సెంచరీతో ‘గబ్బర్’ సరికొత్త రికార్డులు... శిఖర్ ధావన్ ఖాతాలో...
IPL 2020 సీజన్లో భారత బ్యాట్స్మెన్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. వరుసగా మూడు సీజన్లలో 500+ పరుగులు చేసిన మొదటి ఇండియన్ బ్యాట్స్మెన్ కెఎల్ రాహుల్ రికార్డు క్రియేట్ చేయగా... తాజాగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ‘గబ్బర్’ శిఖర్ ధావన్ వరుసగా రెండో సెంచరీ బాదాడు. ఈ సెంచరీతో పలు రికార్డులు బద్ధలు కొట్టాడు గబ్బర్.
167 మ్యాచుల తర్వాత ఐపీఎల్లో తొలి సెంచరీ బాదాడు శిఖర్ ధావన్... ఫస్ట్ సెంచరీ బాదేందుకు అత్యధిక ఇన్నింగ్స్లు తీసుకున్న బ్యాట్స్మెన్ ధావనే.
అయితే మొదట సెంచరీ బాదిన తర్వాతి మ్యాచ్లోనే రెండో శతకం బాదాడు శిఖర్ ధావన్... రెండో సెంచరీకి అతి తక్కువ ఇన్నింగ్స్లు వాడిన క్రికెటర్ కూడా ధావనే...
ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున అత్యధిక సెంచరీలు బాదిన ప్లేయర్గా వార్నర్తో కలిసి టాప్లో నిలిచాడు ధావన్.
ధావన్, వార్నర్ రెండేసి సెంచరీలు బాదగా.. వీరేంద్ర సెహ్వాగ్, కేవిన్ పీటర్సన్, ఏబీ డివిల్లియర్స్, సంజూ శాంసన్, రిషబ్ పంత్, డి కాక్ ఒక్కో సెంచరీ చేశారు.
ఒకే సీజన్లో రెండు సెంచరీలు చేసిన నాలుగో బ్యాట్స్మెన్గా నిలిచాడు శిఖర్ ధావన్. ఇంతకుముందు గేల్, ఆమ్లా, వాట్సన్ ఈ ఫీట్ సాధించారు. విరాట్ కోహ్లీ ఒకే సీజన్లో (2016) 4 సెంచరీలు బాది టాప్లో ఉన్నాడు.
ఐపీఎల్లో 5000 పరుగులను పూర్తిచేసుకున్నాడు శిఖర్ ధావన్... ఈ ఫీట్ అందుకున్న ఐదో బ్యాట్స్మెన్ ధావన్. ఇంతకుముందు రైనా, కోహ్లీ, రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ ఈ ఫీట్ అందుకున్నారు.
168 మ్యాచుల్లో 5 వేల మైలురాయి అందుకున్న ధావన్, వార్నర్ (135), విరాట్ కోహ్లీ (157) తర్వాత వేగంగా ఈ ఫీట్ అందుకున్న ప్లేయర్గా నిలిచాడు ధావన్.