ముంబై ఇండియన్స్ ఫెయిల్యూర్కి అదొక్కటే కారణమా... చెన్నై చెపాక్ పిచ్పైన...
ముంబై ఇండియన్స్... ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఏకైక జట్టు. రోహిత్ శర్మ కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్లో తిరుగులేని ఆధిక్యం చూపించింది ముంబై ఇండియన్స్. అలాంటి జట్టు ఈసారి రేంజ్కి తగిన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతోంది...
రోహిత్ శర్మ రాణిస్తున్నప్పటికీ మిగిలిన ప్లేయర్లు ఇప్పటిదాకా చెప్పుకోదగిన పర్ఫామెన్స్ అయితే ఇవ్వలేదు. ముఖ్యంగా డి కాక్, హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ ఘోరంగా విఫలమవుతున్నారు... పోలార్డ్ కూడా పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయాడు.
ముంబై ఇండియన్స్ ఇప్పటిదాకా ఆడిన ఐదు మ్యాచులు చెన్నైలోని చెపాక్ స్టేడియంలోనే జరిగాయి. ‘హిట్ మ్యాన్’గా పేరొందిన రోహిత్ శర్మతో పాటు ముంబై ప్లేయర్లలో చాలామంది స్పిన్ ఆడడంలో తెగ ఇబ్బంది పడతారు..
ఐపీఎల్ 2019 వరకూ సొంత గ్రౌండ్ అడ్వాంటేజ్ను బాగా ఉపయోగించుకుంది ముంబై ఇండియన్స్. పరుగుల వరద పారే వాంఖడే స్టేడియంలో ముంబై బ్యాట్స్మెన్ చెలరేగిపోయేవారు.
అలాంటి ముంబై ఇండియన్స్ ప్లేయర్లకు ఈ సీజన్లో తొలి ఐదు మ్యాచులు స్పిన్ పిచ్ మీద ఆడాల్సిరావడం బాగా ఇబ్బంది పెట్టింది. ఇప్పటిదాకా లీగ్లో ఐదు మ్యాచులు ఆడిన ముంబై ఇండియన్స్ ఒక్క మ్యాచ్లో కూడా 160+ స్కోరు చేయలేకపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఇదే పిచ్పైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 200+ పైగా స్కోరు చేసింది. అంటే పిచ్ కంటే ఎక్కువగా బౌలర్లు ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఏ జట్టుకైనా భారీగా పరుగులు సమర్పించే పంజాబ్ కింగ్స్ బౌలర్లు కూడా ముంబైని ఇబ్బందిపెట్టగలిగారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
సీజన్ ప్రారంభంలో కుదురుకోవడానికి ఇబ్బంది పడడం ముంబైకి ఎప్పుడూ అలవాటే. చాలా సీజన్లలో మూడు మ్యాచులు ఓడిన తర్వాత ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు అసలు సిసలైన ఆటను బయటికి తీస్తారు...
అయితే మొదటి ఐదు మ్యాచుల్లో ముంబై ఇండియన్స్ పర్ఫామెన్స్ మాత్రం ఫ్యాన్స్కి ఏ మాత్రం మింగుడు పడడం లేదు. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో మొదటి బౌండరీ బాదేందుకు ఐదు ఓవర్ల వరకూ వేచి చూశారు ముంబై బ్యాట్స్మెన్...
పవర్ ప్లే ముగిసేసరికి కేవలం 21 పరుగులు మాత్రమే చేయగలిగింది ముంబై ఇండియన్స్. కేవలం ఒక్క వికెట్ పడిపోతే, మరీ ఇంత జాగ్రత్తగా ఆడడం ముంబైకి ఏ మాత్రం అలవాటు లేని విషయం... వికెట్లు పడుతున్నా భారీ షాట్లు ఆడేందుకే ప్రాధాన్యం ఇస్తారు ముంబై ఇండియన్స్...
డి కాక్ను అవుట్ చేస్తే రోహిత్ శర్మ బాదుతాడు... రోహిత్ను అవుట్ చేస్తే సూర్యకుమార్ యాదవ్ క్లాస్ను చూపిస్తాడు. అతన్ని కూడా అవుట్ చేస్తే ఇషాన్ కిషన్ మెరుపులు మెరిపిస్తాడు. కిషన్ను అవుట్ చేస్తే హార్ధిక్ పాండ్యా రెఢీగా ఉంటాడు... పాండ్యా వదిలేసినా... పోలార్డ్ దుమ్మురేపుతాడు...
ఇది ముంబై ఇండియన్స్ దుర్భేద్యమైన బ్యాటింగ్ ఆర్డర్ గురించి ఇన్నాళ్లు ప్రచారంలో ఉన్న ఓ ఫార్వర్డ్ మెసేజ్. అయితే ఇప్పుడు ఆ పటిష్టమైన బ్యాటింగ్ లైనప్కి జిడ్డు అంటుకుంది. అసలు చూస్తున్నది ముంబై ఇండియన్స్ టీమ్నేనా అని అనుమానపడేలా సాగుతోంది వారి ఆట...
ఐదు మ్యాచుల్లో మూడు ఓటములను ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్, ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక కమ్బ్యాక్ విజయాన్ని రుచి చూపించాల్సిందే. మరో రెండు మ్యాచుల్లో ఓడితే, డిఫెండింగ్ ఛాంపియన్ అవకాశాలు క్లిష్టం అవుతాయి.
ఇన్నాళ్లు స్టార్ ప్లేయర్లతో నిండిన జట్టును విజయవంతంగా నడిపిస్తూ, ముంబై ఇండియన్స్ అభిమానులకు ఫెవరెట్గా మారిన రోహిత్ శర్మకి అసలు సిసలైన పరీక్ష ఇప్పుడు ఎదురుకానుంది. ఈ పరీక్షలో పాస్ అయితే నిజంగానే అతను టీ20 కెప్టెన్సీ రేసులో నిలిచేందుకు అర్హుడిగా గుర్తించబడతాడు.