ఆలస్యంగా అందుకుని, అదరగొట్టాడు... సిరాజ్పై ప్రశంసల జల్లు...
IPL 2020 సీజన్లో కోల్కత్తా నైట్రైడర్స్పై అద్భుత విజయాన్ని అందుకుని, డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైనే వెనక్కినెట్టి రెండోస్థానానికి ఎగబాకింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ముఖ్యంగా హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చి, వండర్ క్రియేట్ చేశాడు.
4 ఓవర్లలో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చిన మహ్మద్ సిరాజ్, 3 వికెట్లు తీసుకున్నాడు...
మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో ఏకంగా రెండు మెయిడిన్లు ఓవర్లు ఉన్నాయి. ఈ రెండూ పవర్ ప్లేలోనే వచ్చాయి.
పవర్ ప్లేలో రెండు మెయిడిన్లు వేసిన మొట్టమొదటి బౌలర్ మహ్మద్ సిరాజ్. అలాగే ఈ సీజన్లో అత్యుత్తమ ఎకానమీ నమోదుచేశాడు మహ్మద్ సిరాజ్.
నిజానికి సిరాజ్తో ఓపెనింగ్ బౌలింగ్ చేయించాలనేది ఆలస్యంగా డిసైడ్ అయ్యిందట.
‘వాస్తవానికి ముందు వాషింగ్టన్ సుందర్ లేదా క్రిస్ మోరిస్తో బౌలింగ్ చేయించాలనుకున్నాం. కానీ లాస్ట్ మినెట్లో సిరాజ్కి బాల్ ఇచ్చాం. అతను అద్భుతమే చేశాడు’ అని చెప్పుకొచ్చాడు ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.
నిజానికి మ్యాచ్కి ముందు సిరాజ్, జట్టులో లేకపోతేనే బెటర్ అని ట్రోల్స్ చేశారు చాలామంది. అతను ఉంటే కేకేఆర్కి భారీగా పరుగులు ఇస్తాడని విమర్శించారు.
అయితే అలాంటి వారికి తన పర్ఫెమన్స్తోనే అదిరిపోయే సమాధానం చెప్పాడు మహ్మద్ సిరాజ్...
ఐపీఎల్ తర్వాత జరగబోయే ఆసీస్ సిరీస్లో కూడా మహ్మద్ సిరాజ్ ఆడబోతున్నట్టు టాక్ వినబడుతోంది...
సిరాజ్కి రెండో ఓవర్లోనే బౌలింగ్ ఇవ్వడం చాలా మంచి వ్యూహం అని... విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని ప్రశింసించాడు కేకేఆర్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.