IPL 2020: ధోనీసేనకి మరో షాక్... గాయంతో ఐపీఎల్కి దూరమైన మరో ప్లేయర్...
IPL 2020 సీజన్లో ఇప్పటికే దాదాపు ప్లేఆఫ్ అవకాశాలకి దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై మరో పిడుగు పడింది. అసలే సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ లాంటి ప్లేయర్లు దూరం కావడంతో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్న సీఎస్కేకి గాయం కారణంగా మరో ప్లేయర్ దూరం కానున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్కి విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో, గాయం కారణంగా మొదటి నాలుగు మ్యాచుల్లో బరిలో దిగలేదు...
సీఎస్కే చెత్త ప్రదర్శనతో మ్యాచుల్లో ఓడిపోతుండడం చూసి, పెవిలియన్లో బ్రావో బాధపడుతుండడం చూసి అందరూ చలించిపోయారు...
గాయం నుంచి కోలుకుని మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన బ్రావో, బౌలింగ్లో అదరగొట్టాడు. 6 మ్యాచుల్లో బ్యాటింగ్లో విఫలమైనా బౌలింగ్లో 6 వికెట్లు తీసుకున్నాడు...
ఒకే మ్యాచ్లో 3 వికెట్లు తీసుకున్న డ్వేన్ బ్రావో... మరోసారి గాయం తిరగబెట్టడంతో ఐపీఎల్ మొత్తానికి దూరం కానున్నాడు..
ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో డ్వేన్ బ్రావో గాయం కారణంగా బౌలింగ్ చేయలేదు. అతని స్థానంలో బౌలింగ్ వేసిన రవీంద్ర జడేజా... ఏకంగా 24 పరుగులు ఇచ్చి, జట్టు ఓటమికి కారణమయ్యాడు.
‘డ్వేన్ బ్రావో తొడ కండరాల గాయంతో సీజన్లో మిగిలిన మ్యాచ్లకు దూరం కానున్నట్టు’ సీఎస్కే సీఈవో విశ్వనాథన్ ప్రకటించారు...
సీజన్లో 10 మ్యాచులు ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ, కేవలం 3 మ్యాచుల్లో మాత్రమే గెలిచి ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి ఆఖరి స్థానంలో నిలిచింది.
యంగ్ ప్లేయర్లలో స్పార్క్ కనిపించలేదని, అందుకే వారికి అవకాశం ఇవ్వలేదని మహేంద్ర సింగ్ ధోనీ చేసిన కామెంట్ చర్చనీయాంశమైంది.