- Home
- Sports
- Cricket
- saqib mahmood: వికెట్, వికెట్, వికెట్.. ఒకే ఓవర్లో టీమిండియాను దెబ్బకొట్టిన బౌలర్
saqib mahmood: వికెట్, వికెట్, వికెట్.. ఒకే ఓవర్లో టీమిండియాను దెబ్బకొట్టిన బౌలర్
india vs england: ఇంగ్లాండ్ తో జరిగిన నాల్గో టీ20 మ్యాచ్ లో ప్రారంభంలో వరుస వికెట్లు తీసుకుని భారత్ ను దెబ్బకొట్టాడు సాకిబ్ మహమూద్. అయితే, శివమ్ దూబే-హార్ధిక్ పాండ్యా సూపర్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు.

Image Credit: Getty Images
India vs England: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది టీమిండియా. బ్యాటింగ్కు దిగిన భారత జట్టు టాప్ ఆర్డర్ పూర్తిగా గందరగోళంగా మారి వరుసగా వికెట్లు సమర్పించుకుంది. దీంతో భారత్ మ్యాచ్ ను కోల్పోతుందా అనే ప్రశ్నలను లేవనెత్తింది.
ఇన్నింగ్స్ రెండో ఓవర్ లోనే భారత జట్టులోని ముగ్గురు గొప్ప బ్యాట్స్ మెన్ పెవిలియన్ బాట పట్టారు. తన తొలి ఓవర్లోనే టీమిండియాను సర్వనాశనం చేశాడు ఇంగ్లాండ్ బౌలర్ సాకిబ్ మహమూద్.
Tilak Verma
టీమిండియా 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది
ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి ఓవర్లో భారత జట్టు 10 పరుగులు చేసింది. భారత్తో తొలిసారి టీ20 ఆడుతున్న సాకిబ్ మహమూద్ రెండో ఓవర్లో బౌలింగ్ చేయడానికి వచ్చాడు. వచ్చిరావడంతోనే సూపర్ బౌలింగ్ తో దుమ్మురేపాడు.
తన ఓవర్లో ముగ్గురు భారత స్టార్ బ్యాట్స్మెన్లకు పెవిలియన్ దారి చూపించాడు. మొదట సంజూ శాంసన్ 1 పరుగు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికి తిలక్ వర్మ భారీ షాట్తో వికెట్ కోల్పోయాడు. అదే సమయంలో బ్యాటింగ్ కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఈ ఫాస్ట్ బౌలర్ చేతిలో సులువుగా చిక్కుకున్నాడు.
Saqib Mahmood
ఎవరీ సాకిబ్ మహమూద్?
ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ సాకిబ్ మహమూద్ పూణె టీ20కి ముందు ఇంగ్లిష్ జట్టు తరఫున 18 మ్యాచ్లు ఆడాడు. ఇందులో 18 వికెట్లు తీసుకున్నాడు. అయితే భారత పర్యటనలో తొలి ఓవర్తోనే అందరి హృదయాలను గెలుచుకున్నాడు. మార్క్ వుడ్ స్థానంలో అతడిని ఇంగ్లాండ్ టీమ్ పుణె టీ20లో చేర్చుకుంది.
ప్రారంభంలో కష్టాల్లో పడిన భారత్.. కానీ చివరకు మంచి స్కోరు
పూణెలో, భారత్ స్కోరు 100 కంటే ముందే ఐదుగురు బ్యాట్స్మెన్లను కోల్పోయింది. టీమ్ ఇండియా బ్యాటింగ్ చురుగ్గా సాగిన తర్వాత అందరి టార్గెట్ సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ పై పడింది. కానీ, ఈ మొత్తం సిరీస్లో ఇద్దరూ ఫ్లాప్గా కనిపించారు. శాంసన్ గత మూడు మ్యాచ్ల్లో వరుసగా సింగిల్ డిజిట్లో అవుటయ్యాడు.
అయితే, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలు భారత జట్టుకు మంచి స్కోర్ అందించారు. అద్భుతమైన షాట్స్ ఆడుతూ ఇద్దరూ హాఫ్ సెంచరీలు కొట్టారు. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నోలుక్స్ సిక్సర్లు అద్భుతంగా బాదాడు. హార్దిక్ కేవలం 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హార్దిక్ పాండ్యా 53 పరుగుల తన ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు.
హార్దిక్ పాండ్యా ఔట్ అయిన తర్వాత శివమ్ దూబే దంచికొట్టాడు. సూపర్ షాట్స్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 53 పరుగుల తన ఇన్నింగ్స్ దూబే 7 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. దీంతో భారత జట్టు 20 ఓవర్లలో భారత్ 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలలో సాకిబ్ మహమూద్ 3 వికెట్లు, జామీ ఓవర్టన్ 2 వికెట్లు తీసుకున్నారు.