- Home
- Sports
- Cricket
- ముంబై ఎయిర్పోర్ట్లో బట్టలు పోయాయి, 3 రోజులు టవల్తోనే ఉన్నా... ఢిల్లీప్లేయర్ రోవ్మెన్ పావెల్..
ముంబై ఎయిర్పోర్ట్లో బట్టలు పోయాయి, 3 రోజులు టవల్తోనే ఉన్నా... ఢిల్లీప్లేయర్ రోవ్మెన్ పావెల్..
ఐపీఎల్ 2022 సీజన్లో ఎంట్రీతోనే అదరగొడుతున్న ప్లేయర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రోవ్మెన్ పావెల్ ఒకడు. 11 మ్యాచుల్లో 161.42 స్ట్రైయిక్ రేటుతో 205 పరుగులు చేశాడు పావెల్. సన్రైజర్స్ మ్యాచ్లో 35 బంతుల్లో 67 పరుగులు చేసి అదరగొట్టాడు...

రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 15 బంతుల్లో 26 పరుగులు, కేకేఆర్తో మ్యాచ్లో 16 బంతుల్లో 33 పరుగులు, లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 21 బంతుల్లో 35 పరుగులు చేసిన రోవ్మెన్ పావెల్, సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో 35 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 67 పరుగులు చేసి మ్యాచ్ని ముగించాడు...
ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.2 కోట్ల 80 లక్షలకు రోవ్మెన్ పావెల్ని కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. సొంత ఇల్లు కూడా లేని పేద కుటుంబం నుంచి వచ్చిన రోవ్మెన్ పావెల్, ఇండియాకి వచ్చిన తర్వాత తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టాడు...
‘నేను ముంబైలో ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్లైన్స్ సిబ్బంది, నా బ్యాగ్స్ ఏవీ లేవని చెప్పారు. ఎయిర్పోర్టులో పోయిన బ్యాగుల్లోనే నా బట్టలన్నీ ఉన్నాయి. నా చేతిలో ఉన్న బ్యాగుతోనే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చా...
నా దగ్గర ఎక్స్ట్రా బట్టలు కూడా లేవు. ఏం చేయాలో తెలియక నా హోటల్ రూమ్లో రెండు మూడు రోజులు టవల్లోనే గడిపా...
రిషబ్ పంత్కి కరేబియన్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన బ్యాటింగ్ని మా వాళ్లు బాగా ఇష్టపడతారు. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్లోకి వచ్చిన తర్వాత పంత్ నన్ను సాదరంగా ఆహ్వానించాడు...
టీమ్లో నా రోల్ ఏంటో క్లియర్గా చెప్పాడు. నేను ఎక్కడ ఆడగలనో చెబితే, కాదనకుండా ఆడనిచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ నన్ను తమ కుటుంబంలో ఒకడిగా చూసుకోవడం వల్లే ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడుతున్నా...’ అంటూ కామెంట్ చేశాడు రోవ్మెన్ పావెల్...
ఐపీఎల్ 2022 సీజన్లో 117 మీటర్ల సిక్స్ బాదిన లియామ్ లివింగ్స్టోన్ రికార్డును బ్రేక్ చేసి, తాను 130 మీటర్ల సిక్సర్ కొడతానని రోవ్మెన్ పావెల్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి...