సీఎస్కే సపోర్టర్కి విష్ చేసిన మహేంద్ర సింగ్ ధోనీ... మాహీ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా...
మహేంద్ర సింగ్ ధోనీ... తన ఆటతో కంటే కూల్ యాటిట్యూడ్తో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న క్రికెటర్. తన కాళ్లను మొక్కేందుకు, తనను కౌగిలించుకుని మురిసిపోయేందుకు వచ్చే అభిమానులకు దొరకకుండా పరుగెత్తుతూ సరదాగా ఆడుకుంటూ ఉంటాడు ధోనీ...
తాజాగా ఐపీఎల్ 2021 సీజన్లోనూ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన ఓ పని, ఆయన్ని అభిమానులకు మరింత చేరువ చేసింది. కరోనా నిబంధనల కారణంగా ఐపీఎల్ 2021 మ్యాచులు చూసేందుకు అభిమానులకు అనుమతి లేదు.
కేవలం గ్రౌండ్ సిబ్బంది, ఆడే జట్టు సిబ్బంది, స్టాఫ్, ఫ్యామిలీలకు మాత్రమే అనుమతి ఉంది. అది కూడా స్టేడియంలోకి ఎంటర్ కావాలంటే కరోనా నెగిటివ్ రిపోర్టు సమర్పించాల్సి ఉంటుంది...
చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన ఓ మ్యాచ్లో ఓ గ్రౌండ్ స్టాఫ్, సీఎస్కే సపోర్టర్గా చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ, జెండాలు ధరించి నిల్చున్నాడు.
మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తున్న ధోనీకి, ఆ అభిమాని అభిమానంతో చెయ్యెత్తి సెల్యూట్ చేయగా... మాహీ కూడా తిరిగి విష్ చేశాడు...
అయితే ఈ ఫోటోపై కొందరు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మహేంద్ర సింగ్ ధోనీ, ఆ సపోర్టర్ను పట్టించుకోకుండా ఫోన్లో మాట్లాడుతున్నట్టు ఉందని కామెంట్లు చేస్తున్నారు.
మొదటి మ్యాచ్లో ఢిల్లీ చేతిలో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్, ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచి ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టికలో టాప్లోకి దూసుకెళ్లింది.