IPL 2020: ధోనీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడా... భార్యతో కలిసి...
మహేంద్ర సింగ్ ధోనీ... క్రికెట్ ప్రపంచంలో ఎన్నో రికార్డులను లిఖించిన లెజెండ్. భారత జట్టుకి రెండు ప్రపంచకప్లు అందించిన మాహీ ఫ్యాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మాస్ అండ్ క్లాస్లో బీభత్సమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ... త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడట.
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మహేంద్ర సింగ్ ధోనీ... రిటైర్మెంట్ తర్వాత భారత మిలిటరీలో కొనసాగాలని భావిస్తున్నాడు...
ధోనీ భార్య సాక్షి సింగ్... సినిమాల్లోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తోంది.
గత ఏడాది నిర్మాతగా మారి ఓ డాక్యుమెంటరీని కూడా నిర్మించింది సాక్షి సింగ్.
ధోనీ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఓ వెబ్ సిరీస్ను నిర్మించాలని ప్రయత్నాలు చేస్తోంది సాక్షి...
‘ధోనీ ఎంటర్టైన్మెంట్’ మీడియా హౌస్ పేరు మీద పూర్తిస్థాయి నిర్మాణ రంగంలోకి అడుగుబెట్టాలని చూస్తోంది సాక్షి సింగ్...
ఈ బ్యానర్ మీద తెరకెక్కే సినిమాలన్నింటికీ మహేంద్ర సింగ్ ధోనీ నిర్మాతగా వ్యవహారించబోతున్నాడు...
అఘోరాల జీవిత చరిత్ర ఆధారంగా ఓ థ్రిల్లింగ్ అడ్వెంచర్ కథను వెబ్ సిరీస్గా రూపొందించాలనుకుంటోంది సాక్షి సింగ్ ధోనీ...
ప్రపంచంలో అత్యంత ధనిక క్రికెటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న ధోనీ... ప్రస్తుతం అనేక కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు...
గత ఏడాది ‘రోర్ ద లయన్’ పేరుతో ఓ డాక్యుమెంటరీని నిర్మించింది సాక్షి సింగ్ ధోనీ...
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు, రెండేళ్ల బ్యాన్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తిరిగి ఐపీఎల్లోకి ఎలా ఎంట్రీ విజయాలు సాధించదనేది ‘రోర్ ద లయర్’ కాన్సెప్ట్...
‘రోర్ ద లయన్’ డాక్యుమెంటరీకి కబీర్ ఖాన్ దర్శకుడిగా పనిచేశాడు...
భార్యకు సినిమాలపై ఉన్న ఆసక్తిని గుర్తించిన మహేంద్ర సింగ్ ధోనీ... నిర్మాతగా కొత్త అవతారం ఎత్తబోతున్నాడు.
సోషల్ మీడియాలో సాక్షి సింగ్కి మంచి ఫాలోయింగ్ ఉంది.
మహేంద్ర సింగ్ ధోనీ, సాక్షి సింగ్ దంపతులకు జీవా సింగ్ అనే కూతురు కూడా ఉంది. జీవా సింగ్కు కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.
క్రికెట్ మైదానంలో ఎంతో హుందాగా వ్యవహారించే ధోనీ ‘కెప్టెన్ కూల్’గా గుర్తింపు పొందాడు. పర్సనల్ లైఫ్లో మాత్రం ధోనీపై సాక్షి డామినేషన్, ఆమె పోస్టు చేసే ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది.