MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఐర్లాండ్ టూర్‌కు భారత్.. షెడ్యూల్ విడుదల.. ఆసియా కప్ ముందు మరో టీ20 సిరీస్

ఐర్లాండ్ టూర్‌కు భారత్.. షెడ్యూల్ విడుదల.. ఆసియా కప్ ముందు మరో టీ20 సిరీస్

BCCI: విండీస్ తో సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు.. అమెరికా నుంచి  నేరుగా ఐర్లాండ్ కు వెళ్లనుంది. 

2 Min read
Author : Srinivas M
Published : Jun 28 2023, 12:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఆసియా కప్‌కు ముందు భారత్  రెండు దేశాల పర్యటనకు వెళ్లనుంది.  ఇదివరకే వెస్టిండీస్ టూర్ షెడ్యూల్ విడుదలవగా తాజాగా ఆగస్టులో  భారత్.. ఐర్లాండ్ పర్యటనకు  కూడా వెళ్లనుంది.  ఈ మేరకు బీసీసీఐ షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ టూర్ లో భారత జట్టు  మూడు టీ20లు ఆడనుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

జులై మొదటివారంలో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అక్కడ కరేబియన్ టీమ్ తో  రెండు టెస్టులు, మూడు వన్డేలు,  ఐదు టీ20లు ఆడనుంది. వెస్టిండీస్ తో టీ20 సిరీస్ లో చివరి రెండు మ్యాచ్ లు అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా జరుగుతాయి.  ఆగస్టు 13న  ఈ సిరీస్ ముగియనుంది. 

36

విండీస్ తో సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు.. అమెరికా నుంచి  నేరుగా ఐర్లాండ్ కు వెళ్లనుంది.  ఐర్లాండ్ తో ఆగస్టు 18, 20, 23 న  మూడు టీ20 మ్యాచ్ లు  జరుగుతాయి. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటనలో  టూర్ వివరాలను పంచుకుంది. ఈ మ్యాచ్ లన్నీ డబ్లిన్ వేదికగా జరుగుతాయి. 

46

2022 లో  కూడా భారత జట్టు   జులై - ఆగస్టులలో ఇంగ్లాండ్ టూర్  జరుగుతుండగానే  హార్ధిక్ పాండ్యా  సారథ్యంలోని టీ20 టీమ్.. ఐర్లాండ్ తో ఇదే డబ్లిన్ వేదికగా రెండు  టీ20లు ఆడి రెండూ గెలుచుకుంది. ఇప్పుడు మళ్లీ అదే వేదికగా ఐర్లాండ్ తో తలపడనుంది.  

56

ఐర్లాండ్ తో టూర్ ముగిశాక భారత జట్టు ఆసియా కప్ ఆడనుంది.  ఆసియా కప్ కు సంబంధించిన తుది షెడ్యూల్ ఇంకా విడుదల కానప్పటికీ ఆగస్టు చివరివారం నుంచి  సెప్టెంబర్ రెండో వారం దాకా ఈ టోర్నీ జరుగనుంది.  పాకిస్తాన్, శ్రీలంకలలో ఈ మ్యాచ్ లు జరుగుతాయి. భారత్ ఆడే మ్యాచ్ లు శ్రీలంకలోనే ఉన్నాయి. 

66

ఇక ఆసియా కప్ ముగిసిన తర్వాత సెప్టెంబర్  లోనే భారత జట్టు స్వదేశంలో అఫ్గానిస్తాన్ తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది.  ఆస్ట్రేలియాతో కూడా మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ ఉన్నా అది ఇంకా  తుది రూపు దాల్చలేదు. అక్టోబర్  5 నుంచి వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో  భారత్.. వన్డే ఫార్మాట్ పైనే అధికంగా ఫోకస్ చేసింది.  

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
Hardik Pandya: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పాయే.. ఇప్పుడు టీమిండియా నుంచి ఔట్? హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్
Recommended image2
IPL 2026: ముంబైకి కేకేఆర్ షాక్.. ప్లేఆఫ్స్ రేసులోకి కోల్‌కతా.. ఆ ఫోర్త్ బెర్త్ ఎవరిదో?
Recommended image3
Kohli Mental Health : ఇంపోస్టర్ సిండ్రోమ్ తో బాధపడుతున్న విరాట్ కోహ్లీ .. లక్షణాలేంటో తెలుసా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved