వుడ్ ఫిట్నెస్ సాధించాడు. మేం ఆడబోయే తర్వాతి మ్యాచ్ కు అతడు అందుబాటులో ఉంటాడు..’అని చెప్పాడు. తాజాగా ఆర్సీబీ ట్విటర్ లో కూడా ఇదే విషయం గురించి ఇప్పుడు స్పష్టతనిచ్చినట్టైంది.
హెజిల్వుడ్ వస్తే ఆర్సీబీ బౌలింగ్ విభాగం మరింత పటిష్టమవుతుంది. సిరాజ్ రాణిస్తున్నా వేన్ పార్నెల్, వైశాఖ్ విజయ్ కుమార్ లు విఫలమవుతున్నారు. దీంతో రాజస్తాన్ తో మ్యాచ్ లో ఆర్సీబీ డేవిడ్ విల్లేను ఆడించింది. అతడు ఫర్వాలేదనిపించాడు. అయితే కేకేఆర్ తో మ్యాచ్ లో హెజిల్వుడ్ ఆడితే మాత్రం విల్లే బెంచ్ కే పరిమితమవుతాడు.
తన ఐపీఎల్ కెరీర్ ను 2020లో మొదలుపెట్టిన హెజిల్వుడ్.. ఆ సీజన్ తో పాటు 2021లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడాడు. 2022లో హెజిల్వుడ్ ను ఆర్సీబీ రూ. 7.5 కోట్లకు కొనుగోలు చేసింది. మొత్తంగా ఇప్పటివరకు 24 మ్యాచ్ లు ఆడిన హెజిల్వుడ్ 32 వికెట్లు పడగొట్టాడు. గత సీజన్ లో ఆర్సీబీ తరఫున 12 మ్యాచ్ లలోనే 20 వికెట్లు పడగొట్టాడు.