MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఆసియా కప్‌ : పాక్‌ నెట్‌ బౌలర్లకు దూరంగా భారత్.. ఎందుకంటే?

ఆసియా కప్‌ : పాక్‌ నెట్‌ బౌలర్లకు దూరంగా భారత్.. ఎందుకంటే?

India Cricket Team: షేక్‌ హ్యాండ్‌ వివాదం నేపథ్యంలో ఆసియా కప్‌లో భారత జట్టు ఆటగాళ్లకు పాక్‌ నెట్‌ బౌలర్లతో దూరం పాటించాలని కఠిన ఆదేశాలు జారీ అయ్యాయని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Mahesh Rajamoni
Published : Sep 17 2025, 07:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
షేక్‌ హ్యాండ్‌ వివాదం తర్వాత భారత జట్టుకు కొత్త ఆదేశాలు
Image Credit : X/ Baba Umar

షేక్‌ హ్యాండ్‌ వివాదం తర్వాత భారత జట్టుకు కొత్త ఆదేశాలు

ఆసియా కప్‌ 2025లో కొనసాగుతున్న షేక్‌ హ్యాండ్‌ వివాదం మరింత ముదురుతోంది. ఈ క్రమంలోనే తాజాగా భారత జట్టుకు కఠిన ఆదేశాలు అందినట్టు సమాచారం. మంగళవారం దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీకి చేరుకున్న సూర్యకుమార్‌ యాదవ్‌ నాయకత్వంలోని జట్టుకు, పాక్‌ నెట్‌ బౌలర్లతో ఎలాంటి సంబంధం పెట్టుకోకూడదని మేనేజ్‌మెంట్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని పలు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.

DID YOU
KNOW
?
ఆసియా కప్ లో భారత్
ఇప్పటివరకు భారత్ 8 సార్లు ఆసియా కప్ ఛాంపియన్ గా నిలిచింది. 2025 టోర్నీలోనూ ట్రోఫీని సాధించాలని టార్గెట్ తో ముందుకు సాగుతోంది.
26
నెట్‌ బౌలర్లతో ఎందుకు దూరంగా ఉండమన్నారు?
Image Credit : Getty

నెట్‌ బౌలర్లతో ఎందుకు దూరంగా ఉండమన్నారు?

ఐసీసీ అకాడమీలో పాక్, ఆఫ్ఘాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, భారత్‌ నెట్‌ బౌలర్లు ప్రాక్టీస్‌ కోసం అందుబాటులో ఉంటారు. గతంలో కూడా భారత ఆటగాళ్లు దేశం సంబంధం లేకుండా వారితో మాట్లాడేవారు. 2018/19 ఆస్ట్రేలియా టూర్‌లో హారిస్‌ రౌఫ్‌ భారత్‌ జట్టుకు నెట్‌ బౌలర్‌గా ఉండగా విరాట్‌ కోహ్లీతో సహా పలువురు ఆటగాళ్లతోనూ కలిశారు. కానీ ఈ సారి ఆ అవకాశం లేకుండా పోయింది. 

ఎందుకంటే పహాల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అలాగే, ఆసియా కప్ లో భారత్ – పాక్ మ్యాచ్ భారత ఆటగాళ్లు కరచాలనం చేయడానికి కూడా ఇష్టపడలేదు. దీని గురించి కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ముందే మీడియాతో మాట్లాడుతూ అన్నారు. తాను షేక్ హ్యాండ్ ఇవ్వననీ, మిగతా ప్లేయర్లకు వారి ఇష్టమని పేర్కొంన్నారు.

Related Articles

Related image1
షేక్‌ హ్యాండ్‌ వివాదం.. యూఏఈ తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్‌
Related image2
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్‌ లో గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా
36
మొబైల్‌ ఫోన్లపై కూడా ఆంక్షలు
Image Credit : X/Johns.

మొబైల్‌ ఫోన్లపై కూడా ఆంక్షలు

జియో న్యూస్‌ నివేదిక ప్రకారం, పాక్ నెట్‌ బౌలర్లు ప్రాక్టీస్‌ సమయంలో మొబైల్‌ ఫోన్లు సమర్పించాల్సి ఉంటుంది. సెషన్‌ పూర్తైన తర్వాతే తిరిగి ఇస్తారు. అలాగే భారత ఆటగాళ్లు పాక్‌ నెట్‌ బౌలర్లతో మాట్లాడకూడదని, ఫోటోలు దిగకూడదని కఠినంగా ఆదేశాలు జారీ అయ్యాయని కూడా రిపోర్టులు పేర్కొన్నాయి.

46
ప్రాక్టీస్‌, ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ రద్దు
Image Credit : stockPhoto

ప్రాక్టీస్‌, ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ రద్దు

బుధవారం (సెప్టెంబర్‌ 17న) జరగాల్సిన మూడు గంటల ప్రాక్టీస్‌ సెషన్‌, ప్రీ-మ్యాచ్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ను భారత్‌ రద్దు చేసింది. బీసీసీఐ అధికారిక ప్రకటన ప్రకారం, ఆ రోజును విశ్రాంతి రోజుగా నిర్ణయించారు. ప్రాక్టీస్‌, ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ సమయాలు గురువారం వెల్లడిస్తామని బోర్డు తెలిపింది.

56
పాకిస్తాన్‌ పాల్గొనడంపై అనిశ్చితి
Image Credit : ANI

పాకిస్తాన్‌ పాల్గొనడంపై అనిశ్చితి

మరోవైపు పాకిస్తాన్‌ యూఏఈ మ్యాచ్‌లో ఆడుతుందా అన్న అనుమానాలు కొనసాగుతున్నాయి. రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తప్పించాలని పీసీబీ రెండోసారి ఐసీసీకి లేఖ రాసింది. కానీ ఐసీసీ ఈ డిమాండ్‌ను అంగీకరించలేదు. మధ్యవర్తిత్వం కోసం యూఏఈ బోర్డు అధికారులు జోక్యం చేసుకున్నారని సమాచారం. రిచీ రిచర్డ్సన్‌ను ఆ మ్యాచ్‌ రిఫరీగా నియమించే ప్రతిపాదన చర్చకు వచ్చినా, తుది నిర్ణయం స్పష్టంగా తెలియరాలేదు.

66
స్పాన్సర్లు, టికెట్ల హోల్డర్ల ఆందోళన
Image Credit : Xtoxifyy18

స్పాన్సర్లు, టికెట్ల హోల్డర్ల ఆందోళన

పీసీబీ బహిష్కరణ హెచ్చరికతో స్పాన్సర్లు, టికెట్‌ హోల్డర్లకు సమస్యలు తలెత్తే అవకాశముందని యూఏఈ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల సమస్య పరిష్కారం కోసం ఐసీసీ, పీసీబీ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఆసియా కప్‌ భవిష్యత్తుపై ఈ వివాదం ప్రభావం చూపనుంది. పాక్ మ్యాచ్ ను ఆడకపోతే టోర్నీ నుంచి అవుట్ అవుతుంది. యూఏఈ సూపర్ ఫోర్ కు చేరుంది. ఇప్పటికే ఈ గ్రూప్ నుంచి భారత్ సూపర్ ఫోర్ కు చేరుకుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
పాకిస్తాన్
ఆసియా కప్ 2025
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved