MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఫ్యాన్స్‌ని భయపెడుతున్న వాంఖడే సెంటిమెంట్... మూడు సార్లు సెమీ ఫైనల్స్ ఆడితే అన్నింట్లోనూ...

ఫ్యాన్స్‌ని భయపెడుతున్న వాంఖడే సెంటిమెంట్... మూడు సార్లు సెమీ ఫైనల్స్ ఆడితే అన్నింట్లోనూ...

వన్డే వరల్డ్ కప్ 2023 ఫివర్ తారా స్థాయికి చేరింది. లీగ్ స్టేజీలో టీమిండియా చూపించిన టాప్ క్లాస్ పర్ఫామెన్స్, ఈసారి మనోళ్లు కప్పు గెలుస్తారని ఫ్యాన్స్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. టైటిల్‌కి ఇంకా రెండు అడుగుల దూరంలోనే నిలిచింది టీమిండియా..

1 Min read
Chinthakindhi Ramu
Published : Nov 14 2023, 04:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
India vs New Zealand

India vs New Zealand

2019 వన్డే వరల్డ్ కప్‌లో టేబుల్ టాపర్‌గా నిలిచిన భారత జట్టు, సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడింది. మళ్లీ నాలుగేళ్ల తర్వాత సెమీస్‌లో న్యూజిలాండ్‌తోనే తలబడనుంది టీమిండియా...

27
Asianet Image

నాలుగేళ్ల క్రితం మాంచెస్టర్‌లో ఎదురైన పరాభవానికి ముంబైలో భారత జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటున్నారు అభిమానులు. అయితే వాంఖడే స్టేడియంలో టీమిండియాకి చెప్పుకోదగ్గ రికార్డు లేదు..
 

37
Asianet Image

2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌ ఆడింది ఇక్కడే. అయితే ఫైనల్ దాకా వెళ్లడం సంగతి పక్కనబెడితే వాంఖడేలో ఆడిన మూడు  సెమీ ఫైనల్స్‌లోనూ భారత జట్టుకి పరాజయమే ఎదురైంది..

47
Asianet Image

1983 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు, డిఫెండింగ్ ఛాంపియన్‌గా 1987 వరల్డ్ కప్ ఆడింది. గ్రూప్ స్టేజీలో మంచి పర్ఫామెన్స్ చూపించిన టీమిండియా, వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో ఓడింది..
 

57
Asianet Image

1987లో ఆరు జట్లతో కలిసి నెహ్రా కప్‌ (MRF వరల్డ్ సిరీస్) టోర్నీ ఆడింది భారత జట్టు. ముంబైలో జరిగిన సెమీస్‌లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. టీమిండియాని ఓడించి ఫైనల్ చేరిన వెస్టిండీస్, పాకిస్తాన్ చేతుల్లో పరాజయం పాలైంది. 
 

67
Virat Kohli Bowling

Virat Kohli Bowling

2016 టీ20 వరల్డ్ కప్‌లో చివరిగా ఇండియా, వాంఖడే స్టేడియంలో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 47 బంతుల్లో 89 పరుగులు చేసి అదరగొట్టడంతో 192 పరుగుల భారీ స్కోరు చేసింది టీమిండియా. అయితే బౌలర్లు చేతులు ఎత్తేయడంతో వెస్టిండీస్ 7 వికెట్ల తేడాతో గెలిచింది..

77
Asianet Image

ఈ పరాజయం తర్వాత ఏడేళ్లకు మళ్లీ ముంబైలోని వాంఖడే స్టేడియంలో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడుతోంది టీమిండియా. మూడు సార్లు, మూడ్‌ని చెడగొట్టిన వాంఖడే, ఈసారి కచ్ఛితంగా 2011 వరల్డ్ కప్ ఫైనల్‌ మూమెంట్స్‌ని రీక్రియేట్ చేయాలని ఆశపడుతున్నారు అభిమానులు.. 

About the Author

Chinthakindhi Ramu
Chinthakindhi Ramu
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved