IND vs BAN: బంగ్లాపై భారత్ గురి.. గెలుపు మనదే.. ఎందుకంటే?
India vs Bangladesh: ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ తో తన తొలి మ్యాచ్ లో భారత్ తలపడుతుంది. గతంలో రెండుసార్లు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత్, ఈసారి కూడా గెలవాలని చూస్తోంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Image Credit: Getty Images
India vs Bangladesh: ఐసీసీ మెన్స్ క్రికెట్ ప్రపంచ కప్ 2023ఫైనలిస్ట్, గత ఏడాది ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో సత్తా చాటాలని చూస్తోంది. ఎలాగైనా మిని వరల్డ్ కప్ గా గుర్తింపు పొందిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవాలని టోర్నీలో అడుపెడుతోంది. తన తొలి మ్యాచ్ టీమిండియా బంగ్లాదేశ్ తో ఆడనుంది. బంగ్లాపై గెలిచి శుభారంభం చేయాలని చూస్తోంది.
Image Credit: Getty Images
భారత జట్టు బలం వారే
ఈసారి రోహిత్ శర్మ జట్టులో కీలక బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేడు. ఇది భారత్ కు పెద్ద దెబ్బని చెప్పాలి. అయితే, మిగతా బౌలింగ విభాగానికి తోడుగా బలమైన బ్యాటింగ్ విభాగం భారత్ అవకాశాలను మెగుగైన స్థితిలో ఉంచుతున్నాయి. ఈ మెగా టోర్నీకి ముందు విరాట్ కోహ్లీ ఫామ్ లోకి రావడం కూడా భారత్ కు అనుకూలించే అంశం. విరాట్ కోహ్లీ బ్యాట్ పనిచేస్తే ఐసీసీ టోర్నమెంట్లలో అతన్ని అడ్డుకోవడం ఏ జట్టుకైనా కష్టమే కాబట్టి భారత్ కింగ్ కోహ్లీపై భారీ అంచనాలే పెట్టుకుంది.
కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ ఇటీవల ఇంగ్లాండ్ పై అద్భుతమైన బ్యాటింగ్ తో సెంచరీలు సాధించి ఫామ్ ను అందుకున్నారు. శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా కూడా అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. విరాట్ కోహ్లీ బ్యాట్ నుండి అర్ధ సెంచరీ కనిపించింది. అలాగే, స్పిన్ బౌలింగ్ పై కూడా రోహిత్ శర్మ నమ్మకం పెట్టుకున్నారు.
Indian Fans
బంగ్లాదేశ్ కూడా స్పిన్ బాగా ఆడగలదు. పెద్ద టోర్నీల్లో సంచలనం సృష్టించగలదు. 2007లో భారత్ పై గెలిచిన స్ఫూర్తితో బరిలోకి దిగుతోంది. అనుభవమున్న ఆటగాళ్లు రాణిస్తారని ఆశిస్తోంది.
ఇరు జట్ల ప్రదర్శనలు, రీసెంట్ ఫామ్ ఎలా ఉంది?
భారత్: ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో భారత్ అద్భుతమైన ప్రదర్శనతో సిరీస్ ను కైవసం చేసుకుంది. మంచి ఫామ్ లో ఉంది. ఇటీవల ముగిసిన వన్డే సిరీస్ లో 3-0తో ఇంగ్లాండ్ ను వైట్ వాష్ చేసింది. అంతకుముందు, ఐదు మ్యాచ్ ల T20I సిరీస్ లో ఇంగ్లాండ్ ను 4-1తో ఓడించింది. గత నెలలో ఏడు విజయాలు సాధించింది. ఇది జట్టుకు బలమైన నమ్మకాన్ని ఇస్తుంది.
బంగ్లాదేశ్: బంగ్లాదేశ్ ఫామ్ అంచనా వేయడం కష్టం. డిసెంబర్ నుంచి క్రికెట్ ఆడలేదు. వెస్టిండీస్ పర్యటనలో 3-0 తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత జరిగిన టీ20 సిరీస్ ను గెలుచుకుంది. నవంబర్ లో యూఏఈలో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన వన్డే సిరీస్ లో 2-1తో ఓడిపోయింది. కానీ, ఈ జట్టులోని ప్లేయర్లు రాణిస్తే ఎలాంటి జట్టుపైన అయిన సంచలనాలు సాధించగల టీమ్.
వీరిపైనే అందరి చూపు:
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో అర్ష్ దీప్ సింగ్ బౌలింగ్ పై ఎక్కువ దృష్టి ఉంటుంది. 26 ఏళ్ల అర్ష్ దీప్ సింగ్ కొత్త బంతితో రాణిస్తాడు. అతను బుమ్రా స్థానాన్ని భర్తీ చేయగలడు. అయితే, టీ20 క్రికెట్ లో దుమ్మురేపే బౌలింగ్ తో అదరగొట్టిన అర్ష్ దీప్ సింగ్ కు వన్డేల్లో పెద్దగా అనుభవం లేదు. అతను 9 వన్డేల్లో 23.00 సగటుతో 14 వికెట్లు తీశాడు.
ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే మెహిదీ హసన్ మిరాజ్.. 27 ఏళ్ల ఈ ఆల్ రౌండర్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో రాణించాలంటే అతను అన్ని విభాగాల్లోనూ సత్తా చాటాలి. వెస్టిండీస్ పర్యటనలో 3 వన్డేల్లో 50.66 సగటుతో 152 పరుగులు చేశాడు. టీ20 సిరీస్ లో 8 వికెట్లు తీశాడు. అతనిపై బంగ్లా టీమ్ భారీ అంచనాలే పెట్టుకుంది.
Champions Trophy
IND vs BAN: ఇప్పటివరకు భారత్ దే పై చేయి
భారత్-బంగ్లాదేశ్ టీమ్స్ 41 వన్డే మ్యాచ్లు ఆడాయి. ఈ మ్యాచ్లలో భారత జట్టు 32 విజయాలు సాధించగా, బంగ్లాదేశ్ జట్టు 8 విజయాలు సాధించింది. ఒక మ్యాచ్లో ఫలితం రాలేదు. ఇక దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్ జట్టు వన్డే ఫార్మాట్లో ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడింది. అందులో 5 విజయాలు సాధించగా, ఒక మ్యాచ్ టై అయింది.
ఛాంపియన్స్ ట్రోఫీ: భారత్-బంగ్లాదేశ్ జట్లు
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్ దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.
బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్, తంజిద్ హసన్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, ఎండీ మహ్ముదుల్లా, జాకెర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, రిషద్ హొస్సేన్, టాస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, నసుమ్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, నహీద్ రాణా.