శ్రీలంకతో రెండో వన్డే... తిప్పేసిన యజ్వేంద్ర చాహాల్, టీమిండియా ముందు...
టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో లంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 275 పరుగులు చేసింది. స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్, సీనియర్ పేసర భువనేశ్వర్ కుమార్ మూడేసి వికెట్లతో అదరగొట్టినా, లంక జట్టు మంచి స్కోరు చేయగలిగింది. గత మ్యాచ్లో 262 పరుగులు చేసిన లంక జట్టుకి, ఈ మధ్యకాలంలో ఇదే బెస్ట్ స్కోరు. భారత బౌలర్లు వరుసగా రెండో వన్డేలోనూ లంక జట్టును ఆలౌట్ చేయలేకపోవడం విశేషం.
టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలెట్టిన శ్రీలంక జట్టుకి ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్కి 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
42 బంతుల్లో 6 ఫోర్లతో 36 పరుగులు చేసిన మినోద్ భనుకను అవుట్ చేసిన యజ్వేంద్ర చాహాల్, ఆ తర్వాతి బంతికే భనుక రాజపక్షను డకౌట్ చేశాడు. 77 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయింది శ్రీలంక.
ఓపెనర్ అవిష్క ఫెర్నాండో 71 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్తో 50 పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో అవుట్ కాగా, ధనంజయ డి సిల్వ 45 బంతుల్లో ఓ ఫోర్తో 32 పరుగులు చేశాడు.
16 పరుగులు చేసిన దసున్ శనకను యజ్వేంద్ర చాహాల్ బౌల్డ్ చేయగా 8 పరుగులు చేసన హసరంగను దీపక్ చాహార్ బౌల్డ్ చేశాడు...
194 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన శ్రీలంక జట్టును చరిత్ అసలంక, కరుణరత్నే కలిసి ఆదుకున్నారు. ఏడో వికెట్కి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు..
67 బంతుల్లో 6 ఫోర్లతో 65 పరుగులు చేసిన చరిత్ అసలంక, భువీ బౌలింగ్లో భారీ షాట్కి ప్రయత్నించి పడిక్కల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
దీపక్ చాహార్ వేసిన 49వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన చమికా కరుణరత్నే, భువీ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. 33 బంతుల్లో 5 ఫోర్లతో 44 పరుగులు చేశాడు. 50వ ఓవర్ మొదటి బంతికి చమీరాను భువీ అవుట్ చేయగా, సందకన్ రనౌట్ అయ్యాడు.
భారత బౌలర్లలో యజ్వేంద్ర చాహాల్, భువనేశ్వర్ కుమార్లకు మూడేసి వికెట్లు దక్కగా, దీపక్ చాహార్కు రెండు వికెట్లు దక్కాయి...