IPL 2020: మన క్రికెటర్లు దుబాయ్లో ఏం తింటున్నారో తెలుసా...
IPL 2020 సీజన్ కోసం యూఏఈ చేరుకున్నారు మన క్రికెటర్లు. మనదేశంతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా క్రికెటర్లు కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా లీగ్ కోసం ఏడారి దేశంలో నెలరోజులుగా తిష్టవేశారు. మరి అక్కడ వాళ్లేం తింటున్నారో తెలుసా...
భారత సారథి విరాట్ కోహ్లీ ఫిట్నెస్పై చాలా శ్రద్ధ తీసుకుంటాడు. అనుష్క శర్మను పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తి వెజిటేరియన్గా మారిన విరాట్, పాల ఉత్పత్తులు కూడా తీసుకోడు...
దుబాయ్లోని హోటల్ వాల్రోఫ్లో ఉంటున్న ఈ ఇద్దరూ పండ్లు, దుబాయ్ స్పెషల్ ఫలహారాలు తీసుకుంటున్నారు...
క్రిస్గేల్ మంచి ఫుడ్ ప్రియుడు. కొన్నిరోజుల కిందట ఫుడ్ పాయిజన్కి కూడా గురైన క్రిస్ గేల్, ప్రస్తుతం రిస్క్ తీసుకోకుండా లైట్ ఫుడ్ తీసుకుంటున్నాడట.
దుబాయ్లోని సోఫిటెల్ హోటెల్ ఉంటూ స్ట్రాబెర్రీ, పుచ్చకాయ వంటి ఆహారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడట క్రిస్గేల్...
చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ, తన టీమ్ సభ్యులతో కలిసి దుబాయ్లోని తాజ్ హోటెల్లో ఉంటున్నారు...
ఫిట్నెస్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ... మంచి పోషక విలువలున్న ఫ్రూట్ షేక్స్, లైట్ ఫుడ్తో పాటు హెవీ ఫుడ్ను కూడా లాగిస్తున్నారట సీఎస్కే టీమ్...
అబుదాబిలోని సెయింట్ రెజి్ సడియట్ ఐలాండ్ రిసార్ట్లో ఉంటున్న ముంబై ఇండియన్స్ ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా... తనకి ఎంతో ఇష్టమైన ఎనర్జీ డ్రింక్ తాగుతూ ఉంటాడట.
కోల్కత్తా నైట్రైడర్స్ తరపున ఆడేందుకు పెద్దగా అవకాశాలు రాకున్నా...దుబాయ్ టూర్ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు కుల్దీప్ యాదవ్... అబుదాబిలోని ది రిట్జ్ కార్టన్ హోటెల్లో ఉంటున్న కుల్దీప్ యాదవ్, హెల్తీ ఫుడ్, ఫ్రూట్ జ్యూస్లు తీసుకుంటూ రిలాక్స్ అవుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు...
షేన్ వాట్సన్తో కలిసి ఫ్రూట్ షేక్ను ఎంజాయ్ చేస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ...
దుబాయ్లోని హోటల్ వాల్రోఫ్లో హోటెల్లో డిన్నర్ చేస్తున్న విరాట్ కోహ్లీ...
రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ సంజూ శాంసన్, రాబిన్ ఊతప్ప కలిసి బార్బిక్యూలో గ్రిల్ చేసిన మాంసాహారం తీసుకుంటున్నప్పుడు తీసిన పిక్ ఇది...
మోన్స్టార్ ఎనర్జీ డ్రింక్కి బ్రాండ్ అంబాసిడర్ అయిన పాండ్యా, దుబాయ్లోనూ ఈ డ్రింక్ను వదలడం లేదట...