సూపర్ ఓవర్లో మెరిసిన సూపర్ బ్యూటీ... ఎవరీ హాట్ గర్ల్...
IPL 2020 సీజన్లో ఓ చారిత్రక మ్యాచ్కి వేదికైంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్. ఆధిక్యం చేతులు మారుతూ ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ సాగిన ఈ సూపర్ థ్రిల్లర్ మ్యాచ్లో టీవీలో కనిపించిన ఓ అమ్మాయి, కుర్రాళ్ల మనసులు గెలుచుకుంది.
ముంబై, పంజాబ్ మధ్య ఉత్కంఠభరితంగా సాగిన ‘డబుల్ సూపర్ ఓవర్’ మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ విజయానికి ఒక బంతికి 2 పరుగులు కావాల్సిన దశలో టీవీ స్క్రీన్పై మెరిసిందో బ్యూటీ...
టెన్షన్ పడుతూ గోర్లు కొరుక్కుంటున్న ఈ బ్యూటీని మైమరిచిపోయిన కెమెరామెన్, ఆమెను 25 సెకన్లపాటు అలాగే చూపించాడు.
స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచులకి హాజరయ్యే అందమైన బ్యూటీలను బంధించి, వారికి బీభత్సమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టిన కెమెరామెన్కి ఈ సారి అలాంటి ఛాన్స్ దక్కలేదు.
దాంతో రాకరాక కనిపించిన సూపర్ బ్యూటీ... అందాన్ని అలా టీవీ తెరలపై చూపించి ఖుషీ అయ్యాడు కెమెరామెన్. ఈ మ్యాచ్ జరిగిన తర్వాత ఆ అమ్మాయి ఎవ్వరనే ఆతృతతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది.
ఆమె ఐడీ తెలుసుకునేందుకు కుర్రాళ్లు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సైట్లను ఆశ్రయించారు. ఎలాగోలా ఆమె ఐడీని కనుగొన్నారు.
ఈ మిస్టరీ గర్ల్ పేరు రియానా లల్వానీ... ఈ మ్యాచ్కి ముందు పెద్దగా ఫాలోయింగ్ లేని రియనాకి ఇప్పుడు 22 వేల ఫాలోవర్లు వచ్చేశారు..(pic: Instagram/riana lalwani
అంతేనా తనకి వచ్చిన ఫాలోయింగ్తో బయోలో ‘సూపర్ ఓవర్ గర్ల్’ అని యాడ్ చేసేసింది రియానా...
చాహాల్ గర్ల్ఫ్రెండ్ ధనశ్రీ వర్మకి రియానా లల్వానీ బెస్ట్ ఫ్రెండ్. దీంతో ధనశ్రీతో పాటు స్టేడియాల్లోకి రియానాకి కూడా అనుమతి లభించింది.
అలా పంజాబ్, ముంబై మ్యాచ్కి వచ్చిన రియానా... టీవీల్లో కనిపించి ఒక్క రోజులోనే ఫుల్లు క్రేజ్ తెచ్చేసుకుంది.
ఈ క్రేజ్ కారణంగా రెండు మూడు నెలలకోసారి పోస్టులు చేసే రియానా, ఇప్పుడు రోజుకో ఫోటో పెడుతూ క్రేజ్ పెంచుకోవాలని చూస్తోంది.