ఐపీఎల్ 2021 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచులు ఇవే... ఆఖరి స్థానంలో ఉన్న...
కరోనా కారణంగా అర్ధాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్ 2కు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది బీసీసీఐ. ఫేజ్ 2లో మొదటి మ్యాచ్ సీఎస్కే, ముంబై ఇండియన్స్ మధ్య జరగనుండగా, 22న తొలి మ్యాచ్ ఆడనుంది సన్రైజర్స్ హైదరాబాద్...
సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 22న మ్యాచ్తో ఫేజ్ 2ను ఆరంభించనుంది ఆరెంజ్ ఆర్మీ...
ఆ తర్వాత షార్జాలో సెప్టెంబర్ 25న పంజాబ్ కింగ్స్తో తలబడుతుంది సన్రైజర్స్... 27న దుబాయ్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ ఆడుతుంది...
సెప్టెంబర్ 30న చెన్నై సూపర్ కింగ్స్ కింగ్స్తో షార్జాలో మ్యాచ్ ఆడే ఆరెంజ్ ఆర్మీ, ఆ తర్వాత కోల్కత్తా నైట్రైడర్స్తో దుబాయ్ వేదికగా అక్టోబర్ 3న మ్యాచ్ ఆడుతుంది...
అక్టోబర్ 6న అబుదాబీ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ ఆడే సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్తో మధ్యాహ్నం చివరి గ్రూప్ మ్యాచ్ ఆడుతుంది.
ముంబై ఇండియన్స్ సెప్టెంబర్ 19న సీఎస్కేతో, 23న కేకేఆర్తో, 26న ఆర్సీబీతో, 28న పంజాబ్ కింగ్స్తో మ్యాచులు ఆడుతుంది. ఆ తరత్వాత ఢిల్లీతో అక్టోబర్ 2న, ఆర్ఆర్తో అక్టోబర్ 5న, 8న సన్రైజర్స్తో మ్యాచులు ఆడనుంది.
చెన్నై సూపర్ కింగ్స్ సెప్టెంబర్ 19న ముంబైతో, 24న ఆర్సీబీతో, 26న కేకేఆర్తో, 30న సన్రైజర్స్తో మ్యాచులు ఆడుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 2న ఆర్ఆర్తో, 4న ఢిల్లీ, 7న పంజాబ్తో మ్యాచులు ఆడుతుంది.
ఢిల్లీ క్యాపిటల్స్, సెప్టెంబర్ 22న సన్రైజర్స్, 25న రాజస్థాన్ రాయల్స్, 28న కేకేఆర్తో మ్యాచులు ఆడుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 2న ముంబై, 4న చెన్నై, 8న ఆర్సీబీతో మ్యాచులు ఆడనుంది.
పంజాబ్ కింగ్స్, సెప్టెంబర్ 21న ఆర్ఆర్తో, 25న సన్రైజర్స్, 28న ముంబై, అక్టోబర్ 1న కేకేఆర్, అక్టోబర్ 3న ఆర్సీబీ, అక్టోబర్ 7న సీఎస్కేలతో మ్యాచులు ఆడుతుంది.
రాజస్థాన్ రాయల్స్, సెప్టెంబర్ 21న పంజాబ్ కింగ్స్తో, 25న ఢిల్లీ క్యాపిటల్స్తో, 27న ఎస్ఆర్హెచ్తో, 29న ఆర్సీబీతో మ్యాచులు ఆడుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 2న సీఎస్కేతో, 5న ముంబై, 7న కేకేఆర్తో మ్యాచులు ఆడుతుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సెప్టెంబర్ 20న కేకేఆర్, 24న సీఎస్కే, 26న ముంబై, 29న ఆర్ఆర్, అక్టోబర్ 3న పంజాబ్ కింగ్స్, 6న సన్రైజర్స్, 8న ఢిల్లీతో మ్యాచులు ఆడుతుంది.
కోల్కత్తా నైట్రైడర్స్, సెప్టెంబర్ 20న ఆర్సీబీ, 23న ముంబై, 26న సీఎస్కే, 28న ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచులు ఆడుతుంది. అక్టోబర్ 1న పంజాబ్, 3న సన్రైజర్స్, 7న రాజస్థాన్ రాయల్స్తో మ్యాచులు ఆడుతుంది.