MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Inzamam-ul-Haq: మాతో మ్యాచ్ అనగానే భారత్ భయపడింది.. పాకిస్థాన్ మాజీ సారథి షాకింగ్ కామెంట్స్

Inzamam-ul-Haq: మాతో మ్యాచ్ అనగానే భారత్ భయపడింది.. పాకిస్థాన్ మాజీ సారథి షాకింగ్ కామెంట్స్

India Vs pakistan: కొద్దిరోజుల క్రితం  దుబాయ్ లో జరిగిన పొట్టి ప్రపంచకప్ లో  పాకిస్థాన్ తో మ్యాచ్ కు ముందే భారత్ భయపడిందని ఆ జట్టు మాజీ సారథి ఇంజమామ్ ఉల్ హక్ సంచలన  వ్యాఖ్యలు చేశాడు.  ఇండియా ఆటగాళ్లంతా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని కామెంట్స్ చేశాడు. 

2 Min read
Sreeharsha Gopagani
Published : Nov 26 2021, 03:05 PM IST| Updated : Nov 26 2021, 03:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ లో భాగంగా చిరకాల ప్రత్యర్థులైన  ఇండియా-పాకిస్థాన్ ల మధ్య అక్టోబర్ 24న మ్యాచ్ జరగగా.. ఆ పోరులో భారత్ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే.

28

అయితే ఇప్పుడు ఇదే విషయమై  పాకిస్థాన్ మాజీ సారథి ఇంజమామ్ ఉల్ హక్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తమతో మ్యాచ్ కు ముందే  భారత్ భయపడిందని, అది ప్రతి భారత ఆటగాడి ముఖంలో కనిపించిందని చెప్పాడు. 

38

పాక్ కు చెందిన ఓ ఛానెల్ తో మాట్లాడిన ఇంజమామ్.. ‘పాకిస్థాన్ తో మ్యాచ్ కు  ముందే భారత ఆటగాళ్లకు భయం పట్టుకుంది. అది ప్రతి ఒక్క ఆటగాడి ముఖంలో స్పష్టంగా కనిపించింది. కావాలంటే మీరు టాస్ నుంచే గమనించండి.

48
india vs pakistan toss

india vs pakistan toss

టాస్ సందర్భంగా పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, టీమిండియా సారథి విరాట్ కోహ్లి ని గమనించండి.. కోహ్లి ముఖంలో ఒత్తిడి కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇక రోహిత్ శర్మ అయితే తీవ్రమైన ఒత్తిడిలో కనిపించాడు. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ లు ఔట్ అయిన తర్వాత ఆ జట్టు మొత్తం పూర్తి నిరాశతో కనిపించింది.

58

భారత జట్టుతో పోల్చితే పాకిస్థాన్ ఆటగాళ్లు ఉత్సాహంగా కనిపించారు. రోహిత్, రాహుల్ ఔట్ అయ్యాక మ్యాచ్ తమదే  అయిందన్న ధీమా వారిలో కనిపించింది. ఇక టోర్నీ హాట్ ఫేవరేట్లుగా వచ్చిన టీమిండియా.. పాక్ తో పరాభావంతో కాస్త సమయం దొరికినా పుంజుకోలేదు..’ అని ఇంజమామ్ అన్నాడు. 

68

‘పాక్ తో మ్యాచ్ తర్వాత భారత జట్టుకు వారం రోజుల టైమ్ దొరికింది. అయినా వాళ్లు దానిని సద్వినియోగం చేసుకోలేదు. న్యూజిలాండ్ తో మ్యాచ్ లో కూడా ఆ జట్టుకు సరెండర్ అయ్యరు. ఇక  స్పిన్ ను భాగా ఆడగలరనే పేరున్న భారత ఆటగాళ్లు.. కివీ స్పిన్నర్లు శాంట్నర్, సోధి లను కూడా ఎదుర్కోలేక ఇబ్బందులు పడ్డారు..’ అని  వ్యాఖ్యానించాడు.

78

ఇంత దారుణంగా టీమిండియా మునుపెన్నడూ ఆడటం తాను చూడలేదని ఇంజమామ్ చెప్పాడు. టీ20లలో గత రెండు  మూడేండ్లుగా అద్భుతంగా రాణించిన భారత జట్టు.. టీ20 ప్రపంచకప్ టోర్నీ హాట్ ఫేవరెట్ గా వచ్చి సూపర్-12లోనే నిష్క్రమించడం నిరాశ కలిగించిందని చెప్పాడు. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత వారిలో చాలా ఒత్తిడి పెరిగిపోయిందని అన్నాడు. 

88

కాగా.. టీ20 ప్రపంచకప్ లో  పాకిస్థాన్, న్యూజిలాండ్ తో ఓడిన భారత జట్టు.. ఆ తర్వాత ఆఫ్గనిస్థాన్, స్కాట్లాండ్, నమీబియాను ఓడించింది. అయినా అఫ్గాన్ తో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలవడంతో కివీస్ ఫైనల్ కు వెళ్లింది. కానీ ఫైనల్లో ఆ జట్టు ఆసీస్ పై ఓడింది. ఆ తర్వాత భారత పర్యటనకు వచ్చి  టీ20 సిరీస్ ను కూడా కోల్పోయిన విషయం తెలిసిందే. 

About the Author

SG
Sreeharsha Gopagani
భారత దేశం
పాకిస్తాన్
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
Recommended image2
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !
Recommended image3
T20 World Cup: దటీజ్ ఇషాన్ కిషన్.. వరల్డ్ కప్ జట్టులో చోటు కోసం ఏం చేశాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved