MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Sports
  • Cricket
  • 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు భారత్ బిడ్‌.. ఈ నగరానికి లక్కీ ఛాన్స్

2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు భారత్ బిడ్‌.. ఈ నగరానికి లక్కీ ఛాన్స్

Commonwealth Games India : కేంద్ర కేబినెట్ 2030 కామన్వెల్త్ గేమ్స్ బిడ్‌కు ఆమోదం తెలిపింది. గుజరాత్ లోని అహ్మదాబాద్‌ను ఆతిథ్య నగరంగా ప్రతిపాదించింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 27 2025, 05:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు కేంద్ర కేబినెట్ ఆమోదం
Image Credit : Getty

కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు కేంద్ర కేబినెట్ ఆమోదం

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర కేబినెట్ కామన్వెల్త్ గేమ్స్-2030 నిర్వహణ బిడ్‌కు బుధవారం అధికారిక ఆమోదం తెలిపింది. ఈ బిడ్‌ను యువజన, క్రీడా వ్యవహారాల మంత్రిత్వశాఖ సమర్పించనుంది. 

అధికారుల ప్రకారం.. బిడ్‌తో పాటు హోస్ట్ కోలాబొరేషన్ అగ్రిమెంట్ (HCA)పై సంతకం చేయడానికి, అవసరమైన మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల నుండి హామీలు ఇవ్వడానికి అనుమతి లభించింది. బిడ్ విజయవంతమైతే గుజరాత్ ప్రభుత్వానికి అవసరమైన ఆర్థిక సహాయం కూడా మంజూరు చేయనుంది.

DID YOU
KNOW
?
కామన్వెల్త్ గేమ్స్ 2026
2026 కామన్వెల్త్ గేమ్స్ స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు జరుగనున్నాయి. ఆస్ట్రేలియా విక్టోరియా ఖర్చుల కారణంగా తప్పుకోవడంతో గ్లాస్గో ఆతిథ్యం ఇస్తోంది. ఈసారి కేవలం 10 క్రీడలతోనే గేమ్స్ నిర్వహిస్తోంది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అహ్మదాబాద్ లో కామన్వెల్త్ గేమ్స్
Image Credit : Narendra Modi/X

అహ్మదాబాద్ లో కామన్వెల్త్ గేమ్స్

2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, దీని కోసం అహ్మదాబాద్‌ను ప్రతిపాదించారు. ప్రపంచంలోనే అతిపెద్ద నరేంద్ర మోడీ స్టేడియం, అధునాతన శిక్షణ సౌకర్యాలు, క్రీడాసంస్కృతి ఉన్న నగరంగా అహ్మదాబాద్‌ను "ఐడియల్ వేదిక"గా కేబినెట్ పేర్కొంది. 

ఈ స్టేడియం ఇప్పటికే 2023 ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్‌తో సహా అనేక అంతర్జాతీయ మ్యాచ్‌లకు వేదికైంది. ఐపీఎల్ ఫైనల్స్‌ (2022, 2023, 2025) నిర్వహించిన అనుభవం కూడా ఉంది.

Related Articles

Related image1
ఐపీఎల్ కు సీఎస్కే స్టార్ ప్లేయర్ వీడ్కోలు.. అశ్విన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు?
Related image2
అశ్విన్ నుంచి చాహల్ వరకు.. ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లు
35
కామన్వెల్త్ గేమ్స్ – ఇండియా బిడ్
Image Credit : Getty

కామన్వెల్త్ గేమ్స్ – ఇండియా బిడ్

కామన్వెల్త్ గేమ్స్ బిడ్ సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 31గా నిర్ణయించారు. భారత ఒలింపిక్ సంఘం (IOA) ఇప్పటికే ఈ ప్రక్రియకు అంగీకారం తెలిపి "ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్" సమర్పించింది. 

వచ్చే 48 గంటల్లో IOA బిడ్ ప్రక్రియను పూర్తి చేస్తుందని అంచనా. భారత్ చివరిసారిగా కామన్వెల్త్ గేమ్స్‌కి ఆతిథ్యం 2010లో ఇచ్చింది. న్యూ ఢిల్లీ వేదికగా ఈ గేమ్స్ నిర్వహించారు.

45
కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణతో ఆర్థిక, ఉపాధి, పర్యాటక లాభాలు
Image Credit : Getty

కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణతో ఆర్థిక, ఉపాధి, పర్యాటక లాభాలు

72 దేశాల క్రీడాకారులు పాల్గొనే కామన్వెల్త్ గేమ్స్ కు అన్ని ఒకే అయితే అహ్మదాబాద్ వేదిక కానుంది. వేల సంఖ్యలో క్రీడాకారులు, కోచ్‌లు, అధికారికులు, పర్యాటకులు, మీడియా ప్రతినిధులు రావడం వల్ల స్థానిక వ్యాపారాలు లాభపడతాయని కేంద్రం తెలిపింది. 

ఈవెంట్ నిర్వహణ వల్ల పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందనీ, ఉపాధి అవకాశాలు విస్తృతంగా వస్తాయని అంచనా. స్పోర్ట్స్ సైన్స్, ఈవెంట్ మేనేజ్‌మెంట్, లాజిస్టిక్స్, రవాణా, ప్రసార మీడియా, ఐటి, కమ్యూనికేషన్, పబ్లిక్ రిలేషన్స్ వంటి విభాగాల్లో ఉద్యోగాలు కలుగనున్నాయి.

55
భారత క్రీడా రంగంలో మరో మైలురాయి
Image Credit : Getty

భారత క్రీడా రంగంలో మరో మైలురాయి

కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ భారత్‌లో క్రీడా రంగానికి దీర్ఘకాలిక సానుకూల ప్రభావం చూపుతుందని కేంద్రం తెలిపింది. "ఈ గేమ్స్ పర్యాటకాన్ని పెంచుతాయి, కొత్త ఉద్యోగాలను సృష్టిస్తాయి, కోట్లాది యువ క్రీడాకారులకు ప్రేరణనిస్తాయి" అని ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ నిర్వహణ జాతీయ గౌరవాన్ని పెంపొందిస్తుందనీ, క్రీడల్లోకి మరింత మంది యువతను ఆకర్షిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది.

కేంద్ర కేబినెట్ ఆమోదంతో భారత్ 2030 కామన్వెల్త్ గేమ్స్ బిడ్‌ను సమర్పించడానికి సిద్ధమైంది. బిడ్ విజయవంతమైతే, ఇది 2010 తర్వాత భారత్‌లో జరిగే రెండో కామన్వెల్త్ గేమ్స్ కానుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రీడలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image2
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image3
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Related Stories
Recommended image1
ఐపీఎల్ కు సీఎస్కే స్టార్ ప్లేయర్ వీడ్కోలు.. అశ్విన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు?
Recommended image2
అశ్విన్ నుంచి చాహల్ వరకు.. ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved