Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Sports
  • Cricket
  • ఐపీఎల్ లోకి రిషభ్ పంత్ ఎంట్రీ..? ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్న డీడీసీఎ

ఐపీఎల్ లోకి రిషభ్ పంత్ ఎంట్రీ..? ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్న డీడీసీఎ

IPL 2023: మూడు నెలల క్రితం  రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం విరామం తీసుకుంటున్న టీమిండియా వికెట్ కీపర్  ఐపీఎల్ లో భాగం కానున్నాడు. 

Srinivas M | Published : Mar 31 2023, 11:57 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

గతేడాది డిసెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో గాయపడి  తీవ్ర గాయాలపాలై   ప్రస్తుతం  ఇంటిలో విశ్రాంతి  తీసుకుంటున్న టీమిండియా వికెట్ కీపర్, ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషభ్ పంత్   ఈ ఐపీఎల్ సీజన్ లో భాగం కాబోతున్నాడు. అదేంటి..? కాలికి గాయంతో   ఉన్న పంత్.. నడవడమే కష్టంగా ఉంటే  మ్యాచ్ లు ఎలా ఆడతాడు..? అనుకుంటున్నారా..?  

26
Asianet Image

అయితే పంత్  కనిపించేది ప్లేయర్ గా కాదు.  ఢిల్లీ క్యాపిటల్స్ డగౌట్ లో   అతడు ఉండనున్నాడు.   రెండ్రోజుల క్రితమే  ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ.. ‘మేం డగౌట్ లో  పంత్ ఉండాలని కోరుకుంటున్నాం. అతడు ఉంటే  టీమ్ లో పాజిటివ్ వైబ్స్ ఉంటాయి..  ఢిల్లీ ఆడబోయే మ్యాచ్ లకు పంత్ వస్తాడనే అనుకుంటున్నాం..’ అని చెప్పాడు.  

36
Asianet Image

పాంటింగ్ కోరికో లేక ఢిల్లీ క్యాపిటల్స్  ప్లానింగో తెలియదు గానీ   ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ స్వంత గ్రౌండ్  (అరుణ్ జైట్లీ స్టేడియం - ఢిల్లీ)  లో జరిగే మ్యాచ్ లను పంత్ ప్రత్యక్షంగా వీక్షించనున్నాడు.  ఈ మేరకు ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) ప్రత్యేక ఏర్పాట్లను చేసింది.   

46
Asianet Image

ఇదే విషయమై  డీడీసీఏ   డైరెక్టర్ శ్యామ్ శర్మ  మాట్లాడుతూ.. ‘మేం రిషభ్ పంత్  ను డగౌట్ కు తీసుకొచ్చేందుకు గాను అన్ని ఏర్పాట్లను చేశాం. అతడి కోసం ఓ ప్రత్యేక ర్యాంప్ ను కూడా  సిద్ధం  చేశాం.  ఇంటి నుంచి  స్టేడియానికి, స్టేడియం నుంచి ఇక్కడికి  పంత్ ను తీసుకురావడానికి సిద్దంగా ఉన్నాం...’అని తెలిపాడు. 

56
Asianet Image

ఢిల్లీ క్యాపిటల్స్ తన మొదటి మ్యాచ్ ను ఏప్రిల్ 1న  లక్నో వేదికగా జరుగబోయే  మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ తర్వాత  ఏప్రిల్ నాలుగున గుజరాత్ టైటాన్స్ తో   రెండో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కు  పంత్ హాజరయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  
 

66
Asianet Image

గతేడాది  ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో  ఐదో స్థానంలో నిలిచింది. ఈసారి పంత్ లేకపోవడం ఆ జట్టుకు పెద్ద లోటే అయినా డేవిడ్ వార్నర్,  పృథ్వీ షా,  మిచెల్ మార్ష్,  ఫిల్ సాల్ట్, సర్ఫరాజ్ ఖాన్, ఆన్రిచ్ నోర్త్జ్, అక్షర్ పటేల్,   ముస్తాఫిజుర్ రెహ్మాన్ వంటి ఆటగాళ్లతో ఢిల్లీ   జట్టు బలంగానే ఉంది.  ఈ సీజన్ లో అయినా ఢిల్లీ తమ కప్పు కలను నెరవేర్చుకుంటుందో చూడాలి.  

Srinivas M
About the Author
Srinivas M
రిషబ్ పంత్
 
Recommended Stories
Top Stories