MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • పాక్ కు భార‌త్ షాక్.. హైబ్రిడ్ మోడల్‌లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025

పాక్ కు భార‌త్ షాక్.. హైబ్రిడ్ మోడల్‌లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025

ICC Champions Trophy 2025: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం హైబ్రిడ్ మోడల్‌ను ఆమోదించింది. అయితే, దీనికి పాకిస్తాన్ మాత్రమే ఆతిథ్యం ఇవ్వవలసి ఉంది. ఇప్పుడు రెండు దేశాల్లో జ‌ర‌గ‌నుంది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 13 2024, 07:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ICC Champions Trophy 2025

ICC Champions Trophy 2025

ICC Champions Trophy 2025: పాకిస్థాన్ కు షాక్ త‌గిలింది. ఐసీసీ ట్రోఫీ అయిన‌ప్ప‌టికీ పాకిస్థాన్ వెళ్లేది లేద‌ని భార‌త్ తేల్చిచెప్ప‌డంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వెనక్కిత‌గ్గ‌క త‌ప్ప‌లేదు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం హైబ్రిడ్ మోడల్‌ను ఆమోదించింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) మధ్య ఒప్పందం ప్రకారం ఇప్పుడు మ్యాచ్‌లు పాకిస్తాన్ తో పాటు దుబాయ్‌లో కూడా జ‌రుగుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అలాగే, రెండు బోర్డులు 2026 టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ ల‌పై కూడా ఏకాభిప్రాయానికి వచ్చాయి. భారత్‌తో జరిగే లీగ్-స్టేజ్ మ్యాచ్ ల కోసం పాకిస్తాన్ భారతదేశానికి వెళ్లకూడదని నిర్ణయించుకుంది. బదులుగా ఇది కొలంబోలో ఈ మ్యాచ్ లు జ‌ర‌గ‌నున్నాయి. దీని కోసం పీసీబీ ఎటువంటి ఆర్థిక పరిహారం పొందనప్పటికీ, వారు 2027 తర్వాత ఐసీసీ మహిళల టోర్నమెంట్ కోసం హోస్టింగ్ హక్కులను పొందారు. ఈ ఒప్పందానికి అన్ని వాటాదారుల నుండి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింది. 

35

దుబాయ్ లో భార‌త్ మ్యాచ్ లు 

పీసీబీ, బీసీసీఐ ఒప్పందం తర్వాత హైబ్రిడ్ మోడల్‌లో ఛాంపియన్స్ ట్రోఫీని ICC ఆమోదించింది. పాకిస్థాన్‌లోని మూడు వేదికలపై మ్యాచ్‌లు జ‌ర‌గ‌డంతో పాటు దుబాయ్‌లో భారత్ గేమ్‌లు జరగనున్నాయి. 

45

2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం పాకిస్థాన్ భారత్‌కు వెళ్లదని బీసీసీఐ, పీసీబీ సూత్రప్రాయంగా అంగీకరించాయి. సహ ఆతిథ్యమిచ్చే శ్రీలంకలో ఈ మ్యాచ్ జరగనుంది. భారత్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని కోల్పోయినందుకు పీసీబీకి పరిహారం లేదు.

దీనికి బదులుగా పీసీబీ 2027 తర్వాత ఐసీసీ మహిళల టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తుంది. ఐసీసీ, బీసీసీఐ, పీసీబీ మూడు పార్టీలు కూడా తాజా నిర్ణ‌యాన్ని ఆహ్వానించాయి. దీంతో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. దుబాయ్‌లో భారత్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడం దాదాపు ఖాయమని వర్గాలు సూచిస్తున్నాయి. ఈ విషయమై పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సమావేశమయ్యారు. ఏదైనా ఒప్పందాన్ని ఖరారు చేసే ముందు పీసీబీ ప్రభుత్వాన్ని సంప్రదిస్తుందని షరీఫ్ పునరుద్ఘాటించారు.

55
Rohit Sharma and Mohammed Shami

Rohit Sharma and Mohammed Shami

2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరగాల్సి ఉంది. ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపు నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు, ఆ తర్వాత ఫైనల్‌కు చేరుకుంటాయి. ఈ హైబ్రిడ్ హోస్టింగ్ ఫార్మాట్ గత సంవత్సరం పురుషుల 50-ఓవర్ ఆసియా కప్‌లో ఉపయోగించిన విధానం ఉండ‌నుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత దేశం
పాకిస్తాన్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image3
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved