IPL 2020: ఈ సీజన్లో బలమైన జట్టు ఇదే...
చెన్నై సూపర్ కింగ్స్లో రైనా, భజ్జీ లేరు... ముంబై ఇండియన్స్ జట్టులో మలింగ లేడు. వీరి గైర్హజరీతో అత్యంత బలమైన ఈ రెండు జట్లు కాస్తా వీక్ అయ్యాయి. మరి ఈ సీజన్లో అత్యంత బలమైన జట్టు ఏదంటే... సన్రైజర్స్ హైదరాబాద్. ఎందుకంటే...
ఐపీఎల్లో పరుగుల వరద పారించే డేవిడ్ వార్నర్కి తోడుగా గత సీజన్లో దుమ్మురేపిన బెయిర్ స్టో ఓపెనర్లుగా రాబోతున్నారు. గత సీజన్లో ఈ ఇద్దరూ కలిసి 926 పరుగులు చేశారు.
‘మిస్టర్ సూపర్ కూల్’ కేన్ విలియంసన్ ఎట్లాడో ఉన్నారు. నిలకడకు మారుపేరైన కేన్ మామ, వన్డౌన్లో వచ్చే అవకాశం ఉంది.
వీరికి తోడుగా ఆఫ్ఘాన్ ఆల్రౌండర్ మహ్మద్ నబీ జట్టులో ఉన్నాడు. వన్డే వరల్డ్కప్లో తన సునామీ ఇన్నింగ్స్తో భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు నబీ.
ఆసీస్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ కూడా ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చేయగలడు.
ఐపీఎల్లో సెంచరీ చేసిన తొలి స్వదేశీ క్రికెటర్ మనీశ్ పాండేకి తోడు విరాట్ సింగ్, అండర్ 19 యంగ్ సెన్సేషన్ ప్రియమ్ గార్గ్, భవనక సందీప్, అబ్దుల్ సమద్ వంటి స్వదేశీ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు.
ఐపీఎల్ ఫైనల్లో సెంచరీ చేసిన ఒకేఒక్క క్రికెటర్గా రికార్డు సృష్టించిన వృద్ధమాన్ సాహా కీలక సమయాల్లో జట్టును ఆదుకోగలడు.
ఆఫ్ఘాన్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్, భారత స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్తోడుగా సిద్ధార్థ్ కౌల్, ఖలీల్ అహ్మద్, నటరాజన్, సందీప్ శర్మ, నదీమ్ వంటి భారత యువ బౌలర్లతో పటిష్టంగా కనిపిస్తోంది సన్రైజర్స్.
ఎంట్రీ నుంచి మంచి ట్రాక్ రికార్డు కూడా ఉండడం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కలిసొచ్చే అంశాలు...