MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • రికార్డులే రికార్డులు.. కోహ్లీ, రోహిత్ ల జోరు.. చరిత్ర సృష్టించిన టీమిండియా..

రికార్డులే రికార్డులు.. కోహ్లీ, రోహిత్ ల జోరు.. చరిత్ర సృష్టించిన టీమిండియా..

INDvsSL Live: భారత్ -శ్రీలంక మధ్య  తిరువనంతపురంలో ముగిసిన మూడో వన్డేలో   రోహిత్ సేన  ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్  లో పలు కీలక రికార్డులు బద్దలయ్యాయి.  

2 Min read
Author : Srinivas M
Published : Jan 15 2023, 09:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

స్వదేశంలో టీమిండియా  మరో సిరీస్ ను ఒడిసిపట్టింది.  శ్రీలంకపై ఇదివరకే  టీ20 సిరీస్ నెగ్గిన ఊపులో ఉన్న  భారత క్రికెట్ జట్టు.. తాజాగా వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. తిరువనంతపురం వేదికగా ముగిసిన మూడో వన్డేలో నెగ్గడం ద్వారా భారత్ తో పాటు  వ్యక్తిగతంగా కోహ్లీ, రోహిత్ లు కూడా పలు రికార్డులు తిరగరాశారు. అవేంటో ఇక్కడ చూద్దాం. 

27

కోహ్లీ కమాల్..  పరుగుల యంత్రం, రికార్డుల రారాజు వన్డేలలో సచిన్ సాధించిన ఘనతలను అందుకోవడానికి మరింత చేరువవుతున్నాడు.   నేడు  87 బంతుల్లో సెంచరీ చేయడం ద్వారా  కోహ్లీ.. వన్డేలలో 46వ శతకం బాదాడు.   తద్వారా   సచిన్ కంటే (49) మూడు సెంచరీల దూరంలో నిలిచాడు.  

37
Image credit: KCA

Image credit: KCA

ఇక ఈ మ్యాచ్ లో సెంచరీ చేయడం ద్వారా కోహ్లీ.. వన్డేలలో అత్యధిక పరుగులు సాధించిన   జాబితాలో ఐదో స్థానంలో ఉన్న  మహేళ జయవర్దెనే  రికార్డును అధిగమించాడు.  ఈ మ్యాచ్ కు ముందు కోహ్లీ.. వన్డేలలో  267 మ్యాచ్ లు ఆడి  258 ఇన్నింగ్స్ లలో 12,588 పరుగులు సాధించాడు. కానీ నేటి మ్యాచ్ లో 166 పరుగులు చేయడంతో అతడు 12,659 పరుగులకు చేరాడు. తద్వారా  జయవర్దెనే పేరిట ఉన్న  267 మ్యాచ్ లు ఆడి  258 ఇన్నింగ్స్ లలో 12,588 పరుగుల రికార్డు చెరిగిపోయింది.   కోహ్లీ కంటే ముందు టెండూల్కర్, సంగక్కర, పాంటింగ్, జయసూర్య ఉన్నారు. 

47

ఈ వన్డేలో సెంచరీతో స్వదేశంలో కోహ్లీ 21 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. 20 సెంచరీలతో ఇన్నాళ్లు సచిన్ ఈ లిస్ట్ లో టాప్ లో ఉండగా   ఇప్పుడు కోహ్లీ దానిని అధిగమించాడు. అంతేగాక ఒకే జట్టుపై అత్యధిక పరుగులు సాధించిన  ఆటగాడిగానూ కోహ్లీ నిలిచాడు. లంకపై కోహ్లికి ఇది పదో వన్డే సెంచరీ. గతంలో సచిన్ 9 సెంచరీలు చేశాడు. 

57

రోహిత్ శర్మ కూడా  ధోని రికార్డును సమం చేశాడు.  స్వదేశంలో వన్డే క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా   ధోని పేరిట ఉన్న రికార్డుతో  హిట్ మ్యాన్ సమానంగా నిలిచాడు. లంకతో మ్యాచ్ లో రోహిత్  మూడు సిక్సర్లు కొట్టాడు. తద్వారా  స్వదేశంలో  వన్డే ఫార్మాట్ లో  అత్యధిక సిక్సర్ల (123) ను  ఈక్వల్ చేసినట్టైంది. 

67

రోహిత్ తో పాటు  కోహ్లీ కూడా ధోనికి లంక పై ఉన్న ఓ రికార్డును  తుడిచేశాడు.  లంకపై  67 మ్యాచ్ లు ఆడిన ధోని.. 53 ఇన్నింగ్స్ లలో 2,383 రన్స్ చేశాడు.  తాజాగా  కోహ్లీ దానిని అధిగమించాడు.  కోహ్లీ.. 50 మ్యాచ్ లలో  2,387  పరుగులు సాధించాడు. ఈ జాబితాలో సచిన్.. 84 మ్యాచ్ లలో 3,113 రన్స్ చేశాడు. 

77

ఇక వన్డేలలో పరుగుల పరంగా భారత్ కు ఇదే అతిపెద్ద విజయం. ఈ మ్యాచ్ లో భారత్.. 317 పరుగుల తేడాతో గెలిచింది. ఈ సందర్భంగా భారత్ ప్రపంచ రికార్డును బ్రేక్ చేసింది. గతంలో  న్యూజిలాండ్.. ఐర్లాండ్ పై  290 పరుగుల తేడా (2008లో)తో గెలిచింది. ఇప్పుడు ఈ రికార్డు కూడా తుడిచిపెట్టుకుపోయింది. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup : పాకిస్థాన్ vs న్యూజిలాండ్ మ్యాచ్ రద్దుతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
Recommended image2
PAK vs NZ : పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు.. సెమీస్ కష్టమే.. అసలు కారణం ఇదే
Recommended image3
IND vs SA : భారత్ vs సౌతాఫ్రికా మ్యాచ్ ను వర్షం దెబ్బకొడుతుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved