- Home
- Sports
- Cricket
- రాజస్థాన్ రాయల్స్ తనను తీసుకుంటుందని అశ్విన్ కు ముందే తెలుసా..? కీలక విషయాలు వెల్లడించిన వెటరన్ స్పిన్నర్
రాజస్థాన్ రాయల్స్ తనను తీసుకుంటుందని అశ్విన్ కు ముందే తెలుసా..? కీలక విషయాలు వెల్లడించిన వెటరన్ స్పిన్నర్
IPL 2022 Live Updates: గతనెలలో బెంగళూరు వేదికగా ముగిసిన ఐపీఎల్ వేలంలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను రాజస్థాన్ రాయల్స్ దక్కించుకున్నది. అయితే అశ్విన్ రాజస్థాన్ కు వెళ్తాడని తనకు ముందే తెలుసా..?

ఐపీఎల్ తొలి సీజన్ విజేత రాజస్థాన్ రాయల్స్ ఈసారి కప్ కొట్టడమే లక్ష్యంగా దూసుకెళ్తుంది. ఆ మేరకు ఆటగాళ్లను కూడా వేలంలో దక్కించుకుంది. ముఖ్యంగా బౌలింగ్ విషయంలో ఆ జట్టు చాలా కేర్ తీసుకుంటున్నది.
ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా లంక దిగ్గజ బౌలర్ లసిత్ మలింగను నియమించుకోవడంతో పాటు ఐపీఎల్ వేలంలో ఇద్దరు స్పిన్నర్లను కూడా దక్కించుకుంది. వారిలో యుజ్వేంద్ర చాహల్ ఒకరు కాగా మరొకరు రవిచంద్రన్ అశ్విన్.
అయితే అశ్విన్ ను రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంటుందని అతడికి ముందే తెలుసా? అంటే అవుననే అంటున్నాడు ఈ టీమిండియా ఆఫ్ స్పిన్నర్.
తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ.. ‘రాజస్థాన్ రాయల్స్ నా కోసం వేలం వేయడం చూసిన వెంటనే అనుకున్నా.. వాళ్లు నన్ను దక్కించుకోబోతున్నారని. నేను ఈ సీజన్ లో రాజస్థాన్ తరఫున ఆడబోతున్నానని అప్పుడే ఫిక్స్ అయ్యా.. నాకు ఈ జట్టులో చాలా మంది తెలుసు. క్రికెట్ గురించి మాట్లాడే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వారందరితో నాకు మంచి సంబంధాలున్నాయి.
రాయల్స్ పేరు వినంగానే నాకు అదొక భిన్నమైన జట్టుగా భావిస్తాను. మ్యాచుల సందర్భంగా ప్రణాళిక, దానిని అనుసరించే విధానానికి సంబంధించి వాళ్లు ఎల్లప్పుడూ టైమ్ కంటే ముందుంటారు.
ఈ సందర్భంగా వాళ్లు పలు ప్రయోగాలు కూడా చేస్తున్నారు. నాకు కూడా ప్రయోగాలు అంటే ఇష్టం. ఐపీఎల్ ను నేను ఒక ఎక్స్పర్మెంటల్ గేమ్ గా చూస్తాను. ఇందులో నేను భాగమైన ప్రతిసారి ఫలితాలతో సంబంధం లేకుండా మంచి అనుభూతినిచ్చింది...’అని అశ్విన్ అన్నాడు.
ఐపీఎల్ లో ఇది అశ్విన్ కు ఐదో జట్టు. గతంలో అతడు చెన్నై తో పాటు పంజాబ్, ఢిల్లీలకు కూడా ఆడాడు. ఇక రాజస్థాన్ సారథి సంజూ శాంసన్ పై స్పందిస్తూ.. ‘సంజూ అద్భుతమైన సారథి. అతడి అటిట్యూడ్ నాకు చాలా ఇష్టం. అతడెప్పుడూ చర్చకు సిద్ధంగా ఉంటాడు. గేమ్ చుట్టూ ఉన్న అభిప్రాయాలను పంచుకుంటాడు. క్రికెటర్ కు ఆ క్వాలిటీ కలిగి ఉండగం గొప్ప విషయం.. ’అని ప్రశంసించాడు.
గత సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన అశ్విన్ ను ఈసారి రాజస్థాన్ రాయల్స్ వేలంలో రూ. 5 కోట్లు పెట్టి దక్కించుకున్న విషయం తెలిసిందే.