MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Sports
  • Cricket
  • భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ కు వ్యతిరేకంగా ఉప్పల్ స్టేడియం వద్ద ఆందోళనలు

భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ కు వ్యతిరేకంగా ఉప్పల్ స్టేడియం వద్ద ఆందోళనలు

IND VS PAK : పాకిస్తాన్ తో భారత్ క్రికెట్ మ్యాచ్ ఆడటాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వద్ద నిరసనలు వెల్లువెత్తాయి. ఆసియా కప్ సూపర్-4లో భారత్-పాక్ మ్యాచ్ కు ముందు ఆప్ నేతలు నిరసనలు తెలిపారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 21 2025, 07:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఉప్పల్ స్టేడియం వద్ద ఆందోళనలు
Image Credit : ANI

ఉప్పల్ స్టేడియం వద్ద ఆందోళనలు

ఆసియా కప్ 2025 సూపర్ పోరులో భారత్ పాకిస్తాన్ ఆదివారం తలపడుతున్నాయి. అయితే, ఈ మ్యాచ్ ను వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లో పలువురు నిరసనలు తెలిపారు. ఉప్పల్ స్టేడియం వద్ద నిరసనలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

ఆమ్ ఆది పార్టీ నాయకులు ఉప్పల్ స్టేడియం వద్ద భారత్, పాక్ మ్యాచ్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్టీ నియోజకవర్గం చీఫ్ సుధారాణి ఆధ్వర్యంలో కార్యకర్తలు పాక్ జెండా దహనం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, ట్యాంక్ బండ్ (లిబర్టీ) అండర్‌పాస్ వద్ద రాష్ట్ర కన్వీనర్ డా. దిడ్డి సుధాకర్ నేతృత్వంలో నల్ల బట్టలు ధరించి నిరసన తెలిపారు. పాకిస్తాన్ తో క్రికెట్ ఆడటాన్ని వ్యతిరేకిస్తూ ఆప్ నేతలు దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పాకిస్తాన్ పై భారత్ దెబ్బ
Image Credit : stockPhoto

పాకిస్తాన్ పై భారత్ దెబ్బ

ఆసియా కప్ 2025 గ్రూప్‌ దశలో భారత్ చేతిలో ఓటమి చవిచూసిన పాకిస్తాన్ జట్టు.. మరోసారి సూపర్ 4 లో భారత్ తో తలపడుతోంది. అయితే, ఈ మ్యాచ్ కు ముందు ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు మానసిక వికాస నిపుణుడు రహీల్ అహ్మద్‌ను పాకిస్తాన్ పిలిపించుకుంది. మ్యాచ్‌కు ముందురోజు ఆయన ఆటగాళ్లతో భేటీ అయ్యి ఒత్తిడిని తగ్గించే పద్ధతులను వివరించారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోసిన్ నఖ్వి కూడా ఆటగాళ్లను కలసి మానసికంగా బలపరిచే ప్రయత్నం చేశారని సమాచారం.

Related Articles

Related image1
భారత్ vs పాకిస్తాన్: సూపర్ సండే.. సూర్యకుమార్ కామెంట్స్ వైరల్
Related image2
781 పరుగులతో విధ్వంసం.. ప్రపంచ వన్డే క్రికెట్ లో గొప్ప రికార్డు
35
భారత్-పాక్ మరోసారి బిగ్ ఫైట్
Image Credit : stockPhoto

భారత్-పాక్ మరోసారి బిగ్ ఫైట్

ఆసియా కప్‌లో ఇప్పటికే భారత్ పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఇప్పుడు మరోసారి తలపడుతున్నాయి. దీంతో అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరుతుంది. మరోసారి పాక్ గట్టి షాక్ ఇవ్వాలని భారత్ గెలుపు వ్యూహాలతో సిద్ధంగా ఉంది.

45
భారత్ స్పందనపై పాక్ విమర్శలు
Image Credit : X/ Baba Umar

భారత్ స్పందనపై పాక్ విమర్శలు

గ్రూప్ స్టేజ్‌లో జరిగిన మ్యాచ్ తర్వాత పాకిస్థాన్ పీసీబీ మ్యాచ్ రిఫరీపై ఫిర్యాదులు చేస్తూ వివాదాన్ని రగిలించింది. కానీ భారత జట్టు మాత్రం ప్రశాంతంగా వ్యవహరించింది. కెప్టెన్ సూర్యకుమార్ ‘‘ఇది మా కోసం పెద్ద పోరు కాదు, అభిమానులను అలరించడమే మా లక్ష్యం’’ అని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై పాక్ మాజీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం భారత జట్టు ఎప్పుడూ పాక్‌తో పోరును తక్కువ చేసి చూడదని అన్నారు.

55
పాక్‌పై గిల్ అదరగొడతాడా?
Image Credit : Getty

పాక్‌పై గిల్ అదరగొడతాడా?

ఆసియా కప్ 2025 సూపర్-4లో పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌కు ముందు భారత వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. గత మ్యాచ్‌లలో పెద్దగా రాణించలేకపోన గిల్ ఈ మ్యాచ్ లో మంచి ఇన్నింగ్స్ ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. వారం రోజుల్లోనే మళ్లీ భారత్-పాక్ తలపడుతుండటంతో క్రికెట్ లవర్స్ కు పండగలా మారింది. లీగ్ మ్యాచ్ లో ఆధిపత్యం చలాయించిన భారత్ మళ్లీ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. పాకిస్థాన్ గెలుపే టార్గెట్ అంటోంది. దీంతో క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
పాకిస్తాన్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image2
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image3
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Related Stories
Recommended image1
భారత్ vs పాకిస్తాన్: సూపర్ సండే.. సూర్యకుమార్ కామెంట్స్ వైరల్
Recommended image2
781 పరుగులతో విధ్వంసం.. ప్రపంచ వన్డే క్రికెట్ లో గొప్ప రికార్డు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved