IPL 2021 సందడి మొదలు... ప్రాక్టీస్ మొదలెట్టేసిన స్టార్ క్రికెటర్లు...
ఐపీఎల్ 2021 సీజన్ సందడి మొదలైపోయింది. 14వ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం అన్ని జట్లు క్యాంప్ మొదలెట్టేశాయి. క్వారంటైన్ నిబంధనల కారణంగా ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ కోసం దాదాపు అన్ని దేశాల ఆటగాళ్లు, భారత్కి వచ్చేశారు...

<p>ఇండియాలో వన్డే సిరీస్ ముగించుకున్న సామ్ కుర్రాన్, మొయిన్ ఆలీ నేరుగా చెన్నై సూపర్ కింగ్స్ క్యాంపుతో కలిశారు. బయో బబుల్ ట్రాన్స్ఫర్ నిబంధన కారణంగా క్వారంటైన్ లేకుండానే ప్రాక్టీస్ మొదలెట్టేశారు క్రికెటర్లు...</p>
ఇండియాలో వన్డే సిరీస్ ముగించుకున్న సామ్ కుర్రాన్, మొయిన్ ఆలీ నేరుగా చెన్నై సూపర్ కింగ్స్ క్యాంపుతో కలిశారు. బయో బబుల్ ట్రాన్స్ఫర్ నిబంధన కారణంగా క్వారంటైన్ లేకుండానే ప్రాక్టీస్ మొదలెట్టేశారు క్రికెటర్లు...
<p>సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు జానీ బెయిర్ స్టో, ఐపీఎల్ 2021 సీజన్ కోసం ఎస్ఆర్హెచ్ క్యాంపుతో కలిశాడు. సన్రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, నేడు ఇండియాకి వచ్చి క్వారంటైన్లో గడపబోతున్నాడు...</p>
సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు జానీ బెయిర్ స్టో, ఐపీఎల్ 2021 సీజన్ కోసం ఎస్ఆర్హెచ్ క్యాంపుతో కలిశాడు. సన్రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, నేడు ఇండియాకి వచ్చి క్వారంటైన్లో గడపబోతున్నాడు...
<p>మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్, ఐపీఎల్ 2021 సీజన్ షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలెట్టేసింది. గత ఐపీఎల్ తర్వాత మళ్లీ క్రికెట్ ఆడని మహేంద్ర సింగ్ ధోనీ, 14వ సీజన్ కోసం నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు...</p>
మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్, ఐపీఎల్ 2021 సీజన్ షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలెట్టేసింది. గత ఐపీఎల్ తర్వాత మళ్లీ క్రికెట్ ఆడని మహేంద్ర సింగ్ ధోనీ, 14వ సీజన్ కోసం నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు...
<p>ఐపీఎల్ 2020 సీజన్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న సురేశ్ రైనా, 2021 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో కలిశాడు. సురేశ్ రైనా, సయ్యద్ ముస్తాక్ ఆలీ, విజయ్ హజారే ట్రోఫీల్లో పాల్గొన్నాడు. </p>
ఐపీఎల్ 2020 సీజన్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న సురేశ్ రైనా, 2021 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో కలిశాడు. సురేశ్ రైనా, సయ్యద్ ముస్తాక్ ఆలీ, విజయ్ హజారే ట్రోఫీల్లో పాల్గొన్నాడు.
<p>ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ తర్వాత జట్టుకి దూరమైన రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్తో పాటు హెట్మయర్, క్రిస్ వోక్స్ ఇప్పటికే ముంబై చేరుకుని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో కలిశారు...</p>
ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ తర్వాత జట్టుకి దూరమైన రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్తో పాటు హెట్మయర్, క్రిస్ వోక్స్ ఇప్పటికే ముంబై చేరుకుని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో కలిశారు...
<p>ఇంగ్లాండ్ సిరీస్లో అద్భుతంగా రాణించిన రిషబ్ పంత్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంపులో నేరుగా కలిశాడు. ఈ సీజన్లో ఢిల్లీకి సారథిగా వ్యవహరించబోతున్నాడు రిషబ్ పంత్...</p>
ఇంగ్లాండ్ సిరీస్లో అద్భుతంగా రాణించిన రిషబ్ పంత్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంపులో నేరుగా కలిశాడు. ఈ సీజన్లో ఢిల్లీకి సారథిగా వ్యవహరించబోతున్నాడు రిషబ్ పంత్...
<p>భారత సారథి విరాట్ కోహ్లీ మాత్రం ఏప్రిల్ 1న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్యాంపుతో కలవబోతున్నాడు. ప్రస్తుతం బయో బబుల్లోనే కొనసాగుతున్న విరాట్, ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ గదను స్వీకరించిన తర్వాత ఆర్సీబీతో కలవనున్నాడు...</p>
భారత సారథి విరాట్ కోహ్లీ మాత్రం ఏప్రిల్ 1న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్యాంపుతో కలవబోతున్నాడు. ప్రస్తుతం బయో బబుల్లోనే కొనసాగుతున్న విరాట్, ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ గదను స్వీకరించిన తర్వాత ఆర్సీబీతో కలవనున్నాడు...
<p>రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా... ముంబై ఇండియన్స్ క్యాంపుతో కలవగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ ఏబీ డివిల్లియర్స్ కూడా ఇప్పటికే భారత్ చేరుకుని, క్వారంటైన్లో గడుపుతున్నాడు...</p>
రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా... ముంబై ఇండియన్స్ క్యాంపుతో కలవగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ ఏబీ డివిల్లియర్స్ కూడా ఇప్పటికే భారత్ చేరుకుని, క్వారంటైన్లో గడుపుతున్నాడు...
<p>శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, నటరాజన్, భువనేశ్వర్ కుమార్ ఇప్పటికే తమ తమ జట్ల క్యాంపులో కలిశారు... వీరితో పాటు కోచ్లు, సహాయ సిబ్బంది కూడా క్వారంటైన్లోకి వచ్చేశారు...<br /> </p>
శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, నటరాజన్, భువనేశ్వర్ కుమార్ ఇప్పటికే తమ తమ జట్ల క్యాంపులో కలిశారు... వీరితో పాటు కోచ్లు, సహాయ సిబ్బంది కూడా క్వారంటైన్లోకి వచ్చేశారు...
<p>ఏప్రిల్ 9న ప్రారంభమయ్యే ఐపీఎల్ 2021 సీజన్, దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో జరగనుంది. ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, కోల్కత్తా, చెన్నై నగరాల్లో జరిగే ఈ టోర్నీలో ఏ జట్టుకూ సొంత గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉండడం లేదు. </p>
ఏప్రిల్ 9న ప్రారంభమయ్యే ఐపీఎల్ 2021 సీజన్, దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో జరగనుంది. ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, కోల్కత్తా, చెన్నై నగరాల్లో జరిగే ఈ టోర్నీలో ఏ జట్టుకూ సొంత గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉండడం లేదు.