IPL 2020: ధోనీ అంటే నాకు భయమా... వాళ్లనే అడుగు చెబుతారు... కామెంటేటర్ వ్యాఖ్య...
IPL 2020 సీజన్ చెన్నై సూపర్ కింగ్స్ తొలి సగం మ్యాచుల్లో నిరాశజనక ప్రదర్శన ఇచ్చింది. ఎప్పుడూ లేనట్టుగా ప్లేఆఫ్ కోసం పాయింట్ల పట్టికలో కింద ఉన్న మిగిలిన జట్లతో పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సీజన్లో ధోనీ టీమ్ పర్ఫామెన్స్పై ట్రోల్స్ విపరీతంగా వినిపిస్తున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్కి మూడు టైటిల్స్ అందించిన సారథి మహేంద్ర సింగ్ ధోనీని కూడా వదలకుండా ట్రోల్ చేస్తున్నారు అభిమానులు...
సురేశ్ రైనా లేని జట్టును నడిపించడంలో ధోనీ తీసుకుంటున్న నిర్ణయాలు, సరైన ఫలితాలను ఇవ్వడం లేదు...
సోషల్ మీడియాలో ట్రోల్స్ వినిపిస్తున్నా, ధోనీని మాత్రం కామెంటేటర్లు తప్పు పట్టడం లేదు...
శ్రేయాస్ గోపాల్, కెఎల్ రాహుల్, స్టీవ్ స్మిత్ వంటి వాళ్ల కెప్టెన్సీలో కూడా తప్పులు ఎత్తి చూపిస్తూ వ్యాఖ్యలు చేస్తున్న కామెంటేటర్లు, ధోనీ విషయంలో మాత్రం మొత్తం సీఎస్కే ధోరణినే తప్పుబడుతున్నారు.
భారత జట్టు సారథిగా మహేంద్ర సింగ్ ధోనీ సాధించిన విజయాలే దీనికి కారణం. అయితే అంపైర్లు కూడా ధోనీ గుర్రుగా చూస్తే నిర్ణయం మార్చుకోవడం వివాదాస్పదమైంది...
తాజాగా ఓ నెటిజన్... ‘అంపైర్లు, కామెంటేటర్లు ధోనీని చూసి భయపడుతున్నారు. ప్లేయర్లను విమర్శించే మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా దీనికి మినహాయింపు కాదు’ అని వివాదాస్పద కామెంటేటర్పై కామెంట్ చేశాడు.
ఈ ట్వీట్కి స్పందించిన సంజయ్ మంజ్రేకర్... ‘ధోనీ అంటే నాకు భయమా... నేను చెన్నై సూపర్ కింగ్స్ను అంటే మొత్తం టీమ్ను అన్నట్టు, ధోనీని అన్నట్టు కూడా. ఎవరైనా బ్యాట్స్మెన్ తప్పు చేస్తే, అతన్ని అంటాం. జట్టు నిర్ణయాలు తప్పుగా ఉంటే జట్టు మొత్తాన్ని తిడతాం’ అంటూ వ్యాఖ్యానించాడు.
ఇంతకుముందు రవీంద్ర జడేజా గురించి... ‘బిట్ అండ్ పీస్ ప్లేయర్’ అని కామెంట్ చేసిన మంజ్రేకర్, పియూష్ చావ్లా, అంబటి రాయుడు లో ప్రొఫైల్ క్రికెటర్లు అంటూ విమర్శించాడు.
తాను ఎవ్వరకీ భయపడనని, కావాలంటే ట్విట్టర్ దోస్తులనే అడిగి తెలుసుకోవాలని చెప్పాడు బ్యాన్ పడిన కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్...
మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్, ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే నేటి మ్యాచ్లో గెలిచి తీరాల్సిందే...