IPL 2020: ధోనీని చూసి కోహ్లీ ‘వాత’ పెట్టుకున్నాడా...
IPL 2020 సీజన్ 13లో మెరుగైన ప్రదర్శన ఇస్తున్నట్టు కనిపించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... మరోసారి చెత్త ప్రదర్శనతో చిత్తుగా ఓడింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో యువకుల టీమ్తో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో ఘోరంగా ఫెయిల్ అయ్యి, మరోసారి ట్రోలింగ్కి గురైంది ఆర్సీబీ. కోహ్లీ చెత్తాట వెనక మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నాడట.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్కి ముందు రోజు ఇదే వేదికపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో తలబడింది చెన్నై సూపర్ కింగ్స్...
టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... 179 పరుగుల భారీ లక్ష్యాన్ని చెన్నై ముందుంచింది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్లను ఓ ఆటాడుకున్న సీఎస్కే ఓపెనర్లు డుప్లిసిస్, షేన్ వాట్సన్ కలిసి అజేయంగా 181 పరుగులు జోడించారు.
షేన్ వాట్సన్, డుప్లిసిస్ బ్యాటింగ్ కారణంగా 10 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది చెన్నై జట్టు...
హ్యాట్రిక్ ఓటముల తర్వాత ధోనీ టీమ్కి దక్కిన పూర్తి ఆధిక్యపు విజయం ఇదే...
ఈ మ్యాచ్ చూసిన విరాట్ కోహ్లీ... టాస్ గెలిచిన తర్వాత ఏ మాత్రం ఆలోచించకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
చాహాల్ అండ్ కో బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఢిల్లీ బ్యాట్స్మెన్... 20 ఓవర్లలో 197 పరుగుల భారీ టార్గెట్ను ఇచ్చారు...
దీంతో షాక్ అయిన కోహ్లీ టీమ్... చేధనలో తడబడి ఘోర ఓటమిని మూటగట్టుకుంది...
రబాడా, నోకియా, అశ్విన్ వంటి టాప్ బౌలర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడిన ఆర్సీబీ బ్యాట్స్మెన్... అక్షర్ పటేల్ను కూడా ఫేస్ చేయలేకపోయారు.
పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్టుగా... ధోనీ టీమ్ ఆటను చూసి ఫీల్డింగ్ ఎంచుకున్న విరాట్ కోహ్లీ భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాడు.
ధోనీ జట్టులో ఉన్నట్టుగా ‘గేమ్ ఛేంజర్లు’ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో లేరు...
ఉన్నవారిని ఎలా వాడాలో కూడా ధోనీకి తెలిసినట్టుగా కోహ్లీకి తెలీదు...
అందుకే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పర్ఫామెన్స్ ఇలా ఉందని చెబుతున్నారు విశ్లేషకులు...