లంక టూర్కి జట్టును ప్రకటించిన బీసీసీఐ... కెప్టెన్గా శిఖర్ ధావన్... పూర్తి జట్టు ఇదే...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా సిద్ధమవుతుండగా, వన్డే, టీ20 సిరీస్ కోసం లంకలో పర్యటించే భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. 20 మంది పరిమిత ఓవర్ల స్పెషలిస్టు ప్లేయర్లతో రూపొందించిన ఈ జట్టుకు భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ కోచ్గా వ్యవహారిస్తారు.
అందరూ ఊహించినట్టుగానే సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్కి భారత్ బీ జట్టు సారథ్య బాధ్యతలు దక్కాయి. జూలై 13 నుంచి ప్రారంభమయ్యే ఈ టూర్లో భారత జట్టు, లంకతో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడనుంది...
విజయ్ హాజారే ట్రోఫీ, ఐపీఎల్ 2021 సీజన్ పార్ట్ 1లో అదరగొట్టిన యంగ్ ఓపెనర్ పృథ్వీషాతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్, చెన్నై సూపర్ కింగ్స్ యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్లో ఈ టూర్లో చోటు దక్కింది.
మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, హార్ధిక్ పాండ్యాలతో పాటు కేకేఆర్ ఓపెనర్ నితీశ్ రాణాకి చోటు కల్పించారు సెలక్టర్లు...
వికెట్ కీపర్లుగా ఇషాన్ కిషన్, సంజూ శాంసన్లు వ్యవహారించబోతున్నారు. తెలుగు వికెట్ కీపర్ కెఎస్ భరత్కి మాత్రం మరోసారి నిరాశే ఎదురైంది.
స్పిన్నర్లుగా యజ్వేంద్ర చాహాల్, రాహుల్ చాహాల్, కృష్ణప్ప గౌతమ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, కృనాల్ పాండ్యాలకు చోటు దక్కింది...
భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, ఈ టూర్కి వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు.
భువీకి తోడుగా దీపక్ చాహార్, నవ్దీప్ సైనీ, రాజస్థాన్ రాయల్స్ యంగ్ పేసర్ చేతన్ సకారియాలకు లంక టూర్లో చోటు దక్కింది.
వీరితో పాటు నెట్ బౌలర్లుగా ఇషాన్ పోరెల్, సందీప్ వారియర్, ఆర్ష్దీప్ సింగ్, సాయి కిషో, సిమార్జిత్ సింగ్లకు చోటు దక్కింది.
లంకలో పర్యటించే భారత పూర్తి జట్టు ఇదే: శిఖర్ ధావన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీషా, దేవ్దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, హార్ధిక్ పాండ్యా, నితీశ్ రాణా, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, యజ్వేంద్ర చాహాల్, రాహుల్ చాహార్, కె గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చాహార్, నవ్దీప్ సైనీ, చేతన్ సకారియా.
వీరిలో దేవ్దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రాణా, కృష్ణప్ప గౌతమ్, చేతన్ సకారియా తొలిసారి టీమిండియాకి ఎంపిక కావడం విశేషం. వరుణ్ చక్రవర్తి ఇప్పటికే రెండుసార్లు జట్టుకి ఎంపికైనా ఒక్కసారి కూడా ఆడలేదు. రాజస్తాన్ రాయల్స్ తరుపున అదరగొట్టిన రాహుల్ తెవాటియా మాత్రం భారత జట్టు తరుపున ఒక్క మ్యాచ్ కూడా ఆడకకుండానే జట్టులో చోటు కోల్పోయాడు.