INDvsSL టీ20 ఫైనల్: టాస్ గెలిచిన టీమిండియా... మరో కొత్త ప్లేయర్కి అవకాశం...
శ్రీలంక, టీమిండియా మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు, బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో ఈ మ్యాచ్ సిరీస్ విజేతను నిర్ణయించబోతోంది. గత 11 టీ20 సిరీసుల్లో ఓటమి ఎరుగని టీమిండియా, కరోనా కారణంగా ప్రధాన ప్లేయర్లను లేకుండా బరిలో దిగుతుండడంతో ఉత్కంఠ రేగింది...
టీ20 వరల్డ్కప్ ముందు భారత జట్టు ఆడబోయే ఆఖరి టీ20 మ్యాచ్ ఇదే... దీంతో శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ వంటి ప్లేయర్లు టీ20 వరల్డ్కప్లో చోటు దక్కించుకోవాలంటే ఈ మ్యాచ్లో రాణించడం అత్యంత కీలకం..
రెండో టీ20లో గాయపడిన నవ్దీప్ సైనీ స్థానంలో యంగ్ స్పిన్నర్ సందీప్ వారియర్ అంతర్జాతీయ ఆరంగ్రేటం చేస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో ఆకట్టుకున్న సందీప్ వారియర్, ఇప్పటివరకూ నాలుగు ఐపీఎల్ మ్యాచ్లే ఆడడం విశేషం.
ఈ ఏడాది టీమిండియా తరుపున టీ20ల్లో ఎంట్రీ ఇస్తున్న 9వ ప్లేయర్గా నిలిచాడు సందీప్ వారియర్. ఇప్పటికే ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ఇంగ్లాండ్తో సిరీస్లో ఎంట్రీ ఇవ్వగా మొదటి టీ20లో పృథ్వీషా, వరుణ్ చక్రవర్తి... రెండో టీ20లో దేవ్దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, చేతన్ సకారియా, నితీశ్ రాణా టీమిండియా ద్వారా టీ20ల్లో ఆరంగ్రేటం చేశారు.
భారత జట్టు: శిఖర్ ధావన్, దేవ్దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రాణా, సంజూ శాంసన్, చేతన్ సకారియా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహార్, సందీప్ వారియర్
శ్రీలంక జట్టు: ఆవిష్క ఫెర్నాండో, మినోద్ భనుక, ధనంజయ డి సిల్వ, సదీరా సమరవిక్రమ, ధనుస్ శనక, రమేష్ మెండీస్,వానిందు హసరంగ, చమిత్ కరుణరత్నే, నిశక, అఖిల ధనంజయ, చమీరా